నరసాపురం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ కన్నుమూత

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ (93) బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ శివారు గండిపేట మండలం మంచిరేవులలోని వారి స్వగృహంలో కన్నుమూశారు.

Updated : 04 Jan 2024 05:03 IST

హైదరాబాద్‌, నరసాపురం - న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ (93) బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ శివారు గండిపేట మండలం మంచిరేవులలోని వారి స్వగృహంలో కన్నుమూశారు. ఆమె భర్త దివంగత పరకాల శేషావతారం సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా, అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య మంత్రివర్గంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. భర్త మరణానంతరం జరిగిన ఉపఎన్నికలో కాళికాంబ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆమె పెద్ద కుమారుడు పరకాల ప్రభాకర్‌ ఈటీవీలో ప్రతిధ్వని యాంకర్‌గా సుపరిచితులు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ సలహాదారుగానూ ఆయన పనిచేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ కాళికాంబ కోడలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని