పెద్దల పొదుపు పథకం నిబంధనలు మారాయ్
క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునే పెద్దలకు ఉన్న పథకాల్లో చెప్పుకోదగ్గది సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీం. ఇటీవల ఈ పథకంలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది
![](https://assets.eenadu.net/article_img/231123-siri-2a.jpg)
క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునే పెద్దలకు ఉన్న పథకాల్లో చెప్పుకోదగ్గది సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీం. ఇటీవల ఈ పథకంలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ఈ సవరణలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.
* పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇకపై పదవీ విరమణ ప్రయోజనాలు అందిన మూడు నెలల వరకూ వాటిని ఈ పథకంలో మదుపు చేయొచ్చు. 55-60 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇది వరిస్తుంది. గతంలో ఈ గడువు నెల వరకే ఉండేది.
* ఉద్యోగంలో ఉండగానే మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాముల పెట్టుబడి నిబంధనలు సైతం మారాయి. 50 ఏళ్లు దాటి సర్వీసులో ఉండగా మరణించిన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు లభించిన ఆర్థిక పరిహారాన్ని ఈ పథకంలో మదుపు చేయొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
* పదవీ విరమణ ప్రయోజనాల నిర్వచనమూ మారింది. ఉద్యోగ విరమణ వల్ల అందే ప్రతి చెల్లింపులనూ రిటైర్మెంట్ ప్రయోజనాల కిందే పరిగణిస్తారు. భవిష్య నిధి, గ్రాట్యుటీ, ఇతర పింఛన్లు, మిగిలిపోయిన సెలవులపై చెల్లింపులు, బీమా పథకాలకు సంబంధించిన పొదుపు మొత్తం, ఎక్స్గ్రేషియా.. ఇలా అన్నీ పదవీ విరమణ ప్రయోజనాల కిందకే వస్తాయి. వీటన్నింటినీ సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్ఎస్)లో పెట్టుబడి పెట్టొచ్చు.
* ముందస్తు ఉపసంహరణ నిబంధనల్లోనూ కొత్త మార్పులు వచ్చాయి. ఎస్సీఎస్ఎస్లో డిపాజిట్ చేసిన ఏడాదిలోపు ఉపసంహరించుకుంటే.. మొత్తం నుంచి ఒక శాతం కింద రుసుము వసూలు చేస్తారు. ఇంతకుముందు వడ్డీ మాత్రమే తిరిగి తీసుకొని, డిపాజిట్ మొత్తాన్ని ఇచ్చేసేవారు.
* ఎస్సీఎస్ఎస్ పొడిగింపుపై ప్రస్తుతం ఉన్న పరిమితిని ప్రభుత్వం పొడిగించింది. ఖాతాదారులు ఇకపై మూడేళ్ల చొప్పున వ్యవధిని పొడిగించుకుంటూ వెళ్లవచ్చు. దీనికి ఎలాంటి పరిమితీ లేదు. కానీ, ప్రతిసారీ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో కేవలం ఒకసారి మాత్రమే ఈ అవకాశం ఉండేది. మెచ్యూరిటీ తేదీ నాడు ఉన్న వడ్డీ రేటే వర్తిస్తుంది.
* ఖాతా తెరిచే సమయంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని మాత్రమే కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లిస్తారు. మధ్యలో అదనపు మొత్తాన్ని జమ చేసేందుకు అవకాశం ఉండదు. స్కీమ్ పొడిగించుకునే సమయంలోనూ అదనపు మొత్తాన్ని డిపాజిట్ చేసే వీలుండదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే.. నిబంధనల ప్రకారం కొత్త ఖాతాను తెరిచి, గరిష్ఠ పరిమితి మేరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ పథకంలో రూ.30 లక్షల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారులు మరణిస్తే.. జీవిత భాగస్వామి దాన్ని కొనసాగించొచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో 8.2 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం. -
క్రెడిట్ కార్డులతో ఈ ప్రయోజనాలు తెలుసా?
క్రెడిట్ కార్డులను బాధ్యతాయుతంగా ఉపయోగించడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!