PMSBY: ₹20 ప్రీమియంతో ₹2 లక్షల ప్రమాద బీమా.. ఇలా చేరండి..!
PMSBY: సామాన్యులకు బీమా ప్రయోజనాలు అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో ఎలా చేరాలి? ప్రీమియం ఎంత? మరిన్ని వివరాలు తెలుసుకోండి.
PMSBY full details | ఇంటర్నెట్డెస్క్: ఏదైనా అనుకోని ప్రమాదం కారణంగా మరణించినా లేదా వైకల్యం పొందినా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించటం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) పథకాన్ని తీసుకొచ్చింది. అతి తక్కువ ప్రీమియం చెల్లింపుతో రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని 2015లోనే కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఈ పథకం కింద 34.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. అందులో 1.15 లక్షల కుటుంబాలు రూ.2,302 కోట్ల ఆర్థిక లబ్ధి పొందాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ పథకం గురించి పూర్తి వివరాలు..
అర్హత
- 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో (PMSBY) చేరేందుకు అర్హులు.
- బ్యాంకు/ పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్న వారెవరైనా ఈ పథకంలో చేరొచ్చు.
- ఇందుకోసం బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానించాల్సి ఉంటుంది. ఒక వేళ అనుసంధానం చేయకపోతే కేవైసీ చేయించడం తప్పనిసరి.
- ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు కలిగి ఉంటే, ఏదైనా ఒక పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి మాత్రమే పథకానికి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఒక వేళ రెండింటి ద్వారా నమోదు చేసుకుని ప్రీమియం చెల్లించినప్పటికీ ఒకటి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
- ఉమ్మడి ఖాతా తీసుకున్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇద్దరూ విడివిడిగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
- భారతదేశంలో పొదుపు ఖాతా ఉన్న ఎన్నారైలు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు.
నమోదు కాలవ్యవధి
ఈ పథకం ఒక సంవత్సరం కాలపరిమితితో వస్తుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. ప్రతి ఏడాది జూన్ 1లోగా ప్రీమియం మొత్తం ఆటో డెబిట్ ద్వారా రెన్యువల్ అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే.. రద్దు కోసం బ్యాంకును కోరాలి. కొత్తగా ఈ పథకంలో చేరే వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజీ లభిస్తుంది.
నామమాత్రపు ప్రీమియమే..
సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నామమాత్రపు ప్రీమియంతో సురక్షా బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పథకాన్ని ప్రారంభించినప్పుడు కేవలం రూ.12 ప్రీమియంతోనే పాలసీని అందించేవారు. గతేడాది నుంచి ప్రీమియంను రూ.20కు పెంచారు. ఆటోడెబిట్ ద్వారా బ్యాంకు/పోస్టాఫీసు ఖాతా నుంచి ఒకే వాయిదాలో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. ప్రతి సంవత్సరం జూన్ 1లోగా పాలసీని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. ఈ పథకంలో జాయిన్ అయ్యేవారు ప్రీమియం మొత్తాన్ని ఏటా ఖాతా నుంచి ఆటోమేటిక్గా తీసుకునేందుకు బ్యాంకులను అనుమతించాలి.
బీమా హామీ
పాలసీదారుడు మరణించినా లేదా శాశ్వత వైకల్యం చెందినా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష బీమా పరిహారం లభిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి సమయాల్లో వారి కుటుంబానికి ఎలాంటి బీమా ప్రయోజనమూ లభించదు. అదే హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజీ లభిస్తుంది.
ఎప్పుడు రద్దవుతుందంటే?
- ప్రీమియం డబ్బును ఆటోమేటిక్గా బ్యాంకులు తీసుకొనేందుకు అనుమతించాలి. ఒకవేళ డెబిట్ అయ్యే సమయంలో తగినంత బ్యాలెన్స్ ఖాతాలో లేనప్పుడు బీమా పాలసీ రద్దవుతుంది.
- బ్యాంక్/పోస్టాఫీసులలో పొదుపు ఖాతా రద్దయినప్పుడు లేదా మూసివేసిన సందర్భాల్లో పాలసీ రద్దవుతుంది.
- చందాదారుని వయసు 70 ఏళ్లు దాటిన తర్వాత బీమా వర్తించదు.
క్లెయిమ్ ఎలా?
పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే దాన్ని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించినట్లయితే ఈ పథకం కింద క్లెయిమ్ మంజూరవుతుంది. ఆత్మహత్య మినహా.. రోడ్డు ప్రమాదం, హత్యకు గురికావటం లేదా ఏ ఇతర కారణాల ద్వారా మరణాలు సంభవిస్తే ఆ మరణాన్ని పోలీసులు ధ్రువీకరించాలి. క్లెయిమ్ ఫారానికి ఒరిజినల్ ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ లేదా వైకల్యం ఉంటే సివిల్ సర్జన్ జారీ చేసే వైకల్య ద్రువపత్రం తప్పనిసరిగా జత చేయాలి. కొన్నింటికి డిశ్చార్జి సర్టిఫికెట్ కూడా జతచేయాలి. ఒకవేళ పాలసీ తీసుకున్న సమయంలో నామినీ తెలపకపోతే వారసుడు క్లెయిమ్ కోసం దాఖలు చేసుకోవచ్చు. పూర్తి చేసిన క్లెయిమ్ ఫారమ్ను ప్రమాదం జరిగిన రోజు నుంచి 30 రోజులలోపు బ్యాంకు శాఖకు సమర్పించాలి.
ఇలా చేరండి
ఈ పథకంలో చేరడానికి https://www.jansuraksha.gov.in వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో అడిగిన వివరాలన్నీ రాసి బ్యాంకు లేదా పోస్టాఫీసులో అందించాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇందుకోసం మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్లో లాగిన్ అవ్వాలి. అందులో ఉన్న Insurance ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ప్రీమియం చెల్లించటం కోసం మీ బ్యాంక్ఖాతాను ఎంచుకోవాలి. అన్ని వివరాలూ తనిఖీ చేసుకొని నిర్ధారించుకొని confirmపై క్లిక్ చేయాలి. అనంతరం Download ఆప్షన్పై క్లిక్ చేసి మీ పాలసీ రశీదును డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్లో రిఫరెన్స్ కోసం దీన్ని భద్రపరచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన డిక్లరేషన్తో కూడిన చట్టపరమైన పత్రం. -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.
తాజా వార్తలు (Latest News)
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!