న్యాయాధికారులకు మధ్యవర్తిత్వంపై కార్యశాల

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 02 Nov 2025 05:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ప్రసంగిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె.మహేశ్వరి. చిత్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి తదితరులు

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకొని కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె.మహేశ్వరి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీలో శనివారం న్యాయాధికారులకు నిర్వహించిన ‘మధ్యవర్తిత్వంపై అవగాహన’ సదస్సుకు జస్టిస్‌ మహేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యాన్ని వివరించారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జ్యుడీషియల్‌ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ పురుషోత్తం కుమార్‌తోపాటు పలు జిల్లాల న్యాయమూర్తులు, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని