Retirement Corpus: పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి..
ఇంటర్నెట్ డెస్క్: ఎవరికైనా వారి జీవన ప్రయాణంలో పదవీ విరమణ అనంతర జీవితం చాలా ముఖ్యమైనది. అన్ని ప్రణాళికల కంటే పదవీ విరమణ ప్రణాళికే కీలకమైనదని ఆర్థిక నిపుణులు, అనుభవజ్ఞులు చెబుతున్న మాట. అయితే, పదవీ విరమణ అనంతరం మిగతా జీవిత కాలానికి రూ.1 కోటి సరిపోతుందా? లేదా? అనేది ఇక్కడ చాలా మందికి ఒక సందేహం. రూ.1 కోటి గణనీయమైన మొత్తంగా అనిపించినప్పటికీ.. వ్యక్తుల జీవనశైలి, ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను లెక్కించడం వంటి అనేక కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పదవీ విరమణకు సంబంధించి ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇక్కడ చూడండి.
జీవనశైలి, ఖర్చులు
హాయిగా రిటైర్ కావడానికి ఎంత డబ్బు సరిపోతుందని మీరడిగితే.. సరిపోయే సమాధానం అందరి వద్దా ఉండదు. దీనికి ప్రతి వ్యక్తికి వారి జీవనశైలి ప్రకారం లెక్కించాలి. వివిధ వ్యక్తులకు పదవీ విరమణ నిధికి సంబంధించిన కీలకమైన అంశాలలో ముఖ్యమైనది ఏంటంటే వారు ఊహించని జీవనశైలి, ఖర్చులు. ఈ రోజు ఉన్న జీవనశైలి 60 ఏళ్ల వయసులో ఉండకపోవచ్చు. భిన్నంగా ఉండొచ్చు. మీరు మధ్యస్థ వయసులో ఉన్న ఖర్చుల ప్రకారం రూ.1 కోటి అంటే గొప్పగా అనిపించినప్పటికీ, పదవీ విరమణ తర్వాత సంవత్సరాలలో అవసరాలు భిన్నంగా ఉండొచ్చు. కొందరు పొదుపు జీవనశైలిని ఇష్టపడవచ్చు. మరికొందరు ప్రయాణాలు, సౌకర్యవంతమైన విశ్రాంతి, మెరుగైన ఆరోగ్య సంరక్షణ.. ఇంకా ఇతర కార్యకలాపాల పరంగా అధిక అంచనాలను కలిగి ఉండొచ్చు. కాబట్టి, వీటన్నింటికీ అవసరమైన నిధులను అంచనా వేయడానికి పదవీ విరమణ తర్వాత వారి ఖర్చులను అంచనా వేయడం చాలా ముఖ్యం. మీ పదవీ విరమణ నిధిని ప్లాన్ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ జీవనశైలిలో మార్పులను పరిగణించండి.
ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా కాలక్రమేణా డబ్బుకు సంబంధించిన కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీనివల్ల డబ్బు తక్కువ విలువైనదిగా మారుతుంది. ఈ రోజు రూ.1 కోటి విలువైనదిగా అనిపించవచ్చు. కానీ, అధిక ద్రవ్యోల్బణం, సామాజిక భద్రత లేకపోవడం వల్ల భారత్లో మనుగడ సాగించడానికి ఇంకా పెద్ద మొత్తమే అవసరం పడొచ్చు. వస్తువులు, సేవల ధరలు పెరిగే కొద్దీ, పదవీ విరమణ ప్రణాళికలో మీ పొదుపు విలువ తగ్గిపోతుంది. పదవీ విరమణ ప్రణాళికను ఎంపిక చేసుకునేటప్పుడు ద్రవ్యోల్బణం రేటును పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కాలక్రమేణా పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశ ఆరోగ్య సంరక్షణ విభాగాలు ఎప్పటికప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్న కారణంగా.. ఖర్చులు కూడా బాగా పెరుగుతున్నాయి. వైద్య చికిత్సలు, బీమాతో పాటు వీటికి సంబంధించిన ఇతర ఖర్చులు పదవీ విరమణ ప్రణాళికలో కీలక భాగంగా ఉండాలి. పదవీ విరమణ వయసులో ఎటువంటి హెచ్చరిక లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ బీమా ఖరీదవుతుంది. కాబట్టి, వైద్య ఖర్చులు, ఆరోగ్య బీమా కోసం ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీకు వైద్య బీమా లేకుంటే, పదవీ విరమణ నిధిలో ఊహించని తరుగుదలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఆయుర్ధాయం
ఆరోగ్య సంరక్షణతో పెరిగిన ఆయుర్ధాయం.. పురోగతికి సంబంధించిన సానుకూల ఫలితం. దీనివల్ల పదవీ విరమణ అనంతరం మరింత ఎక్కువ కాలం నిధి అవసరం. ఆయుర్ధాయం ఎంత ఎక్కువ ఉంటే, మరింత ఎక్కువ నిధి అవసరం పడుతుంది. పదవీ విరమణ తర్వాత చివరి దశలో జీవన వ్యయాలు ఎక్కువే ఉంటాయి. ఉదాహరణకు 60 ఏళ్ల వయసులో రూ.50 వేల నెలవారీ ఖర్చుతో ప్రారంభిస్తే.. 80 ఏళ్లు చేరుకునే సమయానికి (సగటు వార్షిక ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉంటే) నెలవారీ ఖర్చు రూ.1.32 లక్షలకు చేరుకుంటుంది.
రూ.1 కోటి..ఎంత కాలం?
ఇది ఒక వ్యక్తి వ్యయంపై ఆధారపడి ఉంటుంది. పదవీ విరమణ చేసిన వ్యక్తులు సంప్రదాయ పథకాల్లో పెట్టుబడి పెడతారు కాబట్టి, సగటు వార్షిక రాబడి 7% అనుకుందాం. ప్రతి నెలా రూ.50 వేలు ఖర్చు చేస్తే, 30 ఏళ్ల 4 నెలల వరకు సరిపోతుంది. అదే రూ.75 వేలు ప్రతి నెలా ఖర్చు చేస్తే 20 ఏళ్ల 7 నెలల వరకు సరిపోతుంది. ప్రతి నెలా రూ.1 లక్ష వరకు ఖర్చు చేస్తే, రూ.1 కోటి నిధి 12 ఏళ్ల 3 నెలల వరకు మాత్రమే సరిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన డిక్లరేషన్తో కూడిన చట్టపరమైన పత్రం. -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..