కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. భారీగా మద్యం నిల్వలు ఉన్నట్లు జిల్లా ఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక ఎన్నికల పోలీసు విభాగానికి సమాచారం అందడంతో.. హనుమాన్జంక్షన్ సీఐ నరసింహమూర్తితో కలిసి ఆదివారం మధ్యాహ్నం మెట్లపల్లికి చేరుకున్నారు. స్థానిక గూడపాటి దుర్గాప్రసాద్కు చెందిన మామిడి తోటలోని గెస్ట్ హౌస్ను తనిఖీ చేశారు. గోవాకు చెందిన 1,210 కేసుల్లోని దాదాపు 58,080 క్వార్టర్ల మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.80లక్షల మేర ఉంటుందని తెలిపారు. స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. దుర్గాప్రసాద్తోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవి ఏ రాజకీయ పార్టీకి చెందినవి? వాటి వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నరసింహమూర్తి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
Crime: ఓ దొంగ తన చేతివాటం ప్రదర్శించేందుకు ఏకంగా విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకున్నాడు. అత్యంత భద్రత ఉండే విమానాశ్రయాల నుంచి ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకు తిరిగాడు. -
ఓటేసేందుకు వచ్చి.. మృత్యుఒడికి చేరి
ఓటుహక్కు వినియోగించుకునేందుకు యువత నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపారు. -
ఓటేయడానికి వెళుతూ.. కుమారుడు సహా దంపతుల మృత్యువాత
హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు సొంతూరు వెళుతున్న దంపతులు, ఎనిమిదేళ్ల వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రహదారి పక్కన మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద వీరు అల్పాహారం తింటుండగా.. -
ఎన్నికల విధుల్లో ఇద్దరు ఉద్యోగుల మృతి
వేర్వేరు ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం ఒకరు చనిపోగా, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఆదివారం రాత్రి మరొకరు మృతిచెందారు. -
ఇద్దరు వృద్ధుల దుర్మరణం
వేర్వేరు గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్తూ ఇద్దరు వృద్ధురాళ్లు మృతిచెందారు. ఒకరు ఓటు వేయకుండానే.. మరొకరు ఓటు వేశాక మరణించారు. -
ఐఈడీ బాంబులు పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పెట్టిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు బాలురు మృతి చెందారు. -
మహారాష్ట్రలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రగఢ్ కత్రన్గట్ట అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ vs లఖ్నవూ.. నేటి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్పై ప్రభావమెంత..?
-
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
-
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!