Swamitwa: ఇళ్లు, స్థలాలు ఇక మీ సొంతమే!
గ్రామాల్లో 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు
వచ్చే మార్చిలో ‘ప్రాపర్టీ కార్డుల’ పంపిణీకి సన్నాహాలు
‘స్వామిత్వ’ కార్యక్రమాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం

ప్రభుత్వ అధికారచిహ్నంతో ముద్రించిన స్వామిత్వ ప్రాపర్టీ కార్డు
ఈనాడు, అమరావతి: గ్రామ కంఠాల్లో ఇళ్లు, దుకాణాలు, ఇతర నిర్మాణాలు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమం గాడిలో పడుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రాపర్టీ కార్డులను ప్రభుత్వం జారీచేయనుంది. డిసెంబరు నెలాఖరులోగా క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తిచేస్తారు. ప్రస్తుతం 6వేల గ్రామాల్లో ‘ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్’ ఆధారంగా ఆస్తుల కొలతలను సేకరిస్తున్నారు.
గ్రామాల్లో దశాబ్దాల క్రితం నాటి ఇళ్లు, స్థలాలకు ఇప్పటికీ యాజమాన్య హక్కుల్లేవు. వీటిని విక్రయించినా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేయరు. ఆస్తులు గ్రామకంఠాల్లో ఉండటమే ప్రధాన కారణం. వీటిపై ప్రజలకు యజమాన్య హక్కులు కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్వ కార్యక్రమాన్ని వైకాపా ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. ఐదేళ్లలో 1,300 ప్రాపర్టీ కార్డులే పంపిణీ చేశారు.
వాటిపైనా గత సీఎం జగన్ ఫొటో ముద్రించడంతో ఎక్కువమంది తీసుకోడానికి నిరాకరించారు. వాటి స్థానంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ అధికారచిహ్నంతో కొత్త కార్డులను ఇస్తోంది.
- స్వామిత్వ కార్యక్రమం అమలులో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానానికి పరిమితం కావడంతో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రస్థాయి యూనిట్ని బలోపేతం చేయడంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంది. గ్రామ సచివాలయాల సిబ్బందిని భాగస్వాములను చేసింది.
 - 6వేల గ్రామాల్లో 45 లక్షల ఆస్తుల సమగ్ర వివరాలు డ్రోన్ల ద్వారా సేకరించారు. వీటి ఆధారంగా ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్లను రూపొందించి ప్రాపర్టీ పార్సిల్ మ్యాపింగ్ చేస్తున్నారు. వీటిలో ప్రతి ఇల్లు, స్థలం పొడవు, వెడల్పు వివరాలు నిక్షిప్తమయ్యాయి. వీటి నిర్ధారణకు రెవెన్యూ, సచివాలయాల సిబ్బంది ప్రతి ఆస్తికీ కొలతలు తీస్తున్నారు. ఇప్పటికే 43 లక్షల ఆస్తుల తనిఖీ పూర్తయింది. రెండు, మూడు రోజుల్లో మిగిలినవీ పూర్తి చేయనున్నారు.
 - ఆస్తులపై నిర్ధారించుకున్న కొలతలతో సెక్షన్ 9(2) ప్రకారం వచ్చే నెలలో ప్రజలకు నోటీసులిచ్చి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక క్షేత్రస్థాయి తనిఖీ పూర్తయినట్లు సెక్షన్ 13 కింద ప్రకటిస్తారు.
 - రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) కింద ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ముద్రించిన జాబితాలు సచివాలయాల్లో, పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. పేర్లు మారినా, ఇతర లోపాలు గమనించినా ప్రజలు అభ్యంతరాలు తెలియజేయొచ్చు. తహసీల్దార్ ఆధ్వర్యంలో వాటిని సవరిస్తారు.
 - మరోదశలో ఇంకో 6వేల గ్రామాల్లో 45 లక్షల ఇళ్లు, స్థలాలకు యజమాన్య హక్కులు కల్పించే కార్యక్రమం 2026 మార్చి తర్వాత ప్రారంభం కానుంది.
 
కార్డుతో లాభాలివి
- ప్రజల అవసరాల మేరకు ఇళ్లు, ఖాళీస్థలాలు విక్రయించొచ్చు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇలాంటి క్రయవిక్రయాలను రిజిస్టర్ చేస్తారు. ఈ మేరకు రెవెన్యూ చట్ట సవరణ చేశారు.
 - కార్డు ఆధారంగా ఆస్తులకు బ్యాంకులు రుణాలిస్తాయి. వారసులకు ఆస్తులు బదిలీ చేయొచ్చు.
 
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ప్రపంచకప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం
మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రేణుక తెలిపారు. - 
                                    
                                        

జాతీయ ఆరోగ్య మిషన్ అమలుపై సీఆర్ఎం బృందం ఆరా
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కార్యక్రమాల అమలు తీరు పరిశీలనకు 12 మందితో కూడిన కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం) బృందం సోమవారం రాష్ట్రానికి వచ్చింది. - 
                                    
                                        

తీరు మార్చుకోకపోతే బుద్ధి చెబుతాం
వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మహిళలపై మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన తన తీరును మార్చుకోకపోతే బుద్ధి చెబుతామని తెదేపా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ హెచ్చరించారు. - 
                                    
                                        

వైకాపా నాయకులు భూమి ఆక్రమించారు
వైకాపా మద్దతుదారులు తన స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన యశోద వాపోయారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. - 
                                    
                                        

రూ.50 కోట్లు దాటిన బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ డిపాజిట్లు
ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా ఉన్న బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ తొలిసారిగా డిపాజిట్ల సేకరణలో రూ.50 కోట్ల మైలురాయిని దాటింది. - 
                                    
                                        

‘ఉపాధి’లో మెరిసిన రాష్ట్రం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరిసింది. 2025-26లో ఇప్పటివరకు పనిదినాల వినియోగంలో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. - 
                                    
                                        

ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు
పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

టీచరమ్మా ఇది తగునా?
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. - 
                                    
                                        

5 వేల హెక్టార్లలో బీచ్శాండ్ లీజులకు ప్రయత్నాలు
అణుధార్మికతతో కూడిన అరుదైన ఖనిజాలు ఉండే బీచ్శాండ్ తవ్వకాల కోసం మరో 5 వేల హెక్టార్లలో లీజులు పొందేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు చేస్తోంది. - 
                                    
                                        

పోలవరం పనులే చేస్తున్నప్పుడు విద్యుత్తు సబ్స్టేషన్ల పనులు పూర్తి చేయలేరా?
విద్యుత్తు లైన్లు.. 132, 140, 400కేవీ వంటి సబ్స్టేషన్ల పనులనూ సకాలంలో పూర్తి చేయలేరా? అని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ(పీయూసీ) ట్రాన్స్కో అధికారులను నిలదీసింది. - 
                                    
                                        

‘రుణాల పంపిణీ.. డిజిటలైజేషన్లో భారీ అక్రమాలున్నాయ్’
వైకాపా హయాం(2019-24)లో సహకార వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రత్యేక సభా సంఘం అభిప్రాయపడింది. 2019-24 మధ్య ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, పీఏసీఎస్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన సభాసంఘం.. అసెంబ్లీ కమిటీ హాలులో సోమవారం సమావేశమైంది. - 
                                    
                                        

ఇటలీ వాసి.. గోరింటకు మురిసి
విశ్వశాంతి కాంక్షిస్తూ ఇటలీ దేశీయుడైన జాన్ సైకిల్పై ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్, తుర్కియే, ఇండోనేసియా, జర్మనీ తదితర దేశాల్లో యాత్ర పూర్తిచేశారు. - 
                                    
                                        

ఈ దండలను ఎంచక్కా తినేయొచ్చు!
పాయసంలోకి కమ్మని రుచిని ఇచ్చేది జీడిపప్పు. అదే జీడిపప్పుతో చేసిన దండలను నూతన వధూవరులు, రాజకీయ నాయకుల మెడలో వేస్తే ప్రత్యేకమే కదా. - 
                                    
                                        

కోటి కాంతుల అఖండ జ్యోతి
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడిలో ఏటా కార్తిక పౌర్ణమి రోజు కోదండరాముడి తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. - 
                                    
                                        

విజయనగరంలోనూ డబ్బావాలా..
వ్యక్తిగత పని అనో, ఉద్యోగమనో, వ్యాపారమనో చాలా మంది ఉదయం నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఓ వైపు పాఠశాలలకు పిల్లల్ని సిద్ధం చేస్తూనే వారికి అల్పాహారం వండుతూ తీరిక లేకుండా ఉంటారు. - 
                                    
                                        

వ్యర్థానికి అర్థం.. చిన్నారులకు ఆహ్లాదం
ఎందుకూ పనికి రావని పక్కన పడేసే వాహనాల టైర్లను సరికొత్తగా వినియోగించవచ్చని నిరూపించారు గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు. - 
                                    
                                        

అబ్బో.. ఎంత పొడగరో!
తిరుమలలో ఓ విదేశీ మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్న శ్రీలంకకు చెందిన నెట్బాల్ ప్లేయర్ తార్జిని శివలింగం సోమవారం సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. - 
                                    
                                        

వేద పాఠశాల నిర్మాణానికి… 2 ఎకరాల భూమి.. 2 కోట్ల నగదు
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. - 
                                    
                                        

మా పార్టీ ఇచ్చిన స్క్రిప్టే చదివాను.. వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు: శ్యామల
కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనకు అసలు కారణాలు తనకు తెలియవని.. వైకాపా ప్రతినిధులు ఇచ్చిన స్క్రిప్టే చదివానని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల తేల్చిచెప్పారు. - 
                                    
                                        

ముక్కంటికి కార్తిక హారతి
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్ష దీపోత్సవం కనుల పండువగా జరిగింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


