కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు.
కమీషన్ల కోసం విదేశాలకు యువకులను తరలిస్తున్న ముఠా
గుట్టురట్టు చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు
జగిత్యాల జిల్లాకు చెందిన ఏజెంట్ అరెస్టు
సిరిసిల్ల గ్రామీణం, న్యూస్టుడే: ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. ఆ దేశంలో ఉన్న చైనా కంపెనీ యువకులతో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ‘సిరిసిల్ల పురపాలక సంఘం పరిధి పెద్దూరుకు చెందిన అతికం లక్ష్మి తన కుమారుడు అతికం శివ ప్రసాద్ కంబోడియాలో ఇబ్బంది పడుతున్నాడంటూ నాలుగు రోజుల క్రితం సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం.
జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన కంచర్ల సాయిప్రసాద్ అనే ఏజెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపి, రూ.1.40 లక్షలు తీసుకుని శివ ప్రసాద్ను కంబోడియా దేశానికి పంపినట్టు తెలుసుకున్నాం. వాట్సప్లో శివప్రసాద్తో మాట్లాడాం. ‘అక్కడున్న చైనా దేశానికి చెందిన కంపెనీ కాల్ సెంటర్లో తాను పనిచేస్తున్నానని, కంపెనీ నిర్వాహకులు భారతీయుల ఫోన్ నంబర్లు ఇచ్చి లాటరీ, ఉద్యోగాల పేరుతో అమాయకులను మభ్యపెట్టి వారి ఖాతాల్లో డబ్బు దోచేసేలా తర్ఫీదు ఇచ్చారని, తనలాగే 500-600 మంది బాధితులు పనిచేస్తున్నారని, అందరితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని’ ఆయన వివరించారు. అనంతరం కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులకు సమాచారం అందించాం. అక్కడి పోలీసుల సహకారంతో శివ ప్రసాద్ను కాపాడాం. రెండు రోజుల్లో ఆయన భారత్కు చేరుకుంటారు. ఆయనతోపాటు అక్కడ ఉన్న బాధితులందర్నీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నాం’ అని ఎస్పీ తెలిపారు.
రూ.10 వేల కమీషన్ కోసం అక్రమాలు..
ఓ ముఠా కమీషన్ల కోసం యువకులను మభ్యపెట్టి అక్రమంగా కంబోడియాకు తరలిస్తున్న వైనం విచారణలో వెలుగులోకి వచ్చిందని ఎస్పీ వివరించారు. ‘అతికం లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ను అదుపులోకి తీసుకుని విచారించాం. అతను రూ.10 వేలు కమీషన్ తీసుకొని శివ ప్రసాద్ను లక్నోకు చెందిన సదాకత్ (ప్రస్తుతం సదాకత్ మాల్దీవులులో ఉన్నాడు) వద్దకు పంపినట్టు తెలుసుకున్నాం. అతను మరో రూ.10 వేలు కమీషన్ తీసుకొని పుణెలో ఉన్న అబిద్ అన్సారీ వద్దకు పంపించినట్టు, ఆయన బిహార్ రాష్ట్రానికి చెందిన షాదల్ (ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాడు) వద్దకు పంపగా, అతను శివ ప్రసాద్ను కంబోడియా దేశానికి పంపినట్టు తెలుసుకున్నాం’ అని ఎస్పీ తెలిపారు. కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశామని, పుణెలో ఉన్న అబిద్ అన్సారీని విచారించి..నోటీసు ఇచ్చి పంపించామని వివరించారు. జిల్లాలో ఇంకా ఎవరైనా ఇలా మోసపోయి ఉంటే స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నంబర్ 8712656411కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసాయనాల మాటున కరెన్సీ కట్టలు
విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారిపై గుట్టుగా తరలిస్తున్న రూ.7 కోట్ల డబ్బు కట్టలు రోడ్డు ప్రమాదం కారణంగా బయటపడ్డాయి. -
ఆరు ప్రాణాలు బలిగొన్న మద్యం
ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్కు చెందిన ఓ వ్యక్తి అయిదుగురు కుటుంబసభ్యులను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ (42) మద్యానికి బానిసై కుటుంబసభ్యులతో తరచూ గొడవ పడేవాడు. -
కుక్కల దాడిలో వృద్ధురాలి మృతి
వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంటు లక్ష్మి(70) శనివారం ఉదయం బహిర్భూమికి ఊరి చివరకు వెళ్లారు. -
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు పట్టా అందుకున్న కొద్ది రోజులకే మృత్యువాత పడిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. -
రూ.2 కోట్ల విలువైన మద్యం పట్టివేత
ఎన్నికల వేళ అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2 కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ ఠాణాలో సీఐ నాగార్జునగౌడ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
రేవణ్న లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల అదుపులో దేవరాజ గౌడ
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి వీడియోను లీక్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో నిందితుడు, ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భాజపా నేత దేవరాజ గౌడను చిత్రదుర్గం జిల్లా హిరియూరు గ్రామీణ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. -
ఇసుక లారీ ఢీ.. ఇద్దరు ప్రయాణికుల మృతి
బస్షెల్టర్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై శనివారం సాయంత్రం ఇసుక లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు, ఐఈడీ పేలి బాలిక మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతరి, బీజాపూర్ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ మావోయిస్టు, మరో బాలిక మృతి చెందారు. దంతరి జిల్లా బైసాముండా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.