ఆదాయపు పన్ను భారం కాకుండా...
మరికొన్ని రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటికే ఆదాయపు పన్ను మినహాయింపు పొందడం కోసం అవసరమైన పెట్టుబడులు పెట్టే ఉంటారు.
మరికొన్ని రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటికే ఆదాయపు పన్ను మినహాయింపు పొందడం కోసం అవసరమైన పెట్టుబడులు పెట్టే ఉంటారు. కేవలం పన్ను ఆదా చేసుకోవడమే లక్ష్యం కాకుండా.. ఎంచుకున్న పథకాలు దీర్ఘకాలంలో ఆర్థిక భరోసా కల్పించేలా చూసుకోవాలి. దీనికోసం ఉపయోగపడే మూడు ముఖ్యమైన పథకాల వివరాలు చూద్దాం...
పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం పన్ను తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలూ ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సెక్షన్ 80సీ. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో మదుపు చేయడం ద్వారా పన్ను మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. ప్రధానంగా ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్), అయిదేళ్ల పన్ను ఆదా బ్యాంకు డిపాజిట్లు, జీవిత బీమా పాలసీల ప్రీమియం, ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్), జాతీయ పొదుపు పత్రాలు (ఎన్ఎస్సీ), పెద్దల పొదుపు పథకం (ఎస్సీఎస్ఎస్), ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్ఎస్ఎస్), గృహరుణం అసలు చెల్లింపు, ఇద్దరు పిల్లలకు చెల్లించిన ట్యూషన్ ఫీజు తదితరాలు ఈ సెక్షన్ కింద ఉంటాయి.
స్థిరమైన రాబడిని అందించే పథకాలు ద్రవ్యోల్బణ దృష్టితో చూసినప్పుడు పెద్దగా ఆదాయం ఉండదు. వీటి నుంచి వచ్చిన రాబడిపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. మార్కెట్ ఆధారిత పన్ను ఆదా పథకాలను ఎంచుకున్నప్పుడు కాస్త నష్టభయం ఉంటుందన్నది వాస్తవం. ఇందులో ముఖ్యంగా ఈఎల్ఎస్ఎస్, యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్), జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లాంటివి పరిశీలించవచ్చు. దీర్ఘకాలంలో వీటి వల్ల పెట్టుబడి వృద్ధికి అవకాశం ఉంటుంది. వచ్చిన రాబడిపైనా పన్ను భారం పెద్దగా ఉండదు.
యులిప్లు తీసుకుంటే..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, బీమా రక్షణ ఒకేచోట అందించేవి యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్). పెట్టుబడి, రక్షణ విడివిడిగా నిర్వహించలేని వారికి ఇవి అనుకూలం. సాధారణంగా ఇవి 15-20 ఏళ్ల దీర్ఘకాలిక పథకాలు. మీ వయసు, ఎంత ప్రీమియం చెల్లించగలరు, వ్యవధి, వివిధ దశల్లో మీ అవసరాలు, తదితర వాటిని దృష్టిలో పెట్టుకొని, వీటిని ఎంపిక చేసుకోవాలి.
* మీరు చెల్లించే ప్రీమియానికి కనీసం 10 రెట్ల వరకూ బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. 15-20 రెట్లు ఉంటే మరీ మంచిది. మీరు కోరుకున్న కవరేజీని అనుసరించి, ప్రీమియాన్ని మీ పెట్టుబడి నుంచి మినహాయిస్తారు.
* వివిధ లక్ష్యాలకు అనుగుణంగా.. దీర్ఘకాలిక యులిప్ ఎప్పుడూ మంచిది. పాలసీ వ్యవధి ముగిసే వరకూ ప్రీమియం చెల్లించాలి. చాలా యులిప్లు ఈక్విటీ, డెట్ ఫండ్లను ఎంచుకునేందుకు దాదాపు 5-9 ఫండ్లు అందుబాటులో ఉంటాయి. మీ లక్ష్యాలకు అనుగుణంగా వీటిని పరిశీలించవచ్చు. ఇందులో కొన్ని స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ ఫండ్లు ఉంటాయి. కొన్నింటిలో మల్టీ క్యాప్, థీమాటిక్ ఫండ్లూ అందుబాటులో ఉంటాయి. మీ నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి, ఫండ్లను ఎంపిక చేసుకోవాలి. ఒక ఫండ్ నుంచి మరో ఫండ్కు మారేందుకు కొన్ని నిబంధనలకు లోబడి ‘స్విచ్ఛింగ్’ అవకాశం ఉంటుంది.
* కనీసం 10-15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించేందుకు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే యులిప్లను తీసుకోండి. పెట్టుబడుల్లో డైవర్సిఫైడ్ ఫండ్లకే ప్రాధాన్యం ఇవ్వండి. లక్ష్యం సమీపిస్తున్నప్పుడు ఈక్విటీ ఫండ్ల నుంచి పెట్టుబడిని డెట్ ఫండ్లలోకి మార్చండి. అయిదేళ్ల తర్వాత పాక్షికంగా కొంత పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, సాధ్యమైనంత వరకూ ఈ వెసులుబాటును వాడుకోవద్దు.
* వ్యవధి తీరిన తర్వాత క్రమానుగతంగా పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మరింత ఎక్కువ కాలం మార్కెట్లో కొనసాగేందుకు వీలవుతుంది.
పింఛను పథకంతో..
పన్ను ఆదాతోపాటు, పదవీ విరమణ తర్వాతా ఉపయోగపడాలి అనుకున్నప్పుడు జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) మంచి ఎంపిక. ఈ పథకాన్ని పింఛన్ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రిస్తుంది. ఈ పథకంలో ముందుగా పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ తర్వాత పింఛను తీసుకునేందుకు వీలవుతుందన్న మాట. ఎంత పింఛను వస్తుందనేది పెట్టుబడి మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక రకంగా మార్కెట్ ఆధారిత పథకమే. కాబట్టి, రాబడికి కచ్చితమైన హామీ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే.. ఇతర పింఛను పథకాలతో పోలిస్తే ఎన్పీఎస్ ఖర్చుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది.
* పదవీ విరమణ వరకూ జమ చేసిన మొత్తంలో నుంచి 60 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతంతో ఎంపిక చేసిన ఏడు సంస్థల నుంచి యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవే పింఛనును చెల్లిస్తాయి.
* యాక్టివ్ ఛాయిస్, ఆటో ఛాయిస్ పేరుతో ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వయసు, నష్టభయాన్ని భరించే శక్తిని బట్టి, వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ, స్థిరాదాయం అందించే పథకాలు, ప్రభుత్వ సెక్యూరిటీలు ప్రధానంగా ఉంటాయి.
* ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ.50వేల వరకూ ప్రత్యేక మినహాయింపు పొందేందుకు వీలుంటుంది.
తక్కువ లాకిన్తో..
పెట్టుబడిపై అధిక రాబడిని ఆర్జిస్తూ, పన్ను ఆదా చేసుకోవాలనుకున వారికి ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్ఎస్ఎస్) ఉపయోగపడతాయి. ఈ ఫండ్లు తమ పోర్ట్ఫోలియోలో 80 శాతం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాల్లో పెట్టుబడి పెడతాయి.దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన పథకాలివి. పెట్టిన పెట్టుబడిని కనీసం మూడేళ్లపాటు కొనసాగించాల్సిందే. ఇంకా ఎక్కువ కాలం కొనసాగించడం వల్ల ఈక్విటీ లాభాలు మెరుగ్గా ఉంటాయి. ఒక వ్యక్తి 30 శాతం శ్లాబులో ఉండి, మొత్తం రూ.1,50,000 ఇందులోనే మదుపు చేస్తే దాదాపు రూ.46,800 (పాత పన్నుల విధానం ప్రకారం) పన్నును ఆదా చేసుకోవచ్చు.
* ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకూ, క్రమానుగత విధానంలో మదుపు చేసేందుకూ అవకాశం ఉంది. మార్కెట్ హెచ్చుతగ్గుల లాభాలను స్వీకరించాలంటే.. క్రమానుగత విధానంలో మదుపు చేయడమే ఎప్పుడూ మేలు.
* ఫండ్లను ఎంచుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించే విశ్లేషణను తనిఖీ చేయాలి. ఫండ్ పెట్టుబడి లక్ష్యం, పోర్ట్ఫోలియో కూర్పు, గత పనితీరు, ఫండ్ మేనేజర్ అనుభవంలాంటివి పరిగణనలోకి తీసుకోవాలి.
* మూడేళ్ల వరకూ పెట్టుబడిని కొనసాగించాలన్న నిబంధన వల్ల మీరు మధ్యలోనే వెనక్కి తీసుకోవాలన్న ఆలోచన ఉండదు. ఫలితంగా పెట్టుబడి వృద్ధికి అవకాశం కల్పించినట్లు అవుతుంది.
దీపక్ జైన్, హెడ్-సేల్స్, ఎడిల్వైజ్ మ్యూచువల్ ఫండ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన డిక్లరేషన్తో కూడిన చట్టపరమైన పత్రం. -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు