PMSBY: ₹20 ప్రీమియంతో ₹2 లక్షల ప్రమాద బీమా.. ఇలా చేరండి..!
PMSBY: సామాన్యులకు బీమా ప్రయోజనాలు అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో ఎలా చేరాలి? ప్రీమియం ఎంత? మరిన్ని వివరాలు తెలుసుకోండి.
PMSBY full details | ఇంటర్నెట్డెస్క్: ఏదైనా అనుకోని ప్రమాదం కారణంగా మరణించినా లేదా వైకల్యం పొందినా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించటం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) పథకాన్ని తీసుకొచ్చింది. అతి తక్కువ ప్రీమియం చెల్లింపుతో రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని 2015లోనే కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఈ పథకం కింద 34.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. అందులో 1.15 లక్షల కుటుంబాలు రూ.2,302 కోట్ల ఆర్థిక లబ్ధి పొందాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ పథకం గురించి పూర్తి వివరాలు..
అర్హత
- 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో (PMSBY) చేరేందుకు అర్హులు.
- బ్యాంకు/ పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్న వారెవరైనా ఈ పథకంలో చేరొచ్చు.
- ఇందుకోసం బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానించాల్సి ఉంటుంది. ఒక వేళ అనుసంధానం చేయకపోతే కేవైసీ చేయించడం తప్పనిసరి.
- ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు కలిగి ఉంటే, ఏదైనా ఒక పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి మాత్రమే పథకానికి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఒక వేళ రెండింటి ద్వారా నమోదు చేసుకుని ప్రీమియం చెల్లించినప్పటికీ ఒకటి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
- ఉమ్మడి ఖాతా తీసుకున్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇద్దరూ విడివిడిగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
- భారతదేశంలో పొదుపు ఖాతా ఉన్న ఎన్నారైలు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు.
నమోదు కాలవ్యవధి
ఈ పథకం ఒక సంవత్సరం కాలపరిమితితో వస్తుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. ప్రతి ఏడాది జూన్ 1లోగా ప్రీమియం మొత్తం ఆటో డెబిట్ ద్వారా రెన్యువల్ అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే.. రద్దు కోసం బ్యాంకును కోరాలి. కొత్తగా ఈ పథకంలో చేరే వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజీ లభిస్తుంది.
నామమాత్రపు ప్రీమియమే..
సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నామమాత్రపు ప్రీమియంతో సురక్షా బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పథకాన్ని ప్రారంభించినప్పుడు కేవలం రూ.12 ప్రీమియంతోనే పాలసీని అందించేవారు. గతేడాది నుంచి ప్రీమియంను రూ.20కు పెంచారు. ఆటోడెబిట్ ద్వారా బ్యాంకు/పోస్టాఫీసు ఖాతా నుంచి ఒకే వాయిదాలో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. ప్రతి సంవత్సరం జూన్ 1లోగా పాలసీని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. ఈ పథకంలో జాయిన్ అయ్యేవారు ప్రీమియం మొత్తాన్ని ఏటా ఖాతా నుంచి ఆటోమేటిక్గా తీసుకునేందుకు బ్యాంకులను అనుమతించాలి.
బీమా హామీ
పాలసీదారుడు మరణించినా లేదా శాశ్వత వైకల్యం చెందినా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష బీమా పరిహారం లభిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి సమయాల్లో వారి కుటుంబానికి ఎలాంటి బీమా ప్రయోజనమూ లభించదు. అదే హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజీ లభిస్తుంది.
ఎప్పుడు రద్దవుతుందంటే?
- ప్రీమియం డబ్బును ఆటోమేటిక్గా బ్యాంకులు తీసుకొనేందుకు అనుమతించాలి. ఒకవేళ డెబిట్ అయ్యే సమయంలో తగినంత బ్యాలెన్స్ ఖాతాలో లేనప్పుడు బీమా పాలసీ రద్దవుతుంది.
- బ్యాంక్/పోస్టాఫీసులలో పొదుపు ఖాతా రద్దయినప్పుడు లేదా మూసివేసిన సందర్భాల్లో పాలసీ రద్దవుతుంది.
- చందాదారుని వయసు 70 ఏళ్లు దాటిన తర్వాత బీమా వర్తించదు.
క్లెయిమ్ ఎలా?
పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే దాన్ని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించినట్లయితే ఈ పథకం కింద క్లెయిమ్ మంజూరవుతుంది. ఆత్మహత్య మినహా.. రోడ్డు ప్రమాదం, హత్యకు గురికావటం లేదా ఏ ఇతర కారణాల ద్వారా మరణాలు సంభవిస్తే ఆ మరణాన్ని పోలీసులు ధ్రువీకరించాలి. క్లెయిమ్ ఫారానికి ఒరిజినల్ ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ లేదా వైకల్యం ఉంటే సివిల్ సర్జన్ జారీ చేసే వైకల్య ద్రువపత్రం తప్పనిసరిగా జత చేయాలి. కొన్నింటికి డిశ్చార్జి సర్టిఫికెట్ కూడా జతచేయాలి. ఒకవేళ పాలసీ తీసుకున్న సమయంలో నామినీ తెలపకపోతే వారసుడు క్లెయిమ్ కోసం దాఖలు చేసుకోవచ్చు. పూర్తి చేసిన క్లెయిమ్ ఫారమ్ను ప్రమాదం జరిగిన రోజు నుంచి 30 రోజులలోపు బ్యాంకు శాఖకు సమర్పించాలి.
ఇలా చేరండి
ఈ పథకంలో చేరడానికి https://www.jansuraksha.gov.in వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో అడిగిన వివరాలన్నీ రాసి బ్యాంకు లేదా పోస్టాఫీసులో అందించాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇందుకోసం మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్లో లాగిన్ అవ్వాలి. అందులో ఉన్న Insurance ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ప్రీమియం చెల్లించటం కోసం మీ బ్యాంక్ఖాతాను ఎంచుకోవాలి. అన్ని వివరాలూ తనిఖీ చేసుకొని నిర్ధారించుకొని confirmపై క్లిక్ చేయాలి. అనంతరం Download ఆప్షన్పై క్లిక్ చేసి మీ పాలసీ రశీదును డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్లో రిఫరెన్స్ కోసం దీన్ని భద్రపరచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి. -
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో మదుపర్లకు రెండు రకాల పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఇలా ఉన్నాయి
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. -
ఓటీపీ ఆ అంకెలు జాగ్రత్త
ఒక్క క్లిక్తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి -
పన్ను ప్రణాళికకు తరుణమిదే..
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. ఆదాయపు పన్ను మినహాయింపుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పాత పన్నువిధానంలోనే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్న వారు -
రెస్టరంట్లో డబ్బు ఆదా చేయడానికి చిట్కాలు
ఎప్పుడైనా కుటుంబంతో కలిసి రెస్టరంట్కు వెళ్లాలనుకునేవారు బిల్లుపై తగ్గింపు పొందాలనుకుంటారు. అలాంటి వారికోసమే కొన్ని చిట్కాలు. -
ఆన్లైన్ vs ఆఫ్లైన్ బీమా.. ఏది మెరుగైనది?
ప్రస్తుతం అన్ని రకాల బీమా పాలసీలు ఆన్లైన్, ఆఫ్లైన్లో లభిస్తున్నాయి. ఇవి వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తాయి? ఎలా మెరుగైనవి అనేది ఇక్కడ తెలుసుకోండి. -
ఎన్పీఎస్ లాగిన్, క్రెడిట్ కార్డ్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి రాబోతున్న మార్పులివీ..
Changes from april 1st: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవేంటో చూసేయండి..
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు