నత్తకు నేర్పిన నడకలివి!
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) రుణంతో రహదారులకు మహర్దశ రానుంది. రూ.6,400 కోట్లతో దాదాపు 3,100 కి.మీ. మేర రహదారులు, వంతెనల అభివృద్ధికి వీలు కలగనుంది.
ఎన్డీబీ ప్రాజెక్టు రహదారులు, వంతెనల పనుల్లో తీవ్ర జాప్యం
రెండోదశకు రెండేళ్లుగా పరిపాలన అనుమతి ఇవ్వని జగన్ సర్కారు
రాష్ట్ర వాటా చెల్లించలేకపోవడమే కారణమా?
ఈనాడు - అమరావతి
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) రుణంతో రహదారులకు మహర్దశ రానుంది. రూ.6,400 కోట్లతో దాదాపు 3,100 కి.మీ. మేర రహదారులు, వంతెనల అభివృద్ధికి వీలు కలగనుంది. ఈ నిధులతో జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే రహదారుల బాగుకు ప్రాధాన్యమిస్తున్నాం. శిథిలావస్థలో ఉన్న 676 వంతెనల స్థానంలో కొత్తవి నిర్మిస్తాం.
2019, నవంబరు 4న ఆర్అండ్బీ అధికారులతో సమీక్షలో సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి.
ఒక్క అవకాశం.. ఒక్క అవకాశం అంటూ ఎన్నికల ప్రచారంలో హామీలపై హామీలు గుప్పించారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వివిధ శాఖల అధికారులతో సమీక్షల్లో అలా చేస్తాం.. ఇలా చేస్తాం అంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. కానీ సీఎం జగన్మోహన్రెడ్డి తాను చెప్పిన మాటలనే కాదు.. చేసిన సమీక్షలనూ మర్చిపోతున్నారు. ఆర్ అండ్ బీ అధికారులతో ఎన్డీబీ రుణంపై సమీక్ష జరిగి మూడేళ్ల ఎనిమిది నెలలు గడిచినా పనులు నత్తతో పోటీపడుతున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో చేసిన హడావుడి.. రాష్ట్ర వాటా చెల్లించాల్సిన సమయానికి చల్లబడిపోయింది.
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రహదారులు, మండల కేంద్రాల మధ్య అనుసంధాన రహదారులను రెండు వరుసలుగా విస్తరించడం.. మధ్యలో ఉన్న వంతెనల పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం రూ.6,400 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు ‘న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) అనే విదేశీ బ్యాంకు రుణం మంజూరు చేసింది. ఇందులో రూ.4,480 కోట్లు (70 శాతం) ఎన్డీబీ రుణం కాగా, రూ.1,972 కోట్లు (30 శాతం) రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా.. వైకాపా అధికారంలోకి వచ్చాక రుణం మంజూరైంది. దీంతో ఆయా రహదారులకు మంచి రోజులు వచ్చాయని అంతా భావించారు. రెండు దశలుగా పనులు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు 2021లో చేపట్టిన మొదటి దశలో 1,244 కి.మీ. విస్తరణ, 204 వంతెనల నిర్మాణం ఇప్పటికి 20 శాతం కూడా పూర్తికాలేదు.
పనులకు మోక్షమెప్పుడో!?
రెండో దశ కింద 13 ఉమ్మడి జిల్లాల్లో 1,267.56 కి.మీ.ల రహదారుల విస్తరణ, 253 వంతెనల నిర్మాణ పనులను ప్రతిపాదించారు. వీటికి రూ.3,386.14 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.1,016 కోట్లు కాగా.. మిగిలింది ఎన్డీబీ రుణంగా ఇస్తుంది. ఇందుకోసం ఆర్అండ్బీ అధికారులు జిల్లాల వారీగా 119 రహదారులను ఎంపిక చేసి, 2021 ఆగస్టులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి సర్కారు పరిపాలన అనుమతి ఇచ్చాకే టెండర్లు నిర్వహించి, గుత్తేదారులకు పనులు అప్పగించే వీలుంటుంది. కానీ దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఈ దస్త్రంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. రాష్ట్రవాటా కింద రూ.1,016 కోట్లు సమకూర్చడం కష్టమేనని గతంలో ఆర్థికశాఖ అధికారులు.. ఆర్అండ్బీ అధికారుల వద్ద అభిప్రాయపడినట్లు తెలిసింది. మరోవైపు ఈ ప్రతిపాదనలు పంపి రెండేళ్లు అవుతుండటంతో.. అంచనా వ్యయాలు పెరిగిపోతాయని, దీంతో రాష్ట్ర వాటా మొత్తం కూడా పెరుగుతుందని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. మొదటి దశ పనులే నత్తనడకన సాగుతుండగా, ఇక రెండో దశకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
సుప్రీం చెప్పినా.. మేమెందుకు వింటాం!
‘‘ప్రతివాది సమర్పించిన ఫొటోల్లో తేదీలు, సమయం, అక్షాంశాలు, రేఖాంశాలు చూస్తే.. యంత్రాలతో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినప్పటికీ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయనేది ప్రాథమికంగా తెలుస్తోంది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
అసలేం జరుగుతోంది?
పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. -
జెన్కో థర్మల్ కేంద్రాలకు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ బొగ్గు
పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) నుంచి హైగ్రేడ్ బొగ్గును జెన్కో తీసుకుంటోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుకు ప్రత్యామ్నాయంగా కృష్ణపట్నం థర్మల్ యూనిట్లో వినియోగించనుంది. -
పర్యాటక సేవలు మరింత ఖరీదు!
పర్యాటకుల కోసం కొత్తగా అనేక అదనపు సౌకర్యాలు కల్పించి ఆకట్టుకోవాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. -
రాష్ట్ర పునర్విభజన అంశాలపై నివేదికలు రూపొందించండి
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
అసలైన ప్రజాసేవకుడు కాటన్
నాటి బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోయినా.. పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట, కాలువలు నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. -
పోలీసు వలయంలో పల్నాడు
రెండురోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. -
ఆ నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక బలగాలు
పోలింగ్ తర్వాత హింస చెలరేగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
పోలింగ్ తర్వాత.. నిప్పు రాజేస్తోందెవరు?
పోలింగ్ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండను నియంత్రించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
సంక్షిప్త వార్తలు (8)
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం పెంచడానికి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) షెడ్యూల్ ప్రకటించిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
117 నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే పోస్టల్ బ్యాలట్లతో కలిపి 2.09% పెరిగింది. మొత్తం 3.33 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
రాష్ట్రంలో 15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఒంగోలు లోక్సభ పరిధిలో 87.06% మంది ఓటర్లు కదం తొక్కారు. -
పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. -
నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం సందర్శించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగం కోల్పోయినా హెచ్-1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు
-
యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి
-
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?