PM Modi: అమృత కాలం.. కర్తవ్యమే మంత్రం
వచ్చే 25 ఏళ్లు దేశానికి అమృత కాలమని, లక్ష్యాల సాధనకు ప్రతిఒక్కరూ ‘కర్తవ్య మంత్రం’ పఠించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం శిమ్లాలో హిమాచల్ప్రదేశ్ శాసనసభ వేదికగా ప్రారంభమైన 82వ అఖిల భారత సభాపతుల సదస్సును
గడిచిన 75 ఏళ్లకు మించి రాబోయే పాతికేళ్లలో అభివృద్ధి
భారతీయ సమాజ సహజ స్వరూపం ప్రజాస్వామ్యం
అఖిల భారత స్పీకర్ల సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన
స్పీకర్ల సదస్సులో వీడియో ద్వారా మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఈనాడు, దిల్లీ: వచ్చే 25 ఏళ్లు దేశానికి అమృత కాలమని, లక్ష్యాల సాధనకు ప్రతిఒక్కరూ ‘కర్తవ్య మంత్రం’ పఠించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం శిమ్లాలో హిమాచల్ప్రదేశ్ శాసనసభ వేదికగా ప్రారంభమైన 82వ అఖిల భారత సభాపతుల సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 2047 నాటికి దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి, అందులో చట్టసభల పాత్ర ఎలా ఉండాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించి దిశానిర్దేశం చేస్తే అదెంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సభాపతుల భేటీ పరంపర వందేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ‘ప్రజాస్వామ్యం ఒక వ్యవస్థ మాత్రమే కాదు. అది భారతీయ సహజ స్వభావ స్వరూపం. రాబోయే సంవత్సరాల్లో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలి. అది అందరి ప్రయత్నంతోనే సాధ్యమవుతుంది. గత 75 ఏళ్లకు మించి రాబోయే 25 ఏళ్లలో దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేది కర్తవ్యమే అని గుర్తుంచుకోవాలి’ అని ప్రధాని చెప్పారు. ‘‘జీవితాన్ని పూర్తిగా సమాజ అభ్యున్నతి కోసం అంకితం చేసిన ప్రజా ప్రతినిధులు ప్రతి పార్టీలోనూ ఉంటారు. ఇలాంటి వారిని గుర్తించి వారి అనుభవాలను పంచుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం మేలు’’ అన్నారు.
చర్చలకు విలువ జోడించాలి
‘‘చట్టసభల్లో చర్చలకు విలువను ఎలా జోడించాలి అన్నది చూడాలి. అన్ని పార్టీలూ చర్చలకు ప్రాధాన్యం ఇచ్చి సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొల్పాలి. ఇందులో సభాపతుల పాత్ర చాలా కీలకం. యువ సభ్యులకు, వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చినవారికి, మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి. పార్లమెంటు కమిటీలనూ ప్రజావసరాలకు తగ్గట్టు నిర్వహించాలి.
దేశమంతటికీ ఒకే డిజిటల్ శాసన వేదిక!
దేశమంతటికీ ఒకే రేషన్ కార్డు, వేర్వేరు అవసరాలకు ఉమ్మడిగా వినియోగించుకునే రూపే కార్డు లాంటివి ప్రారంభించుకున్నాం. అలాగే ఇప్పుడు ‘ఒకే దేశం.. ఒకే శాసనవేదిక’ సాధ్యమా? అన్నది పరిశీలించాలి. శాసనవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, దేశంలోని అన్ని స్థానిక సంస్థలను కలిపేందుకు ఒక డిజిటల్ వ్యవస్థను రూపొందించాలి. చట్టసభలకు సంబంధించిన అన్ని వివరాలూ ఈ పోర్టల్లో లభించేలా చూడాలి. చట్టసభలు కాగిత రహితంగా పనిచేయాలి. పార్లమెంటు ఉభయ సభాపతుల ఆధ్వర్యంలో ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అన్ని శాసనసభల గ్రంథాలయాలనూ డిజిటల్ రూపంలో ఆన్లైన్లోకి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేయాలి’’ అని మోదీ పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ- చట్టసభల హుందాతనాన్ని పెంచడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ప్రజల హక్కుల్ని కాపాడేలా చట్టసభల నియమ నిబంధనల్ని సమీక్షించాలని సభాపతుల్ని కోరారు. చట్టసభలన్నింటికీ వర్తించేలా నిబంధనలపై ఒక నమూనా పత్రాన్ని సిద్ధం చేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తుడా.. నుడా.. అనుడా.. దోచేయ్ ఎడాపెడా!
జగన్ ఏలుబడిలో వైకాపా నేతలు కొన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఇంకొన్నింటిని తమ వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. వాటిలో పట్టణాభివృద్ధి సంస్థలు ప్రధానమైనవి. -
ఈ చదువులు మాకొద్దు ‘మామా’
జగన్ పాలనలో యువత ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ చదువులు మాకొద్దంటూ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఉన్నత విద్యలో నాణ్యత లేకపోవడం.. విద్యా సంస్థలను రాజకీయాలకు నిలయాలుగా మార్చేయడంతో యువత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోంది. -
సుప్రీంకూ అబద్ధాలేనా?
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేలా ఉంది గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి తీరు. -
పోస్టల్ బ్యాలట్ను 12 వరకు పొడిగించాలి
పోస్టల్ బ్యాలట్ ప్రక్రియను ఈనెల 12 వరకు పొడిగించాలని సీఈవోను పలువురు తెదేపా నేతలు.. ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావులు.. ఐక్యవేదిక కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి బాజీ పఠాన్, షేక్ అబ్దుల్ రజాక్లు కోరారు. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఈసీ అనుమతి లేదు
ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
పెద్దల మాట
-
కార్టూన్
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!