Reliance Jio: ఐపీఎల్‌ వేళ జియో కొత్త ప్లాన్‌.. రూ.49తో 25జీబీ డేటా

Reliance Jio: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం కొత్త డేటా ప్లాన్‌ తీసుకొచ్చింది.

Published : 22 Mar 2024 15:02 IST

Reliance Jio | ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ వేళ ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) కొత్త డేటా ప్లాన్‌ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్‌ (prepaid plan) యూజర్ల కోసం ‘‘అన్‌లిమిటెడ్‌ డేటా’’ పేరుతో రూ.49 రీఛార్జి ప్లాన్‌ ప్రవేశపెట్టింది. జియో తీసుకొచ్చిన కొత్త డేటా ప్లాన్‌ ఒక రోజు వ్యాలిడిటీతో 25జీబీ డేటా అందిస్తోంది. యాక్టివ్‌ బేస్‌ ప్లాన్‌ ఉంటేనే దీన్ని రీఛార్జ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.  

వాట్సప్‌ పిన్‌ ఫీచర్‌ మరింత మెరుగ్గా.. ఇకపై 3 మెసేజ్‌ల వరకు

అత్యధిక డేటా కోరుకొనే వారి కోసం జియో ఇప్పటికే రెండు డేటా ప్యాక్‌లను అందిస్తోంది. 90 రోజుల వ్యాలిడిటీ, 150జీబీ డేటాతో రూ.667 ప్లాన్‌ తీసుకొచ్చింది. అయితే ఇది కేవలం డేటా వోచర్‌ మాత్రమే. రోజువారీ పరిమితి ఏమీ ఉండదు. కావాలంటే మొత్తం ఒకేసారి వాడుకోవచ్చు. మరోవైపు రూ.444 ప్లాన్‌లో 100 జీబీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 60 రోజులు. ఈ రెండు డేటా ప్యాక్‌లకు బేస్‌ ప్లాన్‌ ఉండాల్సిందే. వీటికి వాయిస్‌ కాలింగ్‌, ఎస్సెమ్మెస్‌ వంటి ప్రయోజనాలేమీ ఉండవు. మ్యాచులను ఎంజాయ్‌ చేయాలనుకునేవారు ఈ ప్లాన్లను పరిశీలించొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని