ఆవిష్కరణలకు తోడుగా
బరోడా బీఎన్పీ పారిబస్ మ్యూచువల్ ఫండ్.. బరోడా బీఎన్పీ పారిబస్ ఇన్నోవేషన్ ఫండ్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చే కంపెనీలపై పెట్టుబడి పెట్టే ఓపెన్ ఎండెడ్ పథకం ఇది
బరోడా బీఎన్పీ పారిబస్ మ్యూచువల్ ఫండ్.. బరోడా బీఎన్పీ పారిబస్ ఇన్నోవేషన్ ఫండ్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చే కంపెనీలపై పెట్టుబడి పెట్టే ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. దాదాపు 80 శాతం నిధులను ఈక్విటీ పెట్టుబడులకే కేటాయిస్తారు. ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 28. కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి.
టెక్ కంపెనీలో
టెక్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి, లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఎడిల్వైజ్ మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ఎడిల్వైజ్ టెక్నాలజీ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 28. కనీస పెట్టుబడి రూ.100. ఈ పథకం పెట్టుబడులన్నీ ప్రధానంగా టెక్నాలజీ కంపెనీలపై కేంద్రీకృతమై ఉంటాయి. ఎస్అండ్పీ బీఎస్ఈ టెక్ టీఆర్ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు.
కోటక్ టెక్నాలజీ ఫండ్: కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఇదే కోవలో ఒక పథకం వచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ కంపెనీలపై పెట్టుబడి పెట్టటం కోటక్ టెక్నాలజీ ఫండ్ ప్రధాన లక్ష్యం. దీని ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 26. ఎన్ఎఫ్ఓలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి.
చిన్న షేర్లలో
ఇండెక్స్ తరగతికి చెందిన ‘గ్రో నిఫ్టీ స్మాల్క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్’ అనే ఒక కొత్త పథకాన్ని గ్రో మ్యూచువల్ ఫండ్ రూపొందించింది. ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 23. ఎన్ఎఫ్ఓలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాలి. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్- టీఆర్ఐ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఈ సూచీలో భాగంగా ఉన్న కంపెనీల్లో మంచి పనితీరు కనబరిచే అవకాశం ఉన్న కంపెనీలను ఎంచుకొని ఇది పెట్టుబడి పెడుతుంది.
మార్పులకు అనుగుణంగా
నిఫ్టీ 200 సూచీలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న 30 కంపెనీలతో పోర్ట్ఫోలియో తయారు చేసి అధిక లాభాలు ఆర్జించటం ‘హెచ్డీఎఫ్సీ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్’ ప్రధాన లక్ష్యం. నార్మలైజ్డ్ మొమెంటమ్ స్కోర్ (ఎన్ఎంఎస్) ఆధారంగా ఈ కంపెనీలను ఎంపిక చేస్తారు. మార్కెట్లో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ఈ కంపెనీలు మారుతూ ఉంటాయి. ఈ విధానంలో ‘నిఫ్టీ 200 టీఆర్ఐ’కన్నా అధిక లాభాలు వస్తున్నాయని ఇంతవరకూ నిర్ధారణ అయింది. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 23. ఎన్ఎఫ్ఓలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి.
అధిక లాభాల కోసం
హెచ్ఎస్బీసీ మ్యూచువల్ ఫండ్ ఒక మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్ను రూపొందించింది. హెచ్ఎస్బీసీ మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 22. కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. అన్ని రకాలైన పెట్టుబడి సాధనాల్లో మదుపు చేసి, అధిక లాభాలు ఆర్జించడం, నష్టభయాన్ని తగ్గించుకోవడం ఈ పథకం ప్రధాన వ్యూహం. ఈక్విటీ, రుణ పత్రాలు, బంగారం, వెండి ఈటీఎఫ్లు, ఇతర పెట్టుబడి సాధనాలతో ఈ పథకం పోర్ట్ఫోలియోను రూపొందిస్తారు.
నూతన రంగాల్లో
యూనియన్ బిజినెస్ సైకిల్స్ ఫండ్ పేరుతో యూనియన్ మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తున్న నూతన వ్యాపార రంగాల్ని గుర్తించి, ఆ రంగాలకు చెందిన కంపెనీలపై పెట్టుబడి పెట్టి, అధిక లాభాలు నమోదు చేయడం ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 27. కనీస పెట్టుబడి రూ.1,000. సంజయ్ బెంబాల్కర్, హార్దిక్ బోరా ఈ పధకానికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన డిక్లరేషన్తో కూడిన చట్టపరమైన పత్రం. -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం