Nellore: రాకాసి అల.. మృత్యు వల

Eenadu icon
By Crime News Desk Published : 03 Nov 2025 04:56 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మైపాడు బీచ్‌లో ముగ్గురు యువకుల దుర్మరణం
తుమ్మలపెంట తీరంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

మైపాడు బీచ్‌లో మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు

ఇందుకూరుపేట, కావలి, ఆత్మకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని తీర ప్రాంతాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా, చెరువులో పడి మరొకరు గల్లంతయ్యారు. నెల్లూరు కోటమిట్టకు చెందిన హుమయున్‌(17), సమీద్‌(17), నారాయణరెడ్డిపేటకు చెందిన తాజిమ్‌(16) ముగ్గురు స్నేహితులు. వీరంతా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మధ్యాహ్నం మైపాడు బీచ్‌లో సేదతీరేందుకు వచ్చారు. తీరం వద్ద సరదాగా ఆడుతుండగా ఒక్కసారిగా మీదకు రాకాసి అలలు వచ్చాయి. ఒకరినొకరు కాపాడుకోవాలనే క్రమంలో మునిగిపోతూ రక్షించమని కేకలు వేశారు. మెరైన్‌ పోలీసులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విగత జీవులుగా మారిన యువకులను ఒడ్డుకు చేర్చారు. మృతదేహాలను  నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సుధాకర్‌ రెడ్డి, ఎస్సై నాగార్జున తెలిపారు.

  • సముద్రంలో చేపలు పడుతూ అదుపుతప్పి పడడంతో మత్స్యకారుడు కాటంగారి బ్రహ్మయ్య(34) మృతిచెందారు. కావలి మండలం తుమ్మలపెంట పంచాయతీ పెద్దరాముడుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులతో కలసి పడవలో బోగోలు మండలం జువ్వలదిన్నె హార్బర్‌ నుంచి చేపల వేటకు వెళ్లిన బ్రహ్మయ్య ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కావలి ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ఎస్సై తిరుమలరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
  • ఆత్మకూరుకు చెందిన నలిశెట్టి మహేష్‌(30) అనే యువకుడు స్థానిక చెరువులోకి ఈత కోసం దిగగా, లోతు ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి పడిపోయారు. సమీపంలోని అయ్యప్ప స్వామి భక్తులు కాపాడేందుకు ప్రయత్నించినా.. గల్లంతయ్యారు. పోలీసులకు సమాచారమివ్వడంతో ఈతగాళ్లతో గాలిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని