భార్య, కుమార్తెలను పారతో కొట్టి చంపాడు

గదిలో నీళ్లు ఆగిపోయాయన్న కోపంతో ఓ వ్యక్తి భార్యను, పద్నాలుగేళ్ల కుమార్తెను పారతో కొట్టి హత్య చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లా నంద్‌గ్రామ్‌ పోలీస్‌స్టేషను పరిధిలో ఈ దారుణం జరిగింది.

Published : 01 Oct 2022 05:52 IST

గాజియాబాద్‌ (యూపీ): గదిలో నీళ్లు ఆగిపోయాయన్న కోపంతో ఓ వ్యక్తి భార్యను, పద్నాలుగేళ్ల కుమార్తెను పారతో కొట్టి హత్య చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లా నంద్‌గ్రామ్‌ పోలీస్‌స్టేషను పరిధిలో ఈ దారుణం జరిగింది. సిహానీ చుంగీ ప్రాంతంలోని సందీప్‌ నగర్‌లో ఉన్న ఇంటిలో ఈ హత్యలు జరగడంతో పోలీసులు భర్తను అరెస్టు చేశారు. ఇలా జరిగినప్పటి నుంచీ ఆ దంపతుల కుమారుడు (17) కనిపించడం లేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని