IT Notice: ఐటీ నోటీసులు అందాయా? ముందు లోపమేంటో గుర్తించండి!
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు అనగానే చాలా మంది హడలెత్తిపోతుంటారు. కానీ, అన్ని సందర్భాల్లో భయపడాల్సిన అవసరం లేదు....
ఇంటర్నెట్ డెస్క్: ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు అనగానే చాలా మంది హడలెత్తిపోతుంటారు. కానీ, అన్ని సందర్భాల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఐటీ నోటీసు అంటే మీ ఐటీ పత్రాల్లో సమస్య ఉందని తెలియజేస్తూ పంపే రాతపూర్వక సమాచారం మాత్రమే. దీనికి ఒక్కోసారి మీరు తిరిగి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి అవసరం ఉండదు. కేవలం సమస్య ఉందని తెలియజేసి మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తుంటారు. అందుకే పన్ను చెల్లింపుదారులు నోటీసు అందగానే దాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. తర్వాతే సమాధానం ఇవ్వాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలి.
నోటీసు వర్సెస్ సమాచారం..
ఆదాయ పన్ను విభాగం పంపే ప్రతిదీ నోటీసుగానే పరిగణించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కేవలం సమస్య ఉందని తెలియజేసి భవిష్యత్తులో దాన్ని పునరావృతం కాకుండా చూసుకోమని ‘ఇంటిమేషన్’ కూడా పంపుతుంటారు. దీనిపై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోదు. కానీ, నోటీసు మాత్రం దీనికి భిన్నం. మీ ఐటీ పత్రాల్లో గుర్తించిన సమస్య చట్టపరమైన చర్యలకు దారితీయొచ్చు. దీనికి పన్ను చెల్లింపుదారులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో వారు సంతృప్తి చెందకపోతే.. విచారణ చేపట్టి తగు సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటారు.
ఐటీ విభాగం ఏయే సెక్షన్ల కింద నోటీసులు అందజేస్తుంది? వాటి అర్థం ఏంటో చూద్దాం..
సెక్షన్ 139(9): ఐటీ రిటర్నుల్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అధికారులు గుర్తిస్తే ఈ సెక్షన్ కింద నోటీసు జారీ చేస్తారు. దీనికి పన్ను చెల్లింపుదారులు ఆధారాలతో సహా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా నోటీసు అందిన 15 రోజుల్లోగా తప్పును సరిద్దుకోవాలి.
సెక్షన్ 143(1): మీరు ఇంకా ఏదైనా పన్ను బకాయి ఉంటే వెంటనే చెల్లించమని చెబుతూ నోటీసు అందజేస్తారు. 30 రోజుల్లోగా బకాయి చెల్లించాల్సి ఉంటుంది.
సెక్షన్ 143(2), సెక్షన్ 143(3): ఒకవేళ మీ ఐటీ రిటర్నులను పరిశీలన లేదా సమీక్షకు ఎంపిక చేసినట్లయితే.. సెక్షన్ 143 (2) కింద నోటీసు జారీ చేస్తారు. అప్పుడు పన్ను చెల్లింపులుదారులు వారి రిటర్నుల్లో పేర్కొన్న సమాచారానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత సెక్షన్ 143(3) కింద పూర్తిస్థాయి సమీక్షను ప్రారంభిస్తున్నట్లు స్టేట్మెంట్ను పంపిస్తారు. ఈ దశలో మీరు సమర్పించిన ఆధారాలు, రిటర్నుల్లో ఇచ్చిన సమాచారం సరిగ్గా ఉన్నాయా.. లేదా.. లోతుగా చెక్ చేస్తారు. సెక్షన్ 143(1), సెక్షన్ 143(2), సెక్షన్ 143(3) కింద నోటీసులు అందిన 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఏమైనా సర్దుబాట్లు ఉంటే వాటిని ఐటీ అధికారులు తదుపరి సంవత్సరానికి బదలాయిస్తారు.
సెక్షన్ 245: క్రితం ఏడాది పన్ను చెల్లింపు డిమాండ్లు ఏమైనా బకాయి ఉంటే.. వాటిని ఈ ఏడాది రిఫండ్ నుంచి సర్దుబాటు చేస్తున్నట్లు తెలియజేస్తూ ఐటీ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. అందుకు మీరు సమ్మతిస్తున్నారా లేదా తెలియజేస్తూ 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
నోటీసు ఎందుకు పంపారు?
తొలుత అసలు నోటీసు ఎందుకు పంపారో పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాలి. నోటీసులు పంపడానికి చాలా కారణాలుంటాయి. ఐటీఆర్ దాఖలు చేయకపోయినా; వాస్తవం కంటే తక్కువ ఆదాయం చూపినప్పుడు; ఏఐఎస్ (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్-AIS)తో రిటర్నుల సమాచారం సరిపోలకపోవడం.. వంటి సందర్భాల్లో నోటీసులు అందే అవకాశం ఉంది. ఎక్కవ మొత్తం మినహాయింపు కోరినా, ఏదైనా పన్ను ప్రయోజనం కోరినప్పుడు దానికి తగిన ఆధారాలు సమర్పించకపోయినా.. నోటీసులు జారీ చేస్తారు. ఒక్కోసారి పన్ను ఎగవేతను అరికట్టడానికి కూడా నోటీసులు ఇస్తుంటారు. జీవిత భాగస్వామి పేరిట చేసిన పెట్టుబడులపై వచ్చే ఆదాయాన్ని కూడా కచ్చితంగా రిటర్నుల్లో పేర్కొనాల్సి ఉంటుంది. లేదంటే నోటీసులు అందుతాయి.
ఎలా వివరణ ఇవ్వాలి?
నోటీసు అందగానే దాంట్లో పేర్కొన్న శాశ్వత ఖాతా సంఖ్య (PAN), పేరు, ఇతర వివరాలు మీకు సంబంధించినవేనా సరి చూసుకోవాలి. తర్వాత నోటీసు మొత్తాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఏవైనా లోపాలున్నట్లు గుర్తిస్తే దానికి అనుగుణంగా సమాధానం ఇవ్వాలి. కావాల్సిన ఆధారాలు పంపాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి. సకాలంలో స్పందించడం కూడా చాలా ముఖ్యం. లేదంటే ఏవైనా బకాయిలుంటే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఐటీ అధికారులు వారి దగ్గర ఉన్న సమాచారంతో వారి విచక్షణ మేరకు సర్దుబాట్లు చేసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన డిక్లరేషన్తో కూడిన చట్టపరమైన పత్రం. -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్