Kasibugga Stampede: అనుకోకుండా పెద్దఎత్తున భక్తులు రావడంతోనే తొక్కిసలాట
మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.17 లక్షల చొప్పున ఆర్థికసాయం
తీవ్రంగా గాయపడిన ఒక్కొక్కరికి రూ.3.50 లక్షలు
ప్రైవేటు ఆలయాలపై నిరంతర పర్యవేక్షణ
తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారా లోకేశ్

ఆసుపత్రిలో క్షతగాత్రురాలిని పరామర్శిస్తున్న మంత్రి లోకేశ్, చిత్రంలో రామ్మోహన్నాయుడు, పల్లా శ్రీనివాస్, అనిత, శిరీష
ఈనాడు, శ్రీకాకుళం: ఊహించని విధంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతోనే తొక్కిసలాట జరిగిందని మంత్రి లోకేశ్ తెలిపారు. దుర్ఘటన జరిగిన వెంటనే ఆయన హుటాహుటిన కాశీబుగ్గకు చేరుకున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పలాస సీహెచ్సీకి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. తర్వాత అక్కడే విలేకర్లతో మాట్లాడుతూ.. ‘ఈ దేవాలయాన్ని 92 ఏళ్ల పండా సొంత నిధులతో నిర్మించారు. స్థానిక అధికారులు, పోలీసులకు ఇంతమంది వస్తారని తెలియదు. సాధారణంగా ఉదయం 6-12, మధ్యాహ్నం 3గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం వెళ్లాల్సిన భక్తులు ప్రవేశమార్గంలో వెళ్లారు. రద్దీ అనూహ్యంగా పెరగడంతో 11.30కు గుడి లోపలకు వెళ్లే మార్గం మూసేశారు. లోపల ఉన్న భక్తులు దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా, బయట ఉన్నవారిలో కొందరు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. రాకపోకలకు ఒకే మార్గం ఉండడంతో తోపులాట జరిగింది. పై మెట్లమీద ఉన్నవారు కిందకు పడిపోయారు’ అని తెలిపారు.
అందర్నీ అప్రమత్తం చేశాం
‘‘భక్తులు ఎక్కువగా వచ్చే ఆలయాల్లో బ్యారికేడ్ల ఫౌండేషన్ ఆరు అంగుళాల వరకు వేస్తారు. కానీ, ఇక్కడ రెండున్నర అంగుళాలే వేశారు. బ్యారికేడ్ల తర్వాత నేరుగా కాంక్రీట్ ఉంది. అటువైపు పడినవారు ఇబ్బంది పడ్డారు. కొంతమంది చనిపోయారు. నాకు విషయం తెలియగానే మొదట ఎమ్మెల్యే శిరీష, తర్వాత మంత్రి అచ్చెన్నాయుడికి ఫోన్ చేశాను. అధికారులతో మాట్లాడాను. అందరూ యుద్ధప్రాతిపదికన ప్రాంగణానికి వచ్చి బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఘటన జరిగినప్పుడు సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో ఉన్నారు. కదిరిలో ల్యాండ్ అవ్వగానే ఆయనతో మాట్లాడాను. అప్పట్నుంచి సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని కార్యాలయానికి తెలియజేశాం’’ అని వెల్లడించారు.

ఘటన వివరాలు లోకేశ్కు వివరిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి, చిత్రంలో రామ్మోహన్నాయుడు, అనిత, కలిశెట్టి అప్పలనాయుడు, గౌతు శిరీష, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
కేంద్ర సాయంతో కలిపి రూ.17లక్షల పరిహారం:‘‘తొక్కిసలాటలో మరణించిన తొమ్మిది మంది భక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు కలిపి రూ.17 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తాం. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షలు, కేంద్రం ఇచ్చే రూ.50 వేలు కలిపి రూ.3.50 లక్షలు ఇస్తాం. మృతుల కుటుంబాలకు మట్టిఖర్చుల కింద రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తాం. చనిపోయిన వారిలో ముగ్గురు తెదేపా సభ్యులున్నారు. వీరికి అదనంగా ప్రమాద బీమా కింద పార్టీ తరఫున రూ.5లక్షల చొప్పున ఇస్తాం’’ అని తెలిపారు.
ప్రైవేటు ఆలయాల నిర్వహణకు ఎస్ఓపీ
‘‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటి కార్యక్రమాలు, గతంలో ఎంతమంది భక్తులు వచ్చారు, రాబోయే రోజుల్లో ఎంతమంది వస్తారో ముందే వివరాలు సేకరించాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దేవాదాయశాఖ కింద ఉన్న ఆలయాలకు ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రైవేటు ఆలయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎస్ఓపీ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుంది. గుడిలో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. ఘటన జరిగినప్పుడు లోపల ఎంతమంది ఉన్నారో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, ఉచిత బస్సుప్రయాణంతోనూ భక్తులు ఎక్కువగా వచ్చారు’’ అని వెల్లడించారు.

పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
ఆ ఆలయానికి ప్రభుత్వానికి సంబంధం లేదు: కలెక్టర్
తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ ఆలయానికి, ప్రభుత్వానికి సంబంధం లేదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారికంగా ప్రకటించారు. ఓ వ్యక్తి సొంత నిధులతో ఆ ఆలయాన్ని నిర్మించి నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్టుడే: కాశీబుగ్గ ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏఎస్పీ కేవీ రమణ, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్లను విచారణాధికారులుగా నియమించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. తొక్కిసలాట జరిగి 9 మంది భక్తుల మృతికి నిర్లక్ష్యమే కారణమని భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆలయం వద్ద బాధిత కుటుంబ సభ్యురాలిని ఓదారుస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ప్రపంచకప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం
మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రేణుక తెలిపారు. - 
                                    
                                        

జాతీయ ఆరోగ్య మిషన్ అమలుపై సీఆర్ఎం బృందం ఆరా
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కార్యక్రమాల అమలు తీరు పరిశీలనకు 12 మందితో కూడిన కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం) బృందం సోమవారం రాష్ట్రానికి వచ్చింది. - 
                                    
                                        

తీరు మార్చుకోకపోతే బుద్ధి చెబుతాం
వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మహిళలపై మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన తన తీరును మార్చుకోకపోతే బుద్ధి చెబుతామని తెదేపా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ హెచ్చరించారు. - 
                                    
                                        

వైకాపా నాయకులు భూమి ఆక్రమించారు
వైకాపా మద్దతుదారులు తన స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన యశోద వాపోయారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. - 
                                    
                                        

రూ.50 కోట్లు దాటిన బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ డిపాజిట్లు
ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా ఉన్న బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ తొలిసారిగా డిపాజిట్ల సేకరణలో రూ.50 కోట్ల మైలురాయిని దాటింది. - 
                                    
                                        

‘ఉపాధి’లో మెరిసిన రాష్ట్రం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరిసింది. 2025-26లో ఇప్పటివరకు పనిదినాల వినియోగంలో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. - 
                                    
                                        

ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు
పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

టీచరమ్మా ఇది తగునా?
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. - 
                                    
                                        

5 వేల హెక్టార్లలో బీచ్శాండ్ లీజులకు ప్రయత్నాలు
అణుధార్మికతతో కూడిన అరుదైన ఖనిజాలు ఉండే బీచ్శాండ్ తవ్వకాల కోసం మరో 5 వేల హెక్టార్లలో లీజులు పొందేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు చేస్తోంది. - 
                                    
                                        

పోలవరం పనులే చేస్తున్నప్పుడు విద్యుత్తు సబ్స్టేషన్ల పనులు పూర్తి చేయలేరా?
విద్యుత్తు లైన్లు.. 132, 140, 400కేవీ వంటి సబ్స్టేషన్ల పనులనూ సకాలంలో పూర్తి చేయలేరా? అని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ(పీయూసీ) ట్రాన్స్కో అధికారులను నిలదీసింది. - 
                                    
                                        

‘రుణాల పంపిణీ.. డిజిటలైజేషన్లో భారీ అక్రమాలున్నాయ్’
వైకాపా హయాం(2019-24)లో సహకార వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రత్యేక సభా సంఘం అభిప్రాయపడింది. 2019-24 మధ్య ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, పీఏసీఎస్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన సభాసంఘం.. అసెంబ్లీ కమిటీ హాలులో సోమవారం సమావేశమైంది. - 
                                    
                                        

ఇటలీ వాసి.. గోరింటకు మురిసి
విశ్వశాంతి కాంక్షిస్తూ ఇటలీ దేశీయుడైన జాన్ సైకిల్పై ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్, తుర్కియే, ఇండోనేసియా, జర్మనీ తదితర దేశాల్లో యాత్ర పూర్తిచేశారు. - 
                                    
                                        

ఈ దండలను ఎంచక్కా తినేయొచ్చు!
పాయసంలోకి కమ్మని రుచిని ఇచ్చేది జీడిపప్పు. అదే జీడిపప్పుతో చేసిన దండలను నూతన వధూవరులు, రాజకీయ నాయకుల మెడలో వేస్తే ప్రత్యేకమే కదా. - 
                                    
                                        

కోటి కాంతుల అఖండ జ్యోతి
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడిలో ఏటా కార్తిక పౌర్ణమి రోజు కోదండరాముడి తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. - 
                                    
                                        

విజయనగరంలోనూ డబ్బావాలా..
వ్యక్తిగత పని అనో, ఉద్యోగమనో, వ్యాపారమనో చాలా మంది ఉదయం నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఓ వైపు పాఠశాలలకు పిల్లల్ని సిద్ధం చేస్తూనే వారికి అల్పాహారం వండుతూ తీరిక లేకుండా ఉంటారు. - 
                                    
                                        

వ్యర్థానికి అర్థం.. చిన్నారులకు ఆహ్లాదం
ఎందుకూ పనికి రావని పక్కన పడేసే వాహనాల టైర్లను సరికొత్తగా వినియోగించవచ్చని నిరూపించారు గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు. - 
                                    
                                        

అబ్బో.. ఎంత పొడగరో!
తిరుమలలో ఓ విదేశీ మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్న శ్రీలంకకు చెందిన నెట్బాల్ ప్లేయర్ తార్జిని శివలింగం సోమవారం సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. - 
                                    
                                        

వేద పాఠశాల నిర్మాణానికి… 2 ఎకరాల భూమి.. 2 కోట్ల నగదు
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. - 
                                    
                                        

మా పార్టీ ఇచ్చిన స్క్రిప్టే చదివాను.. వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు: శ్యామల
కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనకు అసలు కారణాలు తనకు తెలియవని.. వైకాపా ప్రతినిధులు ఇచ్చిన స్క్రిప్టే చదివానని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల తేల్చిచెప్పారు. - 
                                    
                                        

ముక్కంటికి కార్తిక హారతి
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్ష దీపోత్సవం కనుల పండువగా జరిగింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


