స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు..
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు కొనసాగించాలా? వద్దా అనే సందేహం చాలామందికి వస్తోంది. సూచీలకు వస్తున్న నష్టాలు వారిని ఆందోళనలోనూ పడేస్తున్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మదుపరులు పాటించాల్సిన సూత్రాలేమిటో చూద్దాం..
కొంత కాలంగా స్టాక్ మార్కెట్లు గణనీయంగా పెరిగాయి. జీవన కాల గరిష్ఠాలను తాకి వెనక్కి వచ్చాయి. రెండు మూడేళ్ల క్రితం నుంచి మదుపు చేస్తున్న వారి ఈక్విటీ పోర్ట్ఫోలియోల విలువ దాదాపు 25-30 శాతం వరకూ పెరిగిన సందర్భాలూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లలో కొంత అనిశ్చితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, పెట్టుబడులను సర్దుబాటు చేసుకునేందుకు ఇది సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. మంచి పనితీరున్న కంపెనీలు, ఫండ్లను ఎంచుకునేందుకు ఇప్పుడు మంచి అవకాశంగా పేర్కొంటున్నారు.
అనిశ్చితి ఉన్నా..
మార్కెట్ కొంత గందరగోళంగా ఉందన్న మాట వాస్తవం. కానీ, పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఇదొక్కటే కారణం కాకూడదు. పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడే 10-20 శాతం దిద్దుబాటు కచ్చితంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. బలమైన కారణం ఉంటేనే పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలి.
ఎంపికలో జాగ్రత్త..
కరోనా తర్వాత మార్కెట్ ఇస్తున్న లాభాలను చూసిన చాలామంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లతోపాటు, నేరుగా షేర్లలోనూ మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడులను ఎంచుకునేటప్పుడు కాస్త వైవిధ్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఒకే పథకంలో మొత్తం మదుపు చేయడం మంచిది కాదు. మీ పెట్టుబడుల్లో కొంత నష్టభయం ఉన్న వాటికీ, మిగిలిన మొత్తం సురక్షిత పథకాలకూ కేటాయించండి. అప్పుడే అనిశ్చితిలోనూ మీ డబ్బుకు ఇబ్బంది ఉండదు. పోర్ట్ఫోలియోను సిద్ధం చేసుకునేటప్పుడు లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు, ఫండ్లు ఉండేలా చూసుకోవడం మంచిది.
మార్పులకు సరైన సమయం..
మీ ప్రస్తుత పెట్టుబడులను ఒకసారి సమీక్షించుకోండి. సూచీల్లో వృద్ధి కారణంగా మీ ఈక్విటీ పెట్టుబడుల మొత్తం పెరిగిపోవచ్చు. ఇందులో కొంత భాగాన్ని వెనక్కి తీసుకొని, సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించవచ్చు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ పథకాల్లో ఉన్న పెట్టుబడులనూ ఒకసారి పరిశీలించండి. స్మాల్, మిడ్ క్యాప్లలో అధికంగా ఉంటే.. వాటిని కొంత మేరకు విక్రయించి, లార్జ్ క్యాప్లోకి మార్చండి. మార్కెట్లో అన్ని కంపెనీల షేర్లూ ఒకే విధంగా పడిపోవు. మార్కెట్ పతనం అవుతున్నప్పుడూ కొన్ని రంగాలు, సంస్థల షేర్లు లాభాలు ఇస్తుంటాయి. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని మంచి కంపెనీల షేర్లూ తగ్గుతుంటాయి. వీటిలో దశల వారీగా మదుపు చేసేందుకు ప్రయత్నించాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం.. మార్కెట్లో ఎప్పుడూ దీన్ని మర్చిపోవద్దు.
దీర్ఘకాలం కోసమే..
దీర్ఘకాలిక లక్ష్యం కోసం మదుపు చేస్తున్నప్పుడు స్వల్పకాలిక లాభాలపై దృష్టి పెట్టకూడదు. కొంతమంది లాభాలు ఇస్తున్న షేర్లను విక్రయించి, నష్టాలు వచ్చిన వాటిని కొనసాగిస్తుంటారు. ఇది సరైన వ్యూహం కాదు. మార్కెట్లో దిద్దుబాటు అంటే దీర్ఘకాలిక మదుపరులకు ఒక అవకాశం. ఇప్పుడు మొత్తం పెట్టుబడి, లాభాలను వెనక్కి తీసుకొని, మార్కెట్ తగ్గినప్పుడు మదుపు చేయాలనేదీ సరైన వ్యూహం కాదు. మార్కెట్ నుంచి ఒకసారి బయటకు వస్తే.. తిరిగి ప్రవేశించడం అంత తేలిక కాదు. విలువలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అప్పుడు మళ్లీ పోర్ట్ఫోలియోను నిర్మించడం కష్టం అవుతుంది. కాబట్టి, క్రమానుగత పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉండాలి. మీకు సంతృప్తి అనిపించినప్పుడు ఆ మేరకు లాభాలను స్వీకరించే ప్రయత్నం చేయొచ్చు.
వైవిధ్యంగా..
లక్ష్యం, పెట్టుబడి వ్యవధి ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి. అప్పుడే నష్టభయమూ పరిమితంగా ఉంటుంది. పెట్టుబడి పథకాలను వృద్ధి, నాణ్యత, విలువ ఆధారంగా చూడాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న పథకాల్లో మనకు ఏది సరిపోతుంది అనేది తెలుసుకుంటే చాలు. పెట్టుబడుల్లో 15-20 శాతం వరకూ అంతర్జాతీయ ఫండ్లకూ కేటాయించాలి. కనీసం 10-15 శాతం వరకూ డెట్ పథకాలకూ మళ్లించాలి. 10 శాతం వరకూ బంగారంలోనూ మదుపు చేయాలి. ఈక్విటీ మార్కెట్లో దిద్దుబాటు వచ్చినప్పుడు ఈ పెట్టుబడులు కొంత ఊరటనిస్తాయి. ఈటీఎఫ్లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్ల ద్వారా పాసివ్ పెట్టుబడులు పెట్టేందుకూ ప్రయత్నించాలి.
మార్కెట్ను నిరంతరం ఎన్నో వార్తలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్నింటికి సానుకూలంగానూ, మరికొన్నింటికి ప్రతికూలంగానూ మార్కెట్ స్పందిస్తుంది. పెట్టుబడిదారులు ఎప్పుడూ మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుంటూ అడుగులు వేయాలి. పెట్టుబడి మార్గాలను అర్థం చేసుకోవడం, వాటిని ఎంపిక చేసుకోవడంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన డిక్లరేషన్తో కూడిన చట్టపరమైన పత్రం. -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్