కాశీబుగ్గకు జనసేన ఎమ్మెల్యేలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 02 Nov 2025 05:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: కాశీబుగ్గకు జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వెళ్లాలని పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ, లోకం నాగమాధవిలకు ఈ పని అప్పగించారు. వీరు ఘటనకు గల కారణాలు పరిశీలించి పవన్‌ కల్యాణ్‌కు నివేదిక ఇవ్వనున్నారు. పార్టీ నాయకులు చంద్రమోహన్, కొరికాన రవికుమార్, దానేటి శ్రీధర్, గేదెల చైతన్యలనూ అక్కడికి వెళ్లాలని,  సేవలు అందించాలని పవన్‌కల్యాణ్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు