తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 02 Nov 2025 05:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారమివ్వాలి: మాజీ సీఎం జగన్‌ 

ఈనాడు, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ సీఎం జగన్‌ ఆరోపించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని శనివారం ‘ఎక్స్‌’లో డిమాండ్‌ చేశారు. ‘పరిపాలనలో తనను మించినవారు లేరని చంద్రబాబు చెప్పుకొంటున్నారు.. మరోవైపు ఆయన ఘోర వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ప్రజలు, భక్తుల భద్రతను గాలికొదిలేసి రాష్ట్రంలో ఉన్న పోలీసు, నిఘా విభాగాలను చంద్రబాబు పూర్తిగా తన రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. లేని కల్తీ లడ్డూ వ్యవహారాన్ని సృష్టించి, అందులో రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై ఉన్న శ్రద్ధ.. భక్తులకు భద్రత కల్పించడంలో లేదు. ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ ఆలయానికి భక్తులు వస్తున్నారని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం దారుణం. ప్రైవేటు ఆలయం, ఎలాంటి సమాచారం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు