Jio- Airtel: ఆ యూజర్ల కోసం జియో, ఎయిర్‌టెల్‌ కొత్త రీఛార్జి ప్లాన్లు

Eenadu icon
By Business News Team Updated : 23 Jan 2025 12:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Jio- Airtel | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్‌ జియో (Jio), భారతీ ఎయిర్‌టెల్‌ (Bharati Airtel) కొత్త రీఛార్జి ప్లాన్లను తీసుకొచ్చాయి. వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇరు సంస్థలు వీటిని ప్రవేశపెట్టాయి. డేటా వద్దనుకొనేవారికి ఇవి ఉపయోగపడతాయి.

జియో వాయిస్‌ ఓన్లీ పేరిట రెండు కొత్త రీఛార్జి ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.458 ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. ఈ రీఛార్జితో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్‌, 1000 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. దీంతో పాటు జియో టీవీ, సినిమా (నాన్‌- ప్రీమియం), క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయాలు కూడా పొందొచ్చు. ఆ సంస్థ తీసుకొచ్చిన మరో ప్లాన్‌ ధర రూ.1958. దీనిలో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్యాకేజీ వ్యాలిడిటీ 365 రోజులు. రూ.458 రీఛార్జి ప్లాన్‌లో ఉన్న అదనపు ప్రయోజనాలు ఇందులోనూ లభిస్తాయి.

ఎయిర్‌టెల్ కూడా వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా రెండు రీఛార్జి ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.499కు 84 రోజుల వ్యాలిడిటీతో ప్రవేశపెట్టింది. అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్, 900 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఎయిర్‌టెల్ మరో ప్లాన్‌ ధర రూ.1959. 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న దీనిలో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ రెండింటిపై మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్‌ మెంబర్‌షిప్‌, హలో ట్యూన్‌ అదనపు ప్రయోజనాలు పొందొచ్చు.

వాయిస్‌ ఓన్లీ ప్లాన్లతో పాటు ఎయిర్‌టెల్ రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్యాకేజీలను తీసుకొచ్చింది. తక్కువ డేటాతో రీఛార్జి కోసం ఎదురుచూస్తున్న వారికి ఇవి ఉపయోగపడతాయి. 84 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్‌ రూ.548 ప్లాన్‌ ప్రవేశపెట్టింది. దీని రీఛార్జితో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, 900 ఎస్సెమ్మెస్‌లు, 7జీబీ డేటా పొందొచ్చు. మరో దాని ధర రూ.2249. వ్యాలిడిటీ 365 రోజులు. 30జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్‌, 3600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ రెండింటితో పాటు మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్‌ మెంబర్‌షిప్‌, హలో ట్యూన్‌ రివార్డు ప్రయోజనాలు లభిస్తాయి.

Tags :
Published : 23 Jan 2025 11:49 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు