ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది.
ఎన్నికల సంఘం చెప్పినట్లు సీఎస్ వినాలా?
సీఎస్ చెప్పినట్లు ఎన్నికల సంఘం వినాలా?
లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా పింఛన్లివ్వాలని ఈసీ సూచన
ఇళ్ల వద్దే అందించాలన్న స్పష్టమైన ఆదేశాలేవి?
ఈనాడు, అమరావతి: ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. సీఎస్ జవహర్రెడ్డి ఆదేశం, అభిమతాలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అధికార యంత్రాంగమంతా ఎన్నికల సంఘం ఆధీనంలోకి వెళ్లిపోతుంది. సీఎస్ సహా ఎవరైనా ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి.
కానీ ఆంధ్రప్రదేశ్లో అందుకు భిన్నంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశిస్తే.. సీఎస్ ఏకంగా ఇంటింటికీ పింఛన్ల పంపిణీనే నిలిపేశారు. ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకుని సరిదిద్దాల్సిన ఈసీ చోద్యం చూస్తూ కూర్చుంది. దాంతో ఏప్రిల్ మొదటివారంలో పింఛన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా 32 మంది వృద్ధులు చనిపోయారు. అధికార పార్టీ వృద్ధుల్ని మండుటెండల్లో మంచాలపై ఊరేగిస్తూ నానా హంగామా సృష్టించింది. అయినా ఈసీ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. మే నెల దగ్గర పడుతున్నా పింఛన్ల వ్యవహారంలో దిద్దుబాటు చర్యలు లేవు. మే నెలలోనైనా ఇంటివద్దకే పింఛన్లు పంపిణీ చేయాల్సిందిగా ఈసీ ఇప్పటికీ ఎందుకు స్పష్టమైన ఆదేశాలివ్వట్లేదు? అంతకుముందు నెల వరకూ కొనసాగిన విధానాన్నే ఇప్పుడూ కొనసాగించాలని ఎందుకు సీఎస్కు చెప్పట్లేదు? ఇలాగే ఉంటే ఈసారి కూడా ఏప్రిల్ పరిస్థితులే పునరావృతం కావా?
ఎన్నికల సంఘం నిర్దిష్టంగా ఆదేశాలివ్వలేదా?
‘‘ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు సంబంధించిన లబ్ధిని వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లేదా ప్రభుత్వోద్యోగుల ద్వారా పంపిణీచేయాలని మార్చి 30న ఆదేశాలిచ్చాం. అయితే వివిధ పథకాల (పింఛన్లు సహా) పంపిణీ సక్రమంగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల, పంపిణీ ప్రక్రియ మారడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఇప్పటికైనా లబ్ధిదారులకు ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా పంపిణీ ప్రక్రియ చేపట్టండి’’ అని ఎన్నికల సంఘం ఈ నెల 26న సీఎస్కు లేఖ రాసింది. ఏప్రిల్ మొదటివారంలో పింఛన్ల పంపిణీలో నెలకొన్న గందరగోళం ఈసీ దృష్టిలో ఉంది. అలాంటప్పుడు కచ్చితంగా లబ్ధిదారుల ఇంటివద్దకే ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయాలని ఈసీ నిర్దిష్టంగా ఎందుకు సీఎస్కు ఆదేశాలివ్వట్లేదు? తమ ఆదేశాలను యథాతథంగా అమలు చేయకపోతే తీవ్ర చర్యలు తప్పవని ఎందుకు హెచ్చరించట్లేదు? ఇంకా చెప్పాలంటే ఒక ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్ఓపీ)ని ఖరారు చేసి తదనుగుణంగా పంపిణీచేయాలని కచ్చితమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వలేకపోతోంది? ఏదో సీఎస్కు సలహా ఇచ్చినట్లు, సూచించినట్లు చెప్పడమేంటి? అంటే సీఎస్ ఆధీనంలో ఈసీ పనిచేయాలా?
ఆదేశాల స్ఫూర్తిని పాటించట్లేదని తేటతెల్లమవుతుంటే.. మళ్లీ అదే మాటలా?
నిష్పక్షపాతంగా, నిబంధనల ప్రకారం వ్యవహరించే ఏ అధికారైనా ఈసీ ఆదేశాల స్ఫూర్తిని తీసుకుంటే.. అంతకుముందు నెల వరకూ కొనసాగినట్లే ఇంటివద్దకే పింఛన్లను పంపిణీ చేయించాలి. కానీ సీఎస్ జవహర్రెడ్డి మాత్రం గ్రామ, వార్డు సచివాలయాల వద్దకే వెళ్లి పింఛన్లు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. మండుటెండల్లో, వృద్ధుల్ని, దివ్యాంగుల్ని, వితంతువుల్ని, అభాగ్యుల్ని సచివాలయాల వద్దకు రప్పించారు. దానికి విపక్షాలే కారణమనే భావన ప్రజల్లో కల్పించి తద్వారా అధికార వైకాపాకు రాజకీయ ప్రయోజనం కలిగించాలనే కుట్రతోనే ఇలా చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి దీనిపై ఫిర్యాదు చేశాయి. కనీసం మే నెల పింఛను అయినా ఇంటి వద్దే అందేలా ఆదేశాలివ్వాలని ప్రతిపక్షాలు వినతులిచ్చాయి. అంటే ఈసీ ఆదేశాల స్ఫూర్తిని సీఎస్ పట్టించుకోలేదని తేటతెల్లమైపోతోంది కదా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల పాలన.. 50 ఏళ్ల విధ్వంసం
విభజనకు గురైన రాష్ట్రం అడుగులు ముందుకేస్తోంది... ఆంధ్రుల దశాదిశా మార్చే రాజధాని నిర్మాణానికి రంగం సిద్ధమై ఉంది... విశాఖ, అనంతపురం వంటివి పారిశ్రామికాభివృద్ధిలో పెద్ద అంగలు వేస్తున్నాయి... ఈ దశలో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ వచ్చారు... రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగమింపజేసే అద్భుత అవకాశం... కానీ జగన్ విధ్వంసం... విద్వేషం... వంచనలతో భ్రష్ట పాలనకు తెరతీశారు. -
దారుణాలు ఆయనవే.. దండనా ఆయనదే..
జగన్ అయిదేళ్ల పాలన వెనుదిరిగి చూస్తే ఏమున్నది గర్వకారణం? ఆయన పాలన మొత్తం ప్రజాపీడన పరాయణత్వం.. సామాన్య పౌరుడికీ స్వేచ్ఛ లేదు. సామాజిక మాధ్యమాల్లో స్పందించే వాక్ స్వాతంత్య్రం లేదు. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రికీ, ఒక పార్టీ అధినేతగా ఉన్న లక్షల మంది ఆరాధ్య నటుడికీ జనాలను కలవనివ్వని వైకాపా పోలీసు గ్యాంగ్. -
పదే పదే పునాది రాళ్లు!
శంకుస్థాపనలే.. అభివృద్ధి లేదు.. ధ్వంస రచనే.. బడ్జెట్ కేటాయింపుల్లేవు.. ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించే సత్తా లేదు.. అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక లేదు.. పనులు గతప్రభుత్వ హయాంలో మొదలయ్యాయా..? వాటి ఆనవాళ్లు లేకుండా చేయడమే..! మచిలీపట్నం... రామాయపట్నం... -
పెత్తందారు ఎవరు జగన్?
‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’... అంటే దొంగే తనను పట్టుకున్న పోలీసును దొంగ అని అరిచాడని అర్థం..! ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ చేస్తోంది అదే..! అణువణువునా పెత్తందారీ, భూస్వామ్య, ఫ్యాక్షన్ లక్షణాలతో చెలరేగిపోతూ, పైగా ఇతరులపై పెత్తందారులని ముద్రవేస్తూ గొంతు చించుకోవడం ఆయనకే చెల్లింది..! ప్రజల్ని అమాయకుల్ని చేసి... -
గుంతలు ప్రకృతి పుణ్యమట!
వర్షాల కారణంగా రోడ్లు పాడైతే ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? మళ్లీ మరమ్మతులు చేసి బాగుచేయించాలి.. అలాకాకుండా ‘మేం రోడ్లు వేశాం.. కానీ వర్షాల వల్ల పాడయ్యాయి’ అని చేతులు దులుపుకొని.. నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తే? అలాంటి ప్రభుత్వాలను ఏమనాలి? ‘చేతగాని ప్రభుత్వాలు’ అనే కదా...! -
ఓటు పాశుపతాస్త్రం.. సక్రమంగా వినియోగించుకుందాం
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. మన దేశం, మన రాష్ట్రం, మన సమాజం, వ్యక్తిగత జీవితాలు బాగుపడాలన్నా, భవిష్యత్తు ఉజ్వలంగా మారాలన్నా మనం వేసే ఓటే కీలకం. ప్రస్తుతం మన రాష్ట్ర భవితను నిర్దేశించే అత్యంత కీలక ఎన్నికలు జరుగుతున్నవి. -
పెద్దల మాట
-
కొత్త ప్రభుత్వం వచ్చాకే రిజిస్ట్రేషన్లలో కదలిక!
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-స్టాంపింగ్ పేపర్ల (జిరాక్స్ పత్రాల మాదిరి)పై రిజిస్ట్రేషన్ ప్రక్రియ పట్ల సర్వత్రా విముఖత వ్యక్తమవుతోంది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికార మార్పిడికి అవకాశాలున్నాయన్న కారణాలతోనూ రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలు తగ్గాయి. నాన్జ్యుడీషియల్ స్టాంపు పేపర్లపై ఏళ్ల తరబడి సాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. -
రైతులంటే లెక్కలేనితనం..
ఒక్క ఏడాదే 47.77 లక్షల ఎకరాల్లో (2023-24 ఖరీఫ్, రబీ) పంటలు వేయలేదంటే అది తీవ్ర కరవు కాదా? వర్షాలు అనుకూలిస్తే రైతులు విత్తనం వేయకుండా ఉంటారా? వానల్లేక, సాగునీరందక 23లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా, అధికశాతం ఎండిపోయినా.. అది కరవు కాదట.. ఆయనకెక్కడా కరవే కన్పించలేదట. -
‘వన్టైం’ పదోన్నతుల పేరుతో వైద్య బోధకులకు ఎర
కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైద్య బోధకుల నియామకాల విషయంలో వైకాపా ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోంది. కళాశాలల ఏర్పాటుకు తగ్గట్టుగా నియామకాలను ముందుగా చేపట్టకుండా.. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలకు వచ్చే సమయంలో హడావుడి చేస్తోంది. -
అతివలు మెచ్చేలా.. అందరూ వచ్చేలా
పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ మోడల్ పోలింగ్ కేంద్రాలను సుందరంగా తయారు చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని లయోల కళాశాలలో 56వ పోలింగ్ కేంద్రాన్ని మహిళా (పింక్) పోలింగ్ కేంద్రంగా తయారు చేశారు. -
తీరంలో గంజాయి కంపు
ఐటీ కంపెనీలు రావాల్సిన చోట.. మత్తులో బ్లేడ్బ్యాచ్లు వీరంగం వేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని ఘటనలు... ఊహకు అందని దారుణాలు స్థానికుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. -
కాయ్ రాజా కాయ్.. గెలిచేది కూటమేనోయ్!
రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? అధికారంలోకి వచ్చేదెవరు? ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ఎన్నికల ఫలితాలపై భీమవరం బెట్టింగ్ బాబులు కూటమికే మొగ్గు చూపుతున్నారు. అధిక శాతం సీట్లలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారంటూ భారీగా పందేలు కాస్తున్నారు. -
సీఎం జగన్.. నలుగురు సామంతులు
ఒక రాజు.. నలుగురు సామంతులు.. ఇదీ ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో సాగిన పాలన తీరు. సీఎం హోదాలో జగన్.. ఆయనకు సామంతులుగా నలుగురు వ్యవహరించారు. ఈ ఐదేళ్ల జగన్ పాలనలో చీకటి కోణాలకు ప్రతినిధులుగా ఈ నలుగురూ నిలిచారు. -
అత్యవసర సిబ్బందికీ వేతనాలివ్వరా?
జగన్ ప్రభుత్వం అత్యవసర వైద్య సేవల సిబ్బందికీ చుక్కలు చూపిస్తోంది. -
పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి?
పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.998.84 కోట్లు ఏమయ్యాయని అఖిల భారత పంచాయతీ పరిషత్తు జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రశ్నించారు. -
దళిత యువకుడిపై సినీ రచయిత కోన వెంకట్ దాడి
ఎన్నికల ముందు వైకాపాను వీడి తెదేపాలో చేరారనే కక్షతో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన దళిత యువకుడు కత్తి రాజేష్పై వైకాపా బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే కోన రఘుపతి బంధువు, కర్లపాలెం మండలం వైకాపా ఇన్ఛార్జి, సినీ రచయిత కోన వెంకట్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. -
షిర్డిసాయి కార్యాలయంలో సోదాల కలకలం
సీఎం జగన్కు సన్నిహితుడైన విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎన్నికలకు ఒక్క రోజు గడువు ఉన్న తరుణంలో సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. -
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం చిత్తూరులో ఎన్నికల ప్రచారం ముగించుకున్న అనంతరం హెలికాప్టర్లో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. -
పాదగయలో హీరో రామ్చరణ్ పూజలు
కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని హీరో రామ్చరణ్, ఆయన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్ సందర్శించారు. శనివారం ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగిన వారు రోడ్డు మార్గాన పిఠాపురం చేరుకున్నారు. -
అమ్మ.. అమరనాథూ!
వైకాపా ప్రభుత్వ పెద్దలు తలచుకుంటే ఏదైనా సాధ్యమే. నిబంధనల్ని అడ్డగోలుగా అతిక్రమించి కావాల్సినవారికి దోచిపెట్టడానికి వారు సర్వదా సిద్ధమే. ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు మార్చేసి, అయినవారికి లబ్ధి చేకూర్చడమే.