Reliance Jio: ఆ రెండు పాపులర్‌ ప్లాన్లను తొలగించిన జియో

Eenadu icon
By Business News Team Published : 30 Jan 2025 13:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Reliance Jio | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించింది. వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొత్త ప్లాన్లను పరిచయం చేసిన జియో.. అదే సమయంలో పాత ప్లాన్లను తీసేసింది. ఇప్పటివరకు అందిస్తున్న రూ.189, రూ.479 రీఛార్జి ప్లాన్లను తన వెబ్‌సైట్‌ నుంచి పూర్తిగా తొలగించింది.

తక్కువ డేటా, ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రీఛార్జి ప్లాన్లు కావాలనుకొనే యూజర్ల కోసం జియో గతంలో రూ.189 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు అందించేది. 2జీబీ డేటా కూడా లభించేది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. దీంతో పాటు 84 రోజుల వ్యాలిడిటీతో రూ.479 ప్లాన్‌ అందుబాటులో ఉండేది. అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌, 1000 ఎస్సెమ్మెస్‌లు, 6జీబీ డేటా వంటి ప్రయోజనాలు లభించేవి. వాల్యూ ప్లాన్స్‌గా వీటిని వ్యవహరించేవారు.

ట్రాయ్‌ ఆదేశాలకు అనుగుణంగా రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్లను ఇటీవల జియో ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీతో రూ.458 ప్లాన్‌, 365 రోజుల వ్యాలిడిటీతో రూ.1958 ప్లాన్‌ తీసుకొచ్చింది. ఈ ప్లాన్లపై జియో టీవీ, సినిమా(నాన్‌- ప్రీమియం), క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయాలు జోడించింది. ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ట్రాయ్‌ పేర్కొన్న నేపథ్యంలో ఆ ప్రయోజనాలు అలాగే ఉంచుతూ ప్లాన్ల ధరల్ని తగ్గించింది. రూ.458 ప్లాన్‌ను రూ.448కు, రూ.1958 ప్లాన్‌ను రూ.1748కు తగ్గించింది. వాల్యూ ప్లాన్లను తొలగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు