ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెండు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 02 Nov 2025 05:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ప్రసంగిస్తున్న సీఐఐ పూర్వ ఛైర్మన్‌ జేఎస్‌ ఆర్కే ప్రసాద్‌. చిత్రంలో వివిధ సంస్థల ప్రతినిధులు

కానూరు, న్యూస్‌టుడే: ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని సీఐఐ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) పూర్వ ఛైర్మన్‌ జేఎస్‌ఆర్కే ప్రసాద్‌ తెలిపారు. విజయవాడ పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో సిద్ధార్థ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, పీవీపీఎస్‌ఐటీ నేతృత్వంలో శనివారం నిర్వహించిన ఆటోమోటివ్, ఈవీ కాన్ఫరెన్సు-2025 ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఈవీ వాహనాలకు మంచి డిమాండ్‌ ఉందని, ఈ రంగంలో ఉజ్వల భవిత ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 13 పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు వారి ఆవిష్కరణలను ప్రదర్శించారు. కార్యక్రమంలో సిద్ధార్థ విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.వెంకటేశ్వరరావు, ప్రో వైస్‌ ఛాన్సలర్‌ ఏవీ రత్నప్రసాద్, పీవీపీఎస్‌ఐటీ ప్రిన్సిపల్‌ కె.శివాజీబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు