నిలకడగా క్షతగాత్రుల ఆరోగ్యం.. వైద్యారోగ్యశాఖ మంత్రి వెల్లడి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 02 Nov 2025 05:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: కాశీబుగ్గ ఘటనలో గాయపడిన 32 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. క్షతగాత్రులకు అందుతున్న సేవలపై శనివారం రాత్రి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పలాస సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న 17 మందిలో ఇద్దరు డిశ్చార్జి అయ్యారని, పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో చికిత్స పొందుతున్న 15 మందిలో ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని జెమ్స్‌కు తరలించామని అధికారులు వెల్లడించారు. చుట్టుపక్కల ప్రభుత్వాసుపత్రుల నుంచి 20 మంది వైద్యనిపుణులను అందబాటులో ఉంచామని పేర్కొన్నారు. శ్రీకాకుళం బోధనాసుపత్రి నుంచి జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌ వైద్యులను పలాస పంపామని, ప్రస్తుతం రోగుల ఆరోగ్యం నిలకడగా ఉందని డీఎంఈ డాక్టర్‌ రఘునందన్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని