Jio anniversary offer: జియో వార్షికోత్సవ ఆఫర్‌.. ఈ రీఛార్జ్‌లపై ₹700 విలువ చేసే ప్రయోజనాలు

Eenadu icon
By Business News Team Updated : 05 Sep 2024 14:49 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Jio anniversary offer | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) తన యూజర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. కంపెనీ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా కొన్ని రీఛార్జీలపై రూ.700 విలువ చేసే ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్‌ 10 లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్స్‌ పొందుతారు.

జియో వార్షిక ప్రయోజనాల్లో భాగంగా రీఛార్జిలపై రూ.175 విలువైన వోచర్‌ అందిస్తోంది. ఈ వోచర్‌ కింద 28 రోజుల పాటు 10 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రయోజనాలు, 10జీబీ డేటా పొందొచ్చు. ఆఫర్‌లో భాగంగా మూడు నెలల పాటు ఉచితంగా జొమాటో గోల్డ్‌ మెంబర్‌షిప్‌ లభిస్తుంది. అదనంగా రూ.500 విలువైన అజియో వోచర్‌ కూడా ఇస్తామని జియో ప్రకటించింది. రూ.2,999 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో అజియో వేదికగా కొనుగోలు చేసినప్పుడు అజియో కూపన్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్లు జియో అందిస్తున్న మూడు రీఛార్జి ప్లాన్‌లకే వర్తిస్తాయి.

పిల్లల యూట్యూబ్‌పై నియంత్రణ.. ఇక పేరెంట్స్‌ చేతుల్లో

ప్లాన్లు ఇవే..

జియో అందిస్తున్న రూ.899 త్రైమాసిక ప్లాన్‌తో 90 రోజల వ్యాలిడిటీతో వస్తోంది. ఈ ప్లాన్‌ రీఛార్జితో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు. దీంతోపాటు 20జీబీ డేటా అదనం. 98 రోజుల వ్యాలిడిటీతో జియో తీసుకొచ్చిన మరో ప్లాన్‌ ధర రూ.999. ఈ రీఛార్జిపై రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 2జీబీ డేటా పొందొచ్చు. జియో అందిస్తున్న రూ.3,599 ప్లాన్‌తో అపరిమిత కాలింగ్‌ లభిస్తాయి. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2.5జీబీ డేటాను పొందొచ్చు. ఈ ప్యాక్‌ వ్యాలిడిటీ 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 8 సంవత్సరాల క్రితం టెలికాం రంగంలో అడుగుపెట్టిన జియో.. ఇప్పటి వరకు 49 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. టెలికాం రంగంలో రారాజుగా కొనసాగుతోంది.

Tags :
Published : 05 Sep 2024 14:24 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని