ఔషధాలపై గొడవ.. విద్యార్థి కడుపు చీల్చిన షాపు యజమాని

Eenadu icon
By Crime News Desk Published : 28 Oct 2025 05:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

త్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో మెడికల్‌ షాపు యజమాని, ఓ న్యాయ విద్యార్థికి ఔషధాలపై తలెత్తిన చిన్న వాగ్వాదం హింసాత్మకంగా మారింది. దీంతో మెడికల్‌ దుకాణం యజమాని, అతడి అనుచరులు పదునైన ఆయుధంతో లా విద్యార్థి కడుపును చీల్చడంతో పాటు, రెండు చేతి వేళ్లు సైతం నరికేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కేశవ్‌పురానికి చెందిన అభిజీత్‌ సింగ్‌ చందేల్‌(22) కాన్పుర్‌ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన నివాసానికి సమీపంలో ఉన్న మెడికల్‌ షాపునకు అభిజీత్‌ ఆదివారం మందుల కోసం వెళ్లాడు. ఔషధ ధరల విషయంలో దుకాణ యజమాని అమర్‌ సింగ్‌ చౌహాన్‌తో తలెత్తిన వివాదం తీవ్రతరమైంది. యజమాని సహా అతని సోదరుడు విజయ్‌ సింగ్, వారి ఇద్దరు సహచరులు ప్రిన్స్‌ శ్రీవాస్తవ, నిఖిల్‌ తివారీలు అభిజీత్‌పై పాశవిక దాడికి పాల్పడ్డారు. బాధితుడి తలపై తొలుత బలంగా కొట్టారు. అనంతరం పదునైన ఆయుధంతో అభిజీత్‌ కడుపును చీల్చడంతో పాటు అతడి చేతి రెండు వేళ్లు నరికేశారు. దీంతో అభిజీత్‌ తీవ్రగాయాలతో రక్తపు మడుగులో రోడ్డు మీద పడిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకొన్న కుటుంబసభ్యులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అభిజీత్‌ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యజమాని చౌహాన్‌ సహా ముగ్గురు నిందితులను అరెస్ట్‌చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని