Andhra news: మొంథా తుపాను.. పునరావాస కేంద్రాల్లో 75వేల మంది

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 28 Oct 2025 20:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: మొంథా తుపాను (Cyclone Montha) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. తీవ్ర తుపాను కోస్తాంధ్రలోని విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో  ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 403 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఉండనుందని, అత్యవసర పరిస్థితి ఎదుర్కోనేలా మండలాల వారీగా 488 కంట్రోల్ రూమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 1204 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 75,802 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 219కి పైగా మెడికల్ క్యాంపులను వివిధ ప్రాంతాల్లో  ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

అత్యవసర సమాచార వ్యవస్థ కోసం 81 వైర్ లెస్ టవర్లను సైతం రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. 21కి పైగా భారీ సైజు ఆస్కా ల్యాంపులను కూడా సిద్ధం చేసింది. 1147 జేసీబీలు, ప్రోక్లెయిన్లు, క్రేన్లు, 321 డ్రోన్లను సర్కారు సిద్ధంగా ఉంచింది. కూలిన చెట్లు తొలగించేందుకు 1040 యాంత్రిక రంపాలను సిద్ధం చేసింది. తుపాను ప్రభావంపై ఇప్పటి వరకు 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరిక సందేశాలు జారీ చేసింది. వర్షప్రభావం రీత్యా 865 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని అధికారులు సిద్ధం చేశారు.

తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 38 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నెల్లూరు జిల్లా ఉలవపాడు 12.6 సెంటిమీటర్లు, సింగరాయకొండలో 10.5 సెంటీ మీటర్లు, కావలిలో 12.2, దగదర్తిలో 12, బి.కోడూరులో 6, కళింగపట్నంలో 7, విశాఖపట్నం, తునిలో 2 సెంటిమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.

Tags :
Published : 28 Oct 2025 19:47 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని