స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి.
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ స్థిరాస్తి రంగం ఎప్పుడూ పెట్టుబడి దారులను ఆకర్షిస్తూనే ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం కావడం ఒక్కటే ఇక్కడ ప్రతికూలాంశం. ఈ ఇబ్బందిని అధిగమిస్తూ.. తక్కువ మొత్తంతోనూ వాణిజ్య స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పించేవే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్). రూ.100తోనూ ఇందులో మదుపు చేయొచ్చు. వీటి గురించి తెలుసుకుందామా..
ఏదైనా వాణిజ్య భవనాన్ని చూసినప్పుడు ఇందులో మనకూ వాటా ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. కానీ, అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దేశంలో స్థిరాస్తి అంటే నివాస గృహాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. వాణిజ్య స్థిరాస్తి రంగం దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది. కార్యాలయాల స్థలాలు, ఐటీ సంస్థలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, హబ్లు, నాలెడ్జ్ పార్కుల వంటి వాటితో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పించేవే రీట్స్. మరోమాటలో చెప్పాలంటే.. ఆస్తులను ప్రత్యక్షంగా కొనాల్సిన అవసరం లేకుండా, రీట్స్లో మదుపు చేస్తే చాలు. అది నిర్వహించే వాణిజ్య ఆస్తుల్లో మనకు వాటా ఉంటుందన్నమాట.
రకాలున్నాయి...
రీట్స్లో కొన్ని రకాలూ ఉన్నాయి. ఈక్విటీ రీట్స్ స్థిరాస్తులలో నేరుగా మదుపు చేస్తాయి. వాటిలో వాటాలను కొనుగోలు చేస్తాయి. అద్దె ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తాయి. కొన్ని రీట్స్ స్థిరాస్తి డెవలపర్లకు డబ్బును అప్పుగా ఇస్తాయి. వీటికి వడ్డీ ఆదాయం లభిస్తుంది. మరికొన్ని హైబ్రిడ్ రీట్స్ వాణిజ్య స్థలాలను కొనడంతోపాటు, అప్పులూ ఇస్తుంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రీట్స్ అనుకూలంగా ఉన్నాయన్నది పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
రూ.100తోనూ..
మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పర్యవేక్షణలోనే రీట్స్ ఉంటాయి. కాబట్టి, పారదర్శకత ఉంటుంది. కచ్చితమైన నిబంధనలూ పాటిస్తాయి. రీట్స్ను నేరుగా డీమ్యాట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఫండ్ ఆఫ్ ఫండ్లూ అందుబాటులో ఉన్నాయి. యూనిట్లను కొనుగోలు చేయడం ద్వారా వీటిలో మదుపు చేయొచ్చు. కనీసం రూ.100తోనూ వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ చేయాలంటే కొన్ని ఫండ్లలో రూ.1,000 అవసరం. కావాలనుకున్నప్పుడు యూనిట్లను అమ్ముకునే వీలూ ఉంటుంది.
రాబడి ఎలా..
రీట్స్లను నిర్వహించే సంస్థలు 80 శాతం వరకూ ఆదాయాన్ని ఆర్జించే ఆస్తులలోనే పెట్టుబడులు పెట్టాలనేది నిబంధన. వచ్చిన ఆదాయంలో కనీసం 90 శాతం ప్రతి ఆరు నెలలకోసారి డివిడెండ్ రూపంలో అందించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది అద్దె ఆదాయం అనుకోవచ్చు.
పరిశోధించండి..
రీట్స్లో మదుపు చేసేందుకు ముందుగా వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అవి ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నాయో పోర్ట్ఫోలియోను గమనించాలి. వాటి పనితీరును అంచనా వేయాలి. ఆయా వాణిజ్య స్థలాలకు ఉన్న గిరాకీలాంటివి చూడాలి. అప్పుడే సరైన రీట్స్ను ఎంచుకోగలం.
వైవిధ్యం కోసం..
పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం రీట్స్ను ఎంచుకోవచ్చు. రిటెయిల్, ఆఫీసు స్థలాలు, నివాస గృహాలు ఇలా పలు విధాలుగా మదుపు చేసే రీట్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల నష్టభయం తగ్గుతుంది.
ఆదాయంపై దృష్టి..
అద్దెల ద్వారా ఆదాయం సంపాదించడమే రీట్స్ ప్రధాన లక్ష్యం. మీరు ఎంచుకున్న రీట్స్ గత కొంతకాలంగా ఎంత డివిడెండ్ రాబడిని అందించిందో చూసుకోండి. అదే సమయంలో మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ పనితీరునూ అంచనా వేయాలి. అవసరాన్ని బట్టి, మార్పులు చేర్పులు చేసుకోవాలి. అప్పుడే రీట్స్ నుంచి మంచి లాభాలను ఆర్జించేందుకు వీలవుతుంది.
నష్టభయాలూ ఉంటాయి..
పెట్టుబడులు ఏమైనా నష్టభయం సహజం. రీట్స్లోనూ ఇది ఉంటుంది. పెట్టుబడి విలువలో హెచ్చుతగ్గులు, ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోవడంవల్ల ఆదాయం రాకపోవడంలాంటివి ఉండొచ్చు. ఇలాంటప్పుడు మన పెట్టుబడిపై ఆదాయం రాకపోవచ్చు. విలువా తగ్గేందుకు అవకాశాలున్నాయి. వీటికి సిద్ధంగా ఉంటేనే రీట్స్ను ఎంచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం. -
క్రెడిట్ కార్డులతో ఈ ప్రయోజనాలు తెలుసా?
క్రెడిట్ కార్డులను బాధ్యతాయుతంగా ఉపయోగించడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు