దానగుణం
దానం ఓ మహత్తర కార్యం. ప్రతిఫలాపేక్ష లేని త్యాగం. కీర్తి కండూతి లేకుండా చేసేదే దానం. యజ్ఞం, దానం, తపస్సుల ద్వారా మోక్షం సాధించవచ్చునని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కలియుగంలో యజ్ఞం, తపస్సు సాధ్యం కావు.
దానం ఓ మహత్తర కార్యం. ప్రతిఫలాపేక్ష లేని త్యాగం. కీర్తి కండూతి లేకుండా చేసేదే దానం. యజ్ఞం, దానం, తపస్సుల ద్వారా మోక్షం సాధించవచ్చునని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కలియుగంలో యజ్ఞం, తపస్సు సాధ్యం కావు. కనుక దానమనే త్యాగగుణం మాత్రమే మానవులను పునీతుల్ని చేస్తుందని భగవద్గీత చెబుతోంది. కృతయుగంలో తపస్సు వల్ల, త్రేతాయుగంలో జ్ఞానం వల్ల, ద్వాపరయుగంలో యజ్ఞ యాగాదుల వల్ల, కలియుగంలో కేవలం దానం వల్లనే కీర్తిమంతులు అవుతారని రుషులు చెప్పారు. కన్యాదానం వల్ల మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. గోదాన, భూదానాల వల్ల కుటుంబ పోషణకు అవసరమైన పాడిపంటలు వృద్ధి చెందుతాయి. విద్యాదానం వల్ల అజ్ఞానం అంతరించి విజ్ఞానం వికసిస్తుంది. విజ్ఞాన సముపార్జనతో ఉపాధి లభిస్తుంది. ఈ నాలుగు దానాలు విశిష్టమైనవని పెద్దలు చెబుతారు. భూదానం, గోదానం, తిలదానం, హిరణ్యదానం, వెండి దానం, ఆజ్య దానం, వస్త్ర దానం, ధాన్య దానం, గుడదానం, లవణ దానం అనేవి దశ దానాలు. వీటికి విద్య, కన్య, గృహ, శయ్య, దాసి, అగ్రహార దానాలను కూడా జత చేర్చి షోడశ దానాలు అన్నారు.
భారతంలో బృహస్పతి ధర్మరాజుకు అన్నదాన విశిష్టతను వివరించాడు. ఆకలిగా ఉన్నవారి ఆకలి తీర్చే అన్నదానానికి సమమైన దానం మరొకటి లేదు. వేమన, చాణక్యుడు అన్నదానం గురించి చెప్పారు. అన్నదానం చేయకుండా మిగిలిన ఎన్ని దానాలు చేసినా నిరూపయోగమే. అన్నదానం, ఉదక దానం కన్నతల్లితో సమమైనవి. ఆకలి దప్పులను తీర్చగలిగే అన్నదానమే అత్యుత్తమమైనదని చాణక్యుడు అన్నాడు.
భగవద్గీతలో సాత్విక, రాజస, తామస దానాల గురించి చెప్పారు. కరవు కాటకాలు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడిన సమయంలో ప్రతి ఫలాపేక్ష రహితంగా చేసేది సాత్విక దానం. ప్రత్యుపకారాన్ని ఆశించి చేసేది రాజస దానం. ఇది ఒత్తిళ్లకు లొంగి, ప్రతిఫలాన్ని ఆశించి చేసేది. మనస్ఫూర్తిగా ఇవ్వకుండా బాధపడుతూ ఇచ్చేది.
అయోగ్యమైన ప్రదేశంలో అపాత్రమైనవారికి, యోగ్యం కాని కాలంలో ఇచ్చేది తామస దానం. ఇది స్వీకరించేవారిని చులకనగా చూస్తూ ఇచ్చే దానం. దానం ఇచ్చేవాడిని దాత అని, పుచ్చుకొనేవాడిని గ్రహీత అనీ అంటారు. ఎప్పుడో ఒకసారి అవసరానికి దానం అడిగేవాడు యాచకుడు కాడు. ఒకటో అరో దానాలు చేసినవాడు దాత అనిపించుకోడు. అడిగేవాడు అర్థి అనిపించుకోకపోయినా, నిత్యం దానం చేసేవాడు మాత్రమే దాత అనిపించుకుంటాడు. కర్ణుడు సహజ కవచకుండలాలను ఇంద్రుడికి దానం చేశాడు. శరణార్థిగా వచ్చిన పావురాన్ని రక్షించడానికి తన శరీరం నుంచి సమమైన మాంసాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు శిబి చక్రవర్తి. ఇచ్చిన మాట తప్పక వామనుడు అడిగిన మూడు అడుగుల భూమిని దానం చేశాడు బలి చక్రవర్తి. వృత్రుడు అనే రాక్షసుణ్ని సంహరించడం కోసం ఆత్మత్యాగం చేసి తన వెన్నెముకను సమర్పించాడు దధీచి. వీరంతా దాతలు.
‘నేను’ చుట్టూ బంధాలన్నీ పరిభ్రమిస్తున్న నేటి కాలంలోనూ ఎంతోమంది మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. రక్తదానం, మరణానంతరం నేత్రదానం, అవయవదానం చేస్తున్నారు. మరణపుటంచుల్లో ఉన్నవారికి అవయవదానం పునర్జన్మనిస్తుంటే, నేత్రదానం వల్ల మరణించినవారి కళ్లకు పునఃదృష్టి భాగ్యం కలుగుతోంది. మహాభారతంలో యక్షుడు ధర్మరాజును ‘మరణించిన వారికి చుట్టం ఎవరు?’ అని ప్రశ్నిస్తాడు. ‘చేసిన ధర్మం, అనగా దానం’ అని ధర్మజుడు బదులిస్తాడు.
ఎం.వెంకటేశ్వర రావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మౌనం మధురం
మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణశక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. -
దాన విధానం
చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు. భూమ్మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే నాలుగూ ధర్మదేవతకు నాలుగు పాదాలని సంప్రదాయ భావన. -
విద్యా వినయ సంపన్నత
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. -
పలుకుతేనెలు
మానవులందరూ మాట్లాడతారు. కాని, అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి. కొందరి మాటలు తేనెలొలుకుతాయి. -
కష్టేఫలే
ఈ సృష్టిలో గ్రీష్మరుతువు, వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరవాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కాని కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు. కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. -
జీవిత సాక్షాత్కారం
చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు. -
బోనం... భాగ్యం!
ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యశక్తిని ఆర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. -
లోకప్రియం
ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయిని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. -
ధన్య జీవితం
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. -
ధర్మ పోరాటం
ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మ సమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్యా సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నా వారు నా వారే అనుకుంటే అది దురభిమానమవుతుంది. -
శుభ ఏకాదశి
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి... వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. -
మహోన్నతం
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. -
హారతి
శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. -
నాలుగు మంచి మాటలు
మైత్రి, కరుణ, ముదిత (సానుకూల మానసిక స్థితి), ఉపేక్ష అనే నాలుగు సాధనాలతో జీవితాన్ని చింతనా రహితంగా అలంకరించుకోవచ్చు. ఈ నాలుగు భావనలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. -
ఆధ్యాత్మిక సాధన
ఇహలోక బంధాల నుంచి విముక్తి కలిగించి, పారలౌకిక మార్గమేదో తెలిపి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియనే సాధన అంటారు. ధ్యానం, జపం, నామస్మరణ మొదలైన క్రియలతో చిత్తవృత్తుల పరుగులకు కళ్ళెం వేయడానికి చేసే ప్రయత్నమే సాధన. -
అదృష్టం - దురదృష్టం
మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. -
కష్టం-సుఖం
తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. -
వెలుగు నుంచి చీకటికి...
కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. -
అన్నమహిమ
అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు. -
పూరీ రథయాత్ర
పురాణాలలో ‘పురుషోత్తమక్షేత్రం’ అని వ్యవహరించే ‘పూరీ’ మహాక్షేత్రం అనేక ప్రత్యేకతలకు ఆలవాలం. ఆలయం, మూర్తుల రథయాత్ర... అన్నీ విశేషాలే. ప్రతి ప్రసిద్ధాలయంలో రథోత్సవాలు జరుగుతాయి. పూరీ క్షేత్రంలోని రథయాత్ర మాత్రం ప్రత్యేకం. ఏ ఏడాదికా ఏడాది దారువులతో (కర్రతో) రథాలను తయారు చేస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన