Google Gemini: గూగుల్ జెమిని వచ్చేసింది.. ప్రత్యేకతలివే
ఏఐ మోడల్ అడ్వాన్స్డ్ వెర్షన్ను గూగుల్ ప్రపంచానికి పరిచయం చేసింది. గూగుల్ జెమిని పేరుతో మూడు వేరియంట్లలో దీనిని తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ (AI) రంగంలో గూగుల్ కొత్త అంకానికి తెరలేపింది. గూగుల్ జెమిని (Google Gemini) పేరుతో అత్యంత అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ మోడల్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని తెలిపింది. జెమిని 1.0 వెర్షన్ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. జెమిని అల్ట్రా (Gemini Ultra), జెమిని ప్రో (Gemini Pro), జెమిని నానో (Gemini Pro). ఇది డేటా సెంటర్ల నుంచి మొబైల్ డివైజ్ల వరకు అన్నింటిలో పనిచేస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) తెలిపారు.
జెమిని ప్రత్యేకతలు
శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించిన పరిశోధన పత్రాల్లో గ్రాఫ్లు, గణాంకాలను రూపొందించగలదు. విద్యార్థుల హోంవర్క్లో సాయపడుతుంది. ఉదాహరణకు మ్యాథ్స్ హోంవర్క్ను ఫొటో తీసి జెమినిలో అప్లోడ్ చేస్తే.. దానికి కచ్చితమైన సమాధానం ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను గూగుల్ షేర్ చేసింది. దాంతోపాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను రాయడంతోపాటు యూజర్లకు సులభమైన పద్ధతిలో వివరిస్తుంది.
జెమిని ప్రస్తుతం ఆంగ్ల భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని భాషల్లో పరిచయం చేస్తామని గూగుల్ తెలిపింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్, క్రోమ్ బ్రౌజర్ సహా ఇతర గూగుల్ సర్వీసుల్లో జెమిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సుందర్ పిచాయ్ చెప్పారు.
జెమిని నానో
ఇది జెమిని ఏఐ మోడల్ లైట్ వెర్షన్. మొబైల్ డివైజ్ల కోసం దీనిని డిజైన్ చేసినట్లు గూగుల్ చెబుతోంది. గూగుల్ పిక్సెల్ 8 ఫోన్తోపాటు ఆండ్రాయిడ్ 14 వెర్షన్లో డిసెంబరు 13 నుంచి యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుంది. చాట్/మెసేజింగ్ యాప్లలో ఇతరుల మెసేజ్లకు యూజర్ రిప్లై ఇచ్చేందుకు కావాల్సిన సమాచారాన్ని ముందుగానే సూచిస్తుంది.
జెమిని ప్రో
ప్రస్తుతం వినియోగంలో ఉన్న గూగుల్ బార్డ్ (Google Bard) ఏఐకు ఇది అడ్వాన్స్డ్ వెర్షన్. కచ్చితత్వంతో వేగవంతమైన ఫలితాలు ఇస్తుందని గూగుల్ చెబుతోంది. డెవలపర్స్, గూగుల్ ప్రొడక్ట్స్ కమర్షియల్ యూజర్లకు డిసెంబరు 13 నుంచి జెమిని ఏపీఐ, గూగుల్ జనరేటివ్ ఏఐ స్టూడియో, వెర్టెక్స్ ఏఐ, గూగుల్ క్లౌడ్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
జెమిని అల్ట్రా
ఏఐ లాంగ్వేజ్ మోడల్లోనే శక్తివంతమైన వెర్షన్ ఇదేనని గూగుల్ చెబుతోంది. డేటా సెంటర్లు, కార్పొరేట్ సంస్థల వ్యాపార అవసరాల నిమిత్తం దీనిని ఉపయోగించవచ్చని తెలిపింది. పైథాన్, జావా, సీ++, గో వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను అర్థం చేసుకుని సులభతర విధానంలో వివరించగలదని గూగుల్ తెలిపింది. 2024లో దీనిని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్లైఓవర్’ కష్టాలకు చెక్.. గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్లు
Google Maps: ఫ్లైఓవర్ కష్టాలకు చెక్ పెడుతూ గూగుల్ మ్యాప్స్లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
వాట్సప్లో ఏఐ ఫీచర్.. మిమ్మల్ని మీరు ఊహించుకోండి!
Whatsapp AI feature: వాట్సప్లో కొత్త ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్ను మీకు నచ్చినట్లుగా జనరేట్ చేసుకోవచ్చు. -
యూట్యూబ్లో అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు
YouTube down: ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13పై డిస్కౌంట్
Amazon prime day sale: జులై 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఇందులో పలు మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తున్నారు. -
విండోస్లో ‘బ్లూ స్క్రీన్’ ఎర్రర్.. కారణమిదే!
Microsoft outage: క్రౌడ్ స్ట్రయిక్ అప్డేట్ కారణంగానే విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తేలింది. -
ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయం.. విమాన సర్వీసులపైనా ఎఫెక్ట్
Microsoft outage: మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమయ్యింది. -
అపరిమిత 5జీ కోసం ఎయిర్టెల్లో డేటా బూస్టర్ ప్యాక్లు
Airtel: టారిఫ్ల పెంపు తర్వాత ఎయిర్టెల్ కొన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ ప్రయోజనాన్ని తొలగించింది. అలాంటి వారికోసం కొత్తగా డేటా బూస్టర్ ప్యాక్లు తీసుకొచ్చింది. -
టెలికాం ఛార్జీల ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్కు పెరుగుతున్న సబ్స్క్రైబర్లు
BSNL: టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తరుణంలో యూజర్లు బీఎస్ఎన్ఎల్వైపు చూస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. -
50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్ సపోర్ట్తో హానర్లో 2 కొత్త ఫోన్లు
Honor 200 Series: హానర్లో మరో రెండు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. వీటిలో 50 ఎంపీ కెమెరా సెటప్, 5,200mAh బ్యాటరీ సహా మరిన్ని ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. విడుదల సందర్భంగా డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. -
గూగుల్ జెమినీలో కొత్త సదుపాయం.. లాక్స్క్రీన్లోనూ ఇక సమాధానం
Gemini on Lock screen: గూగుల్ జెమినీని ఇకపై లాక్ స్క్రీన్పై కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ను మాన్యువల్గా మార్చుకోవాల్సి ఉంటుంది. -
బిగ్ బ్యాటరీతో శాంసంగ్ M35 5జీ.. సేల్, ఆఫర్లు ఇవే..!
Samsung Galaxy M35 5G: శాంసంగ్ సంస్థ కొత్తగా ఎం35 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ₹1,999కే ఫైర్ టీవీ స్టిక్.. ₹2,499తో ఎకో పాప్
Amazon Prime Day Sale: ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ తమ బ్రాండ్తో వస్తోన్న ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపునిస్తోంది. -
100W ఫాస్ట్ ఛార్జింగ్తో వన్ప్లస్ నార్డ్ 4.. ట్యాబ్, వాచ్, బడ్స్ వివరాలు ఇవే..
OnePlus Nord 4: వన్ప్లస్ సంస్థ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. నార్డ్ సిరీస్లో నార్డ్ 4ను తీసుకొచ్చింది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. -
రూ.10 వేలకే ఐకూ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ
iQOO Z9 Lite: ఐకూ జెడ్9 లైట్ ఫోన్ భారత్లో విడుదలైంది. రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొద్ది 5జీ ఫోన్లలో ఇదొకటి. -
ఇక జియోలో రెండే వార్షిక ప్లాన్లు.. అవేంటి? ప్రయోజనాలెలా ఉన్నాయ్?
Reliance Jio: టారిఫ్ల పెంపు తర్వాత రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో అనేక మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ టెలికాం ప్రొవైడర్ కేవలం రెండు వార్షిక ప్లాన్లను మాత్రమే విక్రయిస్తోంది. అవేంటి? అందులో ప్రయోజనాలెలా ఉన్నాయో చూద్దాం.. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఆడియో వినే పని లేకుండానే!
Whatsapp new feature: వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆడియో సందేశాలకు అక్షర రూపం ఇవ్వనుంది. బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. -
ఒప్పో రెనో 12 సిరీస్.. 50MP కెమెరా, ఏఐ టూల్స్, 5,000mAh బ్యాటరీ
Oppo Reno 12 series: ఒప్పో రెనో సిరీస్లో మరో రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. 50MP కెమెరా సహా ఏఐ టూల్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
స్కామ్ అలర్ట్: ఇండియా పోస్ట్ పేరుతో లింకులు.. క్లిక్ చేస్తే అంతే!
India post scam: తపాలా శాఖ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసానికి తెర తీశారు. మోసపూరిత లింకులను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సేవలు
Flipkart : ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్ సొల్యూషన్ల సంస్థ బిల్డెస్క్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. -
శాంసంగ్ కొత్త ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్లు వచ్చేశాయ్.. ధర, ఇతర వివరాలు ఇవే..!
Samsung Unpacked event: శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ ఫ్లిప్, ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటితో పాటు మరికొన్ని ఉత్పత్తులను తీసుకొచ్చింది. -
మీ వస్తువులు మరిచిపోరిక.. రిలయన్స్ నుంచి జియో ట్యాగ్ ఎయిర్
JioTag Air: రిలయన్స్ జియో సంస్థ కొత్త ట్రాకింగ్ పరికరాన్ని లాంచ్ చేసింది. దీని ధరను రూ.1499గా నిర్ణయించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు