పిల్లల భవితకు ఫండ్ల మార్గం
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని కలలుకంటారు. వారికి ఉత్తమ అవకాశాలను అందించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఆకాంక్షను సాధించే క్రమంలో వారు తమ కష్టార్జితాన్ని పెట్టుబడులుగా మారుస్తారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని కలలుకంటారు. వారికి ఉత్తమ అవకాశాలను అందించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఆకాంక్షను సాధించే క్రమంలో వారు తమ కష్టార్జితాన్ని పెట్టుబడులుగా మారుస్తారు. ఇందుకోసం అనేక పెట్టుబడి పథకాల మధ్య.. పిల్లల మ్యూచువల్ ఫండ్లు ఇటీవల కాలంలో ఆదరణ పొందుతున్నాయి. మరి, వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి.. తెలుసుకుందాం.
ఈ రోజుల్లో విద్యా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం 2008తో పోలిస్తే వార్షిక విద్యా వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది. ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునేందుకు పిల్లలకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల కోసం పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి అవసరంగా మారుతోంది.
ఏమిటీ పథకాలు?
మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రత్యేకంగా కొన్ని పథకాలను పిల్లల కోసం రూపొందిస్తున్నాయి. చైల్డ్ కెరియర్ ప్లాన్, చైల్డ్ గిఫ్ట్ ప్లాన్ వంటి పేర్లతో ఇప్పుడివి అందుబాటులోకి వస్తున్నాయి. గతంలోనూ ఈ పథకాలున్నాయి. కానీ, పిల్లల కోసం ప్రత్యేకంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంటంతో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఫండ్ సంస్థలు కొత్త పథకాలనూ ఆవిష్కరించాయి. సెబీ నిబంధనల ప్రకారం ఈ పథకాలకు అయిదేళ్ల లాకిన్ వ్యవధి ఉంటుంది. లేదా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ.. ఈ రెండింటిలో ఏది ముందయితే అప్పుడు పెట్టుబడిని వెనక్కి తీసుకునే వీలుంటుంది. ఇవి ఓపెన్ ఎండెడ్ హైబ్రిడ్ పథకాలు. ప్రధానంగా ఈక్విటీ, డెట్లలో మదుపు చేస్తాయి. అధిక వడ్డీ కోసం కొంత మొత్తాన్ని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు రుణం ఇచ్చేలా బాండ్లలోనూ కొంత పెట్టుబడి ఉంటుంది. మొత్తంగా వీలైనంత అధిక రాబడిని ఆర్జించేలా, అదే సమయంలో కొంత సురక్షితంగా ఉండేలా పోర్ట్ఫోలియోను రూపొందిస్తాయి. ఈక్విటీల్లో 65 శాతం వరకూ, డెట్ ఫండ్లలో 35 శాతం వరకూ మదుపు చేస్తాయి. కొన్నిసార్లు ఈక్విటీలకు 75 శాతం వరకూ కేటాయించే అవకాశాలూ ఉంటాయి.
లాభమేనా?
పిల్లల కోసం ప్రత్యేకించిన మ్యూచువల్ ఫండ్ల ప్రధాన లక్ష్యం.. వారి చదువులకు ఆ పెట్టుబడి ఉపయోగపడేలా చూడటమే. పిల్లలకు పెద్దవాళ్లయ్యే నాటికి పెద్ద మొత్తంలో నిధి జమ అయ్యేందుకు ఇవి సాయం చేస్తాయి. పిల్లల కోసం పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి, తొందరపడి వెంటనే వెనక్కి తీసుకోవద్దు. ఫండ్లలో దీర్ఘకాలం కొనసాగినప్పుడే పెట్టుబడి వృధ్ధికి అవకాశం ఉంటుంది. గత మూడేళ్ల కాలంలో ఈ విభాగంలోని పథకాలు సగటున 19.36 శాతం వరకూ రాబడినిచ్చాయి. అదే అయిదేళ్ల కాలానికి చూస్తే సగటు వార్షిక రాబడి రూ.12.69 శాతం వరకూ ఉంది.
లక్ష్యానికి తగ్గట్టుగా..
పిల్లల ఫండ్ల లక్ష్యం ఒకటే.. వారి భవిష్యత్తుకు తగిన ఆర్థిక భరోసా కల్పించడం. వారి ఉన్నత చదువులు, విదేశీ విద్యాభ్యాసం, ఇతర కలలకు తగ్గట్టుగా పెట్టుబడులు పెట్టాలి. వీలైనంతగా ఈ లక్ష్యా సాధించే వరకూ ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోకూడదు.
సమయం ఇవ్వాలి..
పెట్టుబడులు వృద్ధి చెందాలంటే.. వాటిని దీర్ఘకాలం కొనసాగించాలి. పిల్లల పథకాల్లో ఇదే సూత్రం ప్రధానం. అయిదేళ్లపాటు లాకిన్ ఉండటం వెనక లక్ష్యం ఇదే. పిల్లలు చిన్న వయసులో ఉండగానే పెట్టుబడులు ప్రారంభిస్తే.. వారు ఉన్నత చదువులకు వచ్చే నాటికి మంచి మొత్తం జమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు కొనసాగించాలి.
వైవిధ్యంగా..
పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మంచి రాబడులకు అవకాశం ఉంటుంది. పిల్లల కోసం ప్రత్యేకించిన పథకాల్లో వైవిధ్యానికి చోటు ఉంటుంది. ఈక్విటీలు, డెట్లో ఇవి మదుపు చేస్తాయి. ఫలితంగా నష్టభయం పరిమితంగా ఉండటంతోపాటు, రాబడికీ వీలుంటుంది. వీటితోపాటు, నష్టభయం భరించగలిగే శక్తి ఉన్న తల్లిదండ్రులు ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్లనూ ఎంచుకోవచ్చు. ఫలితంగా పెట్టుబడి వృద్ధికి అవకాశాలు పెరుగుతాయి.
నష్టభయం ఉన్నా..
ప్రతి పెట్టుబడికీ ఎంతోకొంత నష్టభయం ఉండటం సహజం. పిల్లల కోసం ప్రత్యేకించిన మ్యూచువల్ ఫండ్లకూ ఇది వర్తిస్తుంది. అధిక నష్టభయం ఉన్న చోట ఎక్కువ రాబడి ఉంటుందన్నది పెట్టుబడి సూత్రం. వ్యవధి గడుస్తున్న కొద్దీ మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో నష్టభయం పరిమితం అవుతుంది. కనీసం ఏడు నుంచి ఎనిమిదేళ్ల పాటు మదుపు చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడే వీటిని ఎంచుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన డిక్లరేషన్తో కూడిన చట్టపరమైన పత్రం. -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..