జీవితమే వరం
జీవితం నీటి బుడగ. ఎప్పుడు ఏ క్షణాన పేలి అందులోంచి ప్రాణ వాయువు పంచ భూతాల్లోని గాలితో కలిసిపోతుందో తెలియదు. ఈ క్షణం మనది. భూత, భవిష్యత్ కాలాలు మనవి కావు. శరీరం, జీవితాల గురించి పెద్దలు చెప్పిన వాస్తవాలు ఇవి. ధర్మాత్ముడైనా, సత్యవంతుడైనా, దానకర్ణుడైనా మరణించడం అనివార్యం.
జీవితం నీటి బుడగ. ఎప్పుడు ఏ క్షణాన పేలి అందులోంచి ప్రాణ వాయువు పంచ భూతాల్లోని గాలితో కలిసిపోతుందో తెలియదు. ఈ క్షణం మనది. భూత, భవిష్యత్ కాలాలు మనవి కావు. శరీరం, జీవితాల గురించి పెద్దలు చెప్పిన వాస్తవాలు ఇవి. ధర్మాత్ముడైనా, సత్యవంతుడైనా, దానకర్ణుడైనా మరణించడం అనివార్యం. దుష్కర్ముడు చనిపోతే, చెడు అంతరిస్తుంది. మనుషులు ప్రశాంత మనస్కులవుతారు. ధర్మాత్ముడు మరణిస్తే, మనసులు రోదిస్తాయి. మంచి సజీవమవుతుంది. మనకు ఉపకరిస్తుందంటే కొంత స్వార్థం ఉన్నా ఫర్వాలేదు కాని, అదే నరనరాన జీర్ణించుకుపోయి ఎవరికీ మేలు చేయని, వ్యక్తిత్వం లేని మనిషిగా జీవించడం వింతే మరి.
సొంతలాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయ్ అని శతకకారుడు చెప్పినట్టు- ఎవరికీ అపకారం చేయని, నష్టం కలిగించని స్వార్థం ఉండటం తప్పుకాదు. బంగారంలో ఒకింత రాగి కలిస్తేనే ఆభరణం అవుతుంది. ధరించిన మనిషి విలువను ఇనుమడింపజేస్తుంది. రాగిపాళ్లు ఎక్కువైతే బంగారం విలువ కోల్పోతుంది. నాసిరకానికి నమూనా అవుతుంది. స్వార్థజీవి ముద్ర కళంకిత వ్యక్తిత్వ సూచన. లేమిని చిన్నచూపు చూడటం, అవయవలోటును అపహాస్యం చేయడం, స్థాయీభేదాలను ప్రదర్శించడం, ఒక స్థాయికి చేరగానే తనను మించినవారు లేరని విర్రవీగడం... ఇవి మానవత్వ భావాలకు వ్యతిరేకమని తెలియనివారు ఉండరు. అయినా, మాయలో పడిన మనిషి విపరీత ప్రవర్తనకు అలవాటు పడతాడు. లౌకిక ఆకర్షణలకు లోబడి కొట్టుమిట్టాడుతుంటాడు. అదే జీవితమన్న భ్రమలో కాలం గడుపుతాడు.
ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు కూడా మాయను ఛేదించలేకపోవడం విచిత్రం. మనిషి రూపంలో దైవం ఉంటాడని, మానవుడికి చేసే సేవ మాధవుడికి చేసే పూజతో సమానమని తెలిసి కూడా తమ చుట్టూ పరిధి గీసుకుంటారు. సమాజంలో గొప్ప కీర్తి గడించకపోయినా ఫర్వాలేదు. అపకీర్తి మూట కట్టుకోకూడదు. కర్మ, జ్ఞాన ఇంద్రియాలను ఉత్తమ సంస్కారాలకు వినియోగించాలి. మనసును కట్టడి చేయగలగాలి. బుద్ధి వినియోగాన్ని పెంచుకోవాలి. మనిషి చేసే మంచైనా, చెడైనా తరవాతి తరాలకు పునాది అవుతుంది. భవనం వాతావరణ మార్పులకు చెక్కు చెదరని, పటిష్ఠమైన నిర్మాణమని పదుగురు చెప్పుకోవాలా లేక, పగుళ్లతో విచ్చుకుపోయి అందులో నివాసం ఉండేవాళ్లు ఎప్పుడు కూలిపోతుందో అన్న చింతతో క్షణం క్షణం కాలం గడపాలా అన్నది కర్మచింతన. అందుకే, మానవులకు సత్ప్రవర్తనతో కూడిన ముందుచూపు ఉండాలి.
ఏ ఒక్క తరంలోనన్నా గురువుంటే, పండితుడుంటే, విద్వాంసుడుంటే, లోకానికి మేలు చేసిన మహానుభావుడుంటే- ఆ కుటుంబంలోని ప్రతి తరమూ సంఘం గుర్తింపునకు నోచుకుంటుంది. గౌరవం పొందుతుంది. వికసించిన పువ్వు పరిమళాలను వెదజల్లినా, జంతువు విశ్వాసం కనబరచినా, చెట్టు అవసరాలు తీర్చినా వాటికో పుస్తకం, పుట ఉండవు. మనిషి ఒక్కడే గుణంతో, కర్మతో శ్లాఘనీయుడు అవుతాడు. వరంగా పొందిన ఈ జన్మకు విలువ తెచ్చుకోవాలి. మరణించాక స్వర్గం పొందాలని, మరో జన్మ ఉత్తమమైనది కావాలని ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోవడం ఎంతమాత్రం తగదు.
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మౌనం మధురం
మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణశక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. -
దాన విధానం
చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు. భూమ్మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే నాలుగూ ధర్మదేవతకు నాలుగు పాదాలని సంప్రదాయ భావన. -
విద్యా వినయ సంపన్నత
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. -
పలుకుతేనెలు
మానవులందరూ మాట్లాడతారు. కాని, అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి. కొందరి మాటలు తేనెలొలుకుతాయి. -
కష్టేఫలే
ఈ సృష్టిలో గ్రీష్మరుతువు, వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరవాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కాని కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు. కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. -
జీవిత సాక్షాత్కారం
చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు. -
బోనం... భాగ్యం!
ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యశక్తిని ఆర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. -
లోకప్రియం
ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయిని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. -
ధన్య జీవితం
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. -
ధర్మ పోరాటం
ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మ సమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్యా సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నా వారు నా వారే అనుకుంటే అది దురభిమానమవుతుంది. -
శుభ ఏకాదశి
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి... వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. -
మహోన్నతం
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. -
హారతి
శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. -
నాలుగు మంచి మాటలు
మైత్రి, కరుణ, ముదిత (సానుకూల మానసిక స్థితి), ఉపేక్ష అనే నాలుగు సాధనాలతో జీవితాన్ని చింతనా రహితంగా అలంకరించుకోవచ్చు. ఈ నాలుగు భావనలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. -
ఆధ్యాత్మిక సాధన
ఇహలోక బంధాల నుంచి విముక్తి కలిగించి, పారలౌకిక మార్గమేదో తెలిపి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియనే సాధన అంటారు. ధ్యానం, జపం, నామస్మరణ మొదలైన క్రియలతో చిత్తవృత్తుల పరుగులకు కళ్ళెం వేయడానికి చేసే ప్రయత్నమే సాధన. -
అదృష్టం - దురదృష్టం
మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. -
కష్టం-సుఖం
తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. -
వెలుగు నుంచి చీకటికి...
కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. -
అన్నమహిమ
అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు. -
పూరీ రథయాత్ర
పురాణాలలో ‘పురుషోత్తమక్షేత్రం’ అని వ్యవహరించే ‘పూరీ’ మహాక్షేత్రం అనేక ప్రత్యేకతలకు ఆలవాలం. ఆలయం, మూర్తుల రథయాత్ర... అన్నీ విశేషాలే. ప్రతి ప్రసిద్ధాలయంలో రథోత్సవాలు జరుగుతాయి. పూరీ క్షేత్రంలోని రథయాత్ర మాత్రం ప్రత్యేకం. ఏ ఏడాదికా ఏడాది దారువులతో (కర్రతో) రథాలను తయారు చేస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి