Debt Funds: తక్కువ నష్టభయం.. ఎక్కువ రాబడి కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!
పెద్దగా నష్టభయం వద్దనుకునేవారికి డెట్ ఫండ్లు మంచి రాబడినిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చినా వీటిలో రాబడి ఎక్కువే.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి స్టాక్ మార్కెట్ అనుసంధానిత సాధనాల్లో పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ఉంటుంది. కానీ, ఎక్కడ నష్టం వస్తుందోనని వెనకడుగు వేస్తుంటారు. అలా అని సురక్షితమైన ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి మార్గాల నుంచి వచ్చే రాబడితోనేమో సంతృప్తి ఉండదు. అలాంటి వారికి ‘డెట్ ఫండ్లు (Debt Funds)’ సరిగ్గా సరిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.
డెట్ ఫండ్ అంటే?
డెట్ ఫండ్ (Debt Funds) ఒక మ్యూచువల్ ఫండ్ పథకం. కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లు; కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలు; మనీ మార్కెట్ సాధనాల వంటి స్థిర ఆదాయ మార్గాల్లో మన నిధులను ఫండ్ సంస్థలు మదుపు చేస్తాయి. వీటినే ఆదాయ ఫండ్లు, బాండ్ ఫండ్లు అని కూడా పిలుస్తుంటారు.
ఎవరు మదుపు చేయొచ్చు?
నష్టభయం లేకుండా క్రమం తప్పని ఆదాయం కోసం డెట్ ఫండ్లలో మదుపు చేయొచ్చు. వీటిలో పెద్దగా హెచ్చుతగ్గులు ఉండవు. అందుకే ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే సురక్షితం. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్ల (FD)లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్డీతో పోలిస్తే అధిక పన్ను ప్రయోజనం, ఎక్కువ రాబడిని పొందొచ్చు.
డెట్ ఫండ్లు మన నిధులను కార్పొరేట్, ప్రభుత్వ బాండ్ల వంటి మార్కెట్లో నమోదైన లేదా నమోదుకాని డెట్ సాధనాల్లో ఒక ధర వద్ద మదుపు చేస్తాయి. వాటినే కొంతకాలం తర్వాత కొంత లాభంతో విక్రయిస్తాయి. ఫలితంగా మన ‘ఫండ్ నికర విలువ (NAV)’ అంటే మనం పెట్టిన పెట్టుబడి పెరుగుతూ పోతుంది. మరోవైపు నిధులను మదుపు చేసిన సాధనాల నుంచి క్రమం తప్పని వడ్డీరేటు కూడా అందుతుంది. ఇది దాదాపు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీతో సమానంగా ఉంటుంది. దీన్ని ఏరోజుకారోజు మన ఫండ్కు జత చేస్తారు. ఆ మేర డెట్ ఫండ్ ఎన్ఏవీ పెరుగుతుంది. అంటే డెట్ ఫండ్లో వడ్డీరేటుతో పాటు ఫండ్కు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఆధారంగా కూడా మన పెట్టుబడి పెరుగుతూ ఉంటుంది.
డెట్ సెక్యూరిటీల మార్కెట్ ధర వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మన డెట్ ఫండ్ దగ్గర 10 శాతం రాబడినిచ్చే సెక్యూరిటీ ఉందనుకుందాం. ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో వడ్డీరేట్లు పడిపోతే.. కొత్తగా జారీ చేసే సెక్యూరిటీలకు ఆ తగ్గిన వడ్డీరేటే వర్తిస్తుంది. అప్పుడు మన దగ్గర ఉన్న అధిక వడ్డీరేటు సెక్యూరిటీకి డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా ధర కూడా ఎగబాకుతుంది. తద్వారా డెట్ ఫండ్ ఎన్ఏవీ కూడా పెరుగుతుంది.
ఇతర ఫండ్లతో పోలిస్తే తేడా ఏంటి?
పనితీరుపరంగా చూస్తే ఇతర మ్యూచువల్ ఫండ్లతో డెట్ ఫండ్లకు పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. భద్రతాపరంగా చూస్తే మాత్రం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లతో పోలిస్తే డెట్ ఫండ్లు సురక్షితం. ఉదాహరణకు మార్కెట్లో భారీ దిద్దుబాటు జరిగితే.. అదే స్థాయిలో ఈక్విటీ ఫండ్ల ఎన్ఏవీ పడిపోతుంది. కానీ, డెట్ ఫండ్లలో మాత్రం ఒకేసారి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండదు. అదే సమయంలో ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే రిటర్నులు కూడా తక్కువే ఉంటాయి.
ఎందుకు మదుపు చేయాలి?
తక్కువ ఖర్చు, స్థిరమైన రాబడి, సరిపడా భద్రతతో కూడిన హెచ్చుతగ్గులు.. ఇవే డెట్ ఫండ్లలో మదుపు చేయడానికి మదుపర్లను ఆకర్షించే ముఖ్య కారణాలు. ఒకవేళ డివిడెండ్ను ఎప్పటికప్పుడు మదుపర్లు తీసేసుకుంటే దానిపై పన్ను వర్తించదు. అదే ఎన్ఏవీకి జత చేస్తూ వెళ్తే.. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలైతే 23.325 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దీర్ఘకాల మూలధన లాభాల కింద ఇండెక్సేషన్ లేకుండా 10 శాతం, ఇండెక్సేషన్ ఉంటే 20 శాతం పన్ను వర్తిస్తుంది. అదే స్వల్పకాల మూలధన లాభాలపై పన్ను.. ట్యాక్స్ శ్లాబును అనుసరించి ఉంటుంది.
గ్రోత్ ఆప్షన్ V/S డివిడెండ్ ఆప్షన్..
ముందుగా చెప్పినట్లు మదుపర్లు డివిడెండ్ ఆప్షన్ను ఎంచుకుంటే అంటే ఎప్పటికప్పుడు డివిడెండ్ను తీసుకుంటే ఎలాంటి పన్ను ఉండదు. అదే డివిడెండ్ను ఎప్పటికప్పుడు ఎన్ఏవీకి జత చేస్తూ వెళ్తే దాన్ని గ్రోత్ ఆప్షన్గా వ్యవహరిస్తారు. అప్పుడు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా తుది రాబడిలో కొంత తగ్గుతుంది. అయితే, తక్కువ పన్ను శ్లాబు కిందకు వచ్చేవారు గ్రోత్ ఆప్షన్ను ఎంచుకుంటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
డెట్ ఫండ్ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
డెట్ ఫండ్ రాబడి పూర్తిగా మన నిధులను ఎలా కేటాయించామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఫండ్ల పోర్ట్ఫోలియోను నిశితంగా గమనిస్తే.. రిటర్నులు, రిస్క్, హెచ్చుతగ్గులపై ఓ అవగాహన వస్తుంది. అందుకే ఒక ఫండ్ను ఎంపిక చేసుకునే ముందు ఈ కింది విషయాలను గమనించాలి..
- ‘ఫండ్ యావరేజ్ మెచ్యూరిటీ’ని చెక్ చేయాలి. ఈ గడువు ఎంత తక్కువ ఉంటే రాబడి, హెచ్చుతగ్గులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. గడువు ఎక్కువ ఉన్నట్లయితే.. హెచ్చుతగ్గులు, రాబడి కూడా ఎక్కువే ఉంటాయి.
- పోర్ట్ఫోలియోలో వీలైనంత మేర ద్రవ్యలభ్యత ఉండేలా చూసుకోవాలి. కార్పొరేట్ డెట్కు ఎక్కువ కేటాయిస్తే.. స్వల్పకాలంలో మెరుగైన రాబడిని అందుకోలేం. ఒకవేళ రిడెమ్షన్ ఒత్తిడి పెరిగితే.. ఈ సెక్యూరిటీలన్నింటినీ తక్కువ ధరతో విక్రయించాల్సి ఉంటుంది. ఫలితంగా రాబడి తగ్గుతుంది. అలాగే అన్రేటెడ్, అన్లిస్టెడ్ డెట్ ఉన్న ఫండ్లను కూడా ఎంచుకోవద్దు.
- తక్కువ నిధులు ఉన్న ఫండ్లను ఎంపిక చేసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా మదుపర్లు ఒక్కోసారి నిధులను అలాగే ఫండ్ల వద్ద అట్టిపెట్టి ఉంచుతారు. ఈ విషయాన్ని ఫండ్ సంస్థలు మనకు వెల్లడించవు. అకస్మాత్తుగా సదరు మదుపరి రీడీమ్ చేసుకుంటే మార్కెట్ ధర కంటే తక్కువకు సెక్యూరిటీలను విక్రయించాల్సి ఉంటుంది. ఇది మన రాబడిపై కూడా ప్రభావం చూపుతుంది.
- వడ్డీరేట్ల మార్పు మన డెట్ ఫండ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ‘మాడిఫైడ్ డ్యురేషన్’ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఎక్కువ ఉంటే వడ్డీరేటు హెచ్చుతగ్గుల ప్రభావం మన ఫండ్పై అధికంగా ఉంటుందని అర్థం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన డిక్లరేషన్తో కూడిన చట్టపరమైన పత్రం. -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్