SM REITS: చిన్న, మధ్యస్త REITS ద్వారా స్థిరాస్తిలో పెట్టుబడులు.. సురక్షితమేనా?
తరతరాలుగా భారతీయులు స్థిరాస్తి, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులను గౌరవిస్తున్నారు. మారుతున్న కాలంలో స్థిరాస్తి పెట్టుబడులకు మారో రూపమే SM REITS.. వీటి గురించి తెలుసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: ఏదైనా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలు, స్థిరాస్తి రెండూ అత్యంత కీలకం. స్థిరాస్తి వృద్ధికి కార్పొరేట్ రంగంలో ఆఫీస్ స్పేస్తో పాటు పట్టణ ప్రాంతాల్లో వసతి డిమాండ్ బాగా కలిసి వచ్చింది. దేశంలో ఈ రెండు రంగాల ప్రాముఖ్యత, వృద్ధిని ప్రొత్సహించడానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ నిధుల కొరత కారణంగా, అదనపు ఫైనాన్సింగ్ మార్గాలను ఏర్పాటు చేయడం అత్యవసరమైంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెరగడానికి భారత్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (REITS)ను ‘సెబీ’ 2007లో ప్రవేశపెట్టినా.. కొన్ని నిబంధనలు సవరించి 2014లో ఆమోదించింది.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(REITS)
కాస్త డిమాండ్ ఉన్న ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే పెట్టుబడి లక్షలు/కోట్లలో ఉండాలి. దీనికి అందరు సిద్ధంగా ఉండరు. అదే REITSలో పెట్టుబడి అయితే వేలు/లక్షల్లో సరిపోతుంది. ఎలాగైతే మదుపుదార్లు స్టాక్స్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేస్తారో ఈ REITSలో యూనిట్లు కొనుగోలు చేయొచ్చు. రూ.10 వేల పెట్టుబడితో లాట్లో ఒక యూనిట్ను కొనుగోలు చేయొచ్చు. మనం యూనిట్లు కొనడం ద్వారా సమకూరిన నిధులతో ట్రస్టీలు వివిధ రకాలైన ఆస్తుల కొనుగోలు, నిర్వహణ, లీజు వంటి కార్యకలాపాలపై పెట్టుబడులు పెడతారు. తద్వారా ఆ ఆస్తుల నుంచి లభించే లాభాలను వాటాదారులకు చెల్లిస్తారు. అంతేకాకుండా ప్రతి ఏడాది సంబంధిత ఆస్తి విలువ పెరుగుతుంది కాబట్టి, కొనుగోలు చేసిన యూనిట్ల విలువ కూడా అదే విధంగా పెరుగుతుంది.
చిన్న, మధ్యస్త రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(SM REITS)
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఈ నెల ప్రారంభంలో REIT నిబంధనలను సవరించి.. చిన్న, మధ్యస్త రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల(SM REITS) ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. SM REITSకు సంబంధించిన అన్ని పథకాలు తప్పనిసరిగా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయి ఉండాలి. ఐపీఓలో పెట్టుబడిదారుడి కనీస సబ్స్క్రిప్షన్ రూ.10 లక్షలు. కొత్త సెబీ నిబంధనల ప్రకారం SM REITS కనీస కార్పస్ రూ.50 కోట్లు. ఇవి కనిష్ఠంగా 200 మంది పెట్టుబడిదారులకు యూనిట్లను జారీ చేయడం ద్వారా రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల కంటే తక్కువ మొత్తం వరకు నిధిని సేకరించవచ్చు. ఈ ఫండ్ను నిర్వహించే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ కనీస నికర విలువ రూ.20 కోట్లకు తగ్గకుండా ఉండాలి. అందులో రూ.10 కోట్లు లిక్విడ్ మనీ అయి ఉండాలి.
పెట్టుబడులకు రక్షణ
SM REITSను పర్యవేక్షించడానికి ప్రత్యేక ట్రస్టీ కూడా ఉంటారు. SM REIT పథకాల యూనిట్లు దేశవ్యాప్త ట్రేడింగ్ టెర్మినల్స్ను కలిగి ఉన్న గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీలలో తప్పనిసరిగా లిస్ట్ అవ్వాలని సెబీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ స్కీముల్లో కనీసం 95% పెట్టుబడులు పూర్తిగా డెవలప్ చేసి, రాబడిని అందిస్తున్న ఆస్తుల్లో ఉండాలి. ఇందులో వాణిజ్య ఆస్తులు, అద్దె గృహాలు, గిడ్డంగులు, హోటళ్లు వంటివి ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ కనీసం 5% యూనిట్లను, లిస్టింగ్ తర్వాత రెండేళ్లపాటు ఉంచుకోవాలి. పెట్టుబడిదారులు ఇప్పుడు కనీసం రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా అద్దెకు ఇచ్చే స్థిరాస్తి పాక్షిక యాజమాన్యాన్ని కలిగి ఉంటారు. ఈ సంస్థ రియల్ ఎస్టేట్ ఆస్తుల సమాచారంతో సహా దాని అన్ని పథకాలను వివరించే వెబ్సైట్ను కూడా నిర్వహించాలి.
రిటైల్ పెట్టుబడి
రిటైల్ ఇన్వెస్టర్.. ఐపీఓలో లేదా లిస్టింగ్ తర్వాత SM REITS యూనిట్లను కొనుగోలు చేయొచ్చు. వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయించొచ్చు. SM REIT పథకాలు, యూనిట్ల జారీ ద్వారా భారతీయ, విదేశీ పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించవచ్చు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు 8-10% వార్షిక రాబడిని ఆశించొచ్చు. SM REITSలో పెట్టుబడిదారులకు పన్ను నిబంధనలు REITS మాదిరిగానే ఉంటాయి. డివిడెండ్ పై పన్ను వర్తించదు.
పెట్టుబడి సురక్షితమేనా?
చిన్న, మధ్య తరహా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పాక్షిక యాజమాన్యాన్ని ప్రోత్సహించడంతో పాటు పెట్టుబడిదారుల ప్రయోజనాలకు మెరుగైన రక్షణ అందించడానికి సెబీ పర్యవేక్షణ ఉంటుంది. పెద్ద రీట్లు ఇప్పటికీ కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, అవి రిస్క్లను కలిగి ఉంటాయి. SM REITS పథకాలకు సంబంధించిన 95% ఆస్తులు పూర్తిగా అభివృద్ధి చెంది, అద్దె, లీజ్ వంటి ఆదాయలను కలిగి ఉంటాయి. కాబట్టి, ఇందులో రాబడిపై రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టయినందున SM REITS ఎక్కువ పారదర్శకతను కలిగి ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన డిక్లరేషన్తో కూడిన చట్టపరమైన పత్రం. -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట