Road Accident: భార్య, కుమారుడి కళ్లెదుటే 3 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి

కారును వేగంగా నడుపుతూ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. 

Updated : 03 Feb 2024 01:26 IST

లఖ్‌నవూ: యూపీ (UP)లోని రాయ్‌బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకుపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టడమే కాకుండా చక్రాల మధ్యలో ఇరుక్కున్న బాధితుడిని మూడు కి.మీ లాక్కెళ్లడంతో అతడు మృతిచెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వీరేంద్ర కుమార్‌.. తన భార్య, ఐదేళ్ల కుమారుడితో కలిసి రాయ్‌బరేలీ నుంచి డాల్మౌ పట్టణానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఆ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో భార్య, కుమారుడు రోడ్డుపై పడగా, కారు చక్రానికి, ఫెండర్‌కు మధ్య వీరేంద్ర ఇరుక్కుపోయాడు. డ్రైవర్‌ కారును ఆపకుండా అలాగే మూడు కిలోమీటర్లు పోనిచ్చాడు. స్థానికులు గమనించి కారును ఆపి బాధితుడిని బయటకు తీశారు. డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు. వీరేంద్రను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. అతడి భార్య, కుమారుడు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని