Kolusu Parthasarathy: వైకాపా సంఘ విద్రోహ కార్యక్రమాలను చూస్తూ ఊరుకోం: మంత్రి పార్థసారథి

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 15 Jun 2025 13:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: పొదిలిలో వైకాపా నేతలు చేసిన ర్యాలీకి.. వారి ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం లేదని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) అన్నారు. ఎవరైనా వస్తే తొక్కిపడేస్తామంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారని చెప్పారు. రైతుల ముసుగులో మహిళలు, పోలీసులపై రాళ్లు విసిరారని తెలిపారు. మంగ‌ళ‌గిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. ఈ సందర్భంగా పొదిలి ఘటనపై వీడియోలను ఆయన ప్రదర్శించారు.

‘‘వైకాపా కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును రైతులు గుర్తించాలి. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నిజంగా అలా ఉంటే రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి. జగన్‌ పదవీకాంక్షతో అసెంబ్లీ ఎగ్గొట్టారు. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరారు. వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా ప్రజాసమస్యలు ప్రస్తావించరు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని జగన్‌ అసత్యాలు చెబుతున్నారు. నేర ప్రవృత్తిని వైకాపా ప్రోత్సహిస్తోంది. రాష్ట్రానికి ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తోంది. ఆ పార్టీ సంఘ విద్రోహ కార్యక్రమాలను చూస్తూ ఊరుకోం’’ అని మంత్రి హెచ్చరించారు.


Tags :
Published : 15 Jun 2025 12:51 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని