ఉద్యోగులపై చేయి చేసుకున్న చిత్తూరు సంయుక్త కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 02 Nov 2025 05:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఏపీసీటీఎస్‌ఏ అసోసియేషన్‌ తీర్మానం

ఈనాడు, అమరావతి: దళిత ఉద్యోగులపై చేయి చేసుకున్న చిత్తూరు సంయుక్త కమిషనర్‌ రఘునాథరెడ్డిని తక్షణం సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించాలని ఏపీ కమర్షియల్‌ ట్యాక్సెస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీసీటీఎస్‌ఏ) డిమాండ్‌ చేసింది. విజయవాడలో శనివారం ఆ సంఘ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు తీర్మానాలు చేసినట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్‌ సూర్యనారాయణ, రమేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఉద్యోగులకు పదోన్నతి అధికారుల దయ, మంత్రి భిక్ష కాదు. ముహూర్తం పేరుతో ఏడాదిగా నిలిపివేసిన అన్ని తరగతుల అన్ని కేడర్‌లలో పదోన్నతులు తక్షణం ఇవ్వాలి. స్థానిక రిజర్వేషన్ల మేరకు యూనిట్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్‌ పరిధిలోనే ఉద్యోగం చేయాలి. ఆ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలి. ప్రాంతీయ కార్యాలయాల వ్యవస్థను రద్దు చేయాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచక విధానాలు, వాటి వల్ల జరిగిన విధ్వంసంపై సమీక్ష జరగాలి’’ అని తీర్మానించినట్లు వారు వెల్లడించారు. వాణిజ్య పన్నులశాఖలో అహంకారపూరితంగా జరుగుతున్న పాలనా వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి సోమవారం నోటీసు ఇవ్వనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని