Pension Scheme: ఎన్పీఎస్ Vs ఏపీవై.. ఏది ఎంచుకోవాలి?
ఎన్పీఎస్, ఏపీవై.. ఈ రెండు పథకాలూ పదవీవిరమణ జీవితం కోసం ఆర్థిక భద్రతను అందించేవే. మదుపుదారులు వారి వారి ప్రాధాన్యతలను అనుసరించి పథకాన్ని ఎంచుకోవాలి.
ఇంటర్నెట్ డెస్క్: రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు మదుపు చేయడం తప్పనిసరి. పెన్షన్ కోసం భారత ప్రభుత్వం రెండు పథకాలను అందిస్తోంది. ఒకటి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). మరొకటి అటల్ పెన్షన్ యోజన (APY). ఈ రెండు పథకాలు పదవీ విరమణ జీవితం కోసం ఆర్థిక భద్రతను అందించేవే అయినా రెండు ఒకదానికొకటి భిన్నం. మదుపుదారులు వారి వారి ప్రాధాన్యతలను అనుసరించి పథకాన్ని ఎంచుకోవాలి.
ఎన్పీఎస్ Vs ఏపీవై..
వేతన జీవులకు రిటైర్మెంట్ తర్వాత భరోసాను అందించడం కోసం ప్రభుత్వం ఎన్పీఎస్ (NPS)ను ప్రారంభించింది. అయితే, ఉద్యోగులే కాకుండా ఇతర పౌరులు కూడా ఈ పథకంలో చేరొచ్చు. అలాగే, అసంఘటిత రంగంలో కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో అటల్ పెన్షన్ యోజనను ప్రవేశపెట్టింది.
వయసు..
NPS: 8 నుంచి 70 ఏళ్ల వయసు వారు ఎన్పీఎస్లో చేరేందుకు అవకాశం ఉంది. 75 ఏళ్ల వయసు వరకూ ఖాతాను కొనసాగించవచ్చు.
APY: 18 నుంచి 40 ఏళ్ల వయసు గల వారు ఈ ఖాతాలో చేరవచ్చు.
ఎవరు అర్హులు?
NPS: భారతీయులు గానీ, ఎన్నారైలు గానీ ఎన్పీఎస్ ఖాతాను తెరవొచ్చు.
APY: భారతీయ నివాసితులు ఎవరైనా ఈ ఖాతాను తెరిచే వీలున్నప్పటికీ.. 2022 అక్టోబర్ 1వ తేదీ తర్వాత ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకంలో చేరేందుకు అనర్హులని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించింది.
ఖాతా రకం..
NPS: టైర్-1, టైర్-2 అని రెండు రకాల ఖాతాలు ఉంటాయి. చందాదారులు ముందుగా టైర్-1 ఖాతాలో పెట్టుబడులు ప్రారంభించాలి. తమ అభీష్టానుసారం టైర్-2 ఖాతాలో పెట్టుబడులు పెట్టవచ్చు.
APY: ఇందులో ఒకే ఖాతా ఉంటుంది.
పెట్టుబడులు..
NPS: ఎంత పెట్టుబడులు పెట్టాలనేది పెట్టుబడిదారులు ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ.1000 డిపాజిట్ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు.
APY: అటల్ పెన్షన్ యోజనలో ప్రభుత్వ సూచనల మేరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడుల మొత్తం ఎంపిక చేసుకునే వీలులేదు. 18 సంవత్సరాల వయసులో చేరిన వారు 42 ఏళ్ల పాటు కాంట్రీబ్యూట్ చేయాల్సి ఉంటుంది. రూ.42 నుంచి రూ.210 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 40 ఏళ్ల వయసులో చేరిన వారు 20 ఏళ్ల పాటు కాంట్రీబ్యూట్ చేయాలి. రూ.291 నుంచి గరిష్ఠంగా రూ.1454 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రభుత్వ సహకారం..
NPS: ఇందులో మదుపుదారులే పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వ సహకారం ఉండదు.
APY: ఇందులో ప్రభుత్వం కొంత సహకారం అందిస్తుంది.
పెన్షన్ ఎంత?
NPS: ఎంత పెన్షన్ వస్తుందనేది పెట్టుబడి, రాబడిపై ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా చెప్పలేం.
APY: రిటైర్మెంట్ తర్వాత కచ్చితమైన పెన్షన్ వస్తుంది. చందాదారులకు 60 ఏళ్లు నిండిన తర్వాత వారు చెల్లించిన చందాను అనుసరించి రూ.1000 నుంచి రూ.5వేల వరకు హామీ ఇచ్చిన ప్రకారం పింఛను మొత్తాన్ని పొందుతారు.
పన్ను ప్రయోజనాలు..
NPS: ఈ పథకం ద్వారా పెట్టుబడిదారులు రూ. 2 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందొచ్చు.
APY: ఈ పథకంలో ఇకపై పన్నుచెల్లింపుదారులు చేరేందుకు అనర్హులు.
ముందస్తు విత్డ్రాలు..
NPS: టైర్-2 ఖాతాలో నిధులను ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. కానీ, టైర్ -1 ఖాతాలో విత్డ్రాలకు నియమ నిబంధనలు వర్తిస్తాయి. పదవీ విరమణ నాటికి ఉన్న మొత్తంలో కనీసం 40% యాన్యుటీల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ స్వచ్ఛంద విరమణ చేస్తే కనీసం 80% మొత్తాన్ని యాన్యుటీలకు కేటాయించాలి. ఒకవేళ పదవీవిరమణ కంటే ముందే చందాదారుడు మరణిస్తే, పూర్తి మొత్తాన్ని నామినీ/చట్టబద్ధమైన వారసులకు అందజేస్తారు.
APY: ఈ పథకంలో ముందస్తు విత్డ్రాలను అనుమతించరు. అయితే, పెట్టుబడిదారుడు అనుకోకుండా మరణించినా లేదా వైద్య అత్యవసర పరిస్థితిల్లో ముందస్తు విత్డ్రాలను అనుమతిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన డిక్లరేషన్తో కూడిన చట్టపరమైన పత్రం. -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన