అయిదేళ్లలో కుమ్ముడు
గుట్టుగా దాచుకున్న సంపదను అభ్యర్థులు నామపత్ర సమర్పణ వేళ కొంతైనా వెల్లడించాల్సి వచ్చింది. నామపత్ర సాక్షిగా వైకాపా అభ్యర్థులు భారీగానే ఆస్తులు పోగేసుకున్నట్టు తేటతెల్లమైంది. వలస పక్షుల్లా వాలిన మేరుగు నాగార్జున, చెవిరెడ్డి మూడు రెట్లు, మంత్రి సురేష్ రెట్టింపు సంపద కూడబెట్టుకున్నారు.
మేరుగు, చెవిరెడ్డి ఆస్తి మూడు రెట్లు
సురేష్ సంపద రెట్టింపు
భారీగా పోగేసుకున్న వైకాపా అభ్యర్థులు
తెదేపా నేతలపై అక్రమ కేసుల బాదుడు
నామపత్రం సాక్షిగా వాస్తవాలివీ
న్యూస్టుడే, యర్రగొండపాలెం
గుట్టుగా దాచుకున్న సంపదను అభ్యర్థులు నామపత్ర సమర్పణ వేళ కొంతైనా వెల్లడించాల్సి వచ్చింది. నామపత్ర సాక్షిగా వైకాపా అభ్యర్థులు భారీగానే ఆస్తులు పోగేసుకున్నట్టు తేటతెల్లమైంది. వలస పక్షుల్లా వాలిన మేరుగు నాగార్జున, చెవిరెడ్డి మూడు రెట్లు, మంత్రి సురేష్ రెట్టింపు సంపద కూడబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ తరచూ పేదలు, పెత్తందార్లు అంటూ వల్లె వేస్తున్న తరుణంలో ఆ పార్టీ అభ్యర్థులందరూ రూ.కోట్లకు పడగలెత్తిన వారు కావడం విశేషం. అయిదేళ్ల క్రితం వరకూ కేసుల ముఖం చూడని తెదేపా నాయకులపై, జగన్ ప్రభుత్వం కేసులు బనాయించిన విషయం కూడా నామపత్రాల్లో వెల్లడైంది.
సార్వత్రిక సమరానికి రోజులే మిగిలివున్న తరుణంలో తెదేపా, వైకాపా అభ్యర్థులు ఇటీవలే నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారి నామపత్రాలు పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలతో పాటు వైకాపా అభ్యర్థుల ఆర్థిక శక్తి కూడా తేటతెల్లమవుతోంది.
బాలినేని.. కారులేదంటే నమ్మాలి
రెండుసార్లు కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన ఒంగోలు వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక్క కారు కూడా లేదు. ఈయన ఆస్తి మాత్రం 2019కి ఇప్పటికీ రెట్టింపైంది. ఇక కుటుంబ సభ్యుల పేర కూడా బాగానే ఉన్నట్లు తెలిసింది. జిల్లాలోనే అప్పులు లేని ఎమ్మెల్యే అభ్యర్థి!
మంత్రివర్యా.. బాగుందయ్యా
గతంలో వై.పాలెం ఎమ్మెల్యేగా పోటీచేసి మంత్రి కొలువు దక్కించుకున్న ఆదిమూలపు సురేష్ ఆస్తులు 2019తో పోల్చితే రెట్టింపయ్యాయి. ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత మూటగట్టుకోవడంతో ఆయన నియోజకవర్గం మారి కొండపిలో వాలిపోయి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు.
బాగానే చెవికెక్కింది
ఒంగోలు పార్లమెంట్ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి 2019లో రూ.3.22 కోట్ల ఆస్తి ఉండగా 2024 నాటికి రూ.11.78 కోట్లకి చేరింది.
బూచేపల్లికి వందల ఎకరాలు..
దర్శి వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి 120 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీటిలో 2019 నుంచి ఇప్పటివరకు సుమారు 54 ఎకరాలు కొనుగోలు చేయగా, మిగతాది వారసత్వం కింద వచ్చింది. కొనుగోలు చేసిన వాటిలో ఎకరం రూ.2.5కోట్ల విలువ చేసే భూమి సైతం ఉంది.
మూడు రెట్లు ‘మెరుగు’పడ్డారు
ఎన్నికల వేళ సంతనూతలపాడులో వాలిన వైకాపా మంత్రి మేరుగు నాగార్జున కూడా అయిదేళ్లలో బాగానే సంపద పోగేశారు. 2019 నామినేషన్లో తన ఆస్తులు రూ.5.31 కోట్లుగా ఆయన ప్రకటించారు. 2024 నాటికి ఆయన సంపద రూ.14.03 కోట్లకు చేరడం గమనార్హం.
వైకాపా వచ్చాక ఎడాపెడా కేసులు
వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఎడాపెడా కేసులు నమోదు చేశారు. తెదేపా అభ్యర్థుల నామపత్రాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
- దామచర్ల జనార్దన్పై 18 కేసులుండగా అందులో 11 వైకాపా ప్రభుత్వం వచ్చాక నమోదైనవి.
- కొండపి అభ్యర్థి స్వామిపై 11 కేసులకు గాను వైకాపా వచ్చాక నమోదైనవి 10.
- ఎస్.ఎన్.పాడు అభ్యర్థి విజయ్కుమార్పై 5 కేసులు నమోదయ్యాయి.
- ఉగ్రనరసింహారెడ్డిపై 3, కందుల నారాయణరెడ్డిపై 09, ముత్తుముల అశోక్రెడ్డిపై 1, గూడూరి ఎరిక్షన్బాబుపై 05 కేసులు నమోదయ్యాయి(ఇవన్నీ వైకాపా వచ్చాకే!).
- కోడ్ ఉల్లంఘనులు: వైకాపా అభ్యర్థులపై తాజాగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
కుందురుకు ఒక్క ఎకరమూ లేదట..
- గిద్దలూరు వైకాపా అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడి అవినీతిపై ఆ పార్టీ నాయకులే ఆరోపణాస్త్రాలు సంధించారు. అయితే ఆయనకు కూడా ఎలాంటి భూమి లేదని నామపత్రం దాఖలు చేశారు.
- కొండపి తెదేపా అభ్యర్థి డోలా బాలవీరాంజనేయస్వామికి అతి తక్కువ ఆస్తిపాస్తులున్నాయి.
- మార్కాపురం తెదేపా అభ్యర్థి నారాయణరెడ్డికి వ్యవసాయ భూమి లేదు.
ఆభరణాలూ ఉన్నాయ్
- దర్శి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి 2.72 కిలోల బంగారంతోపాటు 6 కిలోల వెండి ఉంది.
- ఒంగోలు తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్కు 2 కిలోల బంగారం, మార్కాపురం వైకాపా అభ్యర్థి అన్నా రాంబాబుకు 1.9 కిలోల బంగారం, 15 కిలోల వెండి ఉంది.
- మంత్రి ఆదిమూలపు సురేష్, ఉగ్రనరసింహారెడ్డికి కిలోకు పైగా బంగారం ఉంది.
- ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో అత్యధికంగా 34 జీవిత బీమా పాలసీలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
[ 17-05-2024]
తెదేపాకు ఓటు వేశాడన్న ఆక్రోశంతో ఓ యువకుడిపై వైకాపా నాయకుడు కొడవలితో దాడి చేశాడు. -
కదులుతుందా యంత్రాంగం!
[ 17-05-2024]
ముందుగానే వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
పేదల జాగాలు.. దళారుల బేరాలు
[ 17-05-2024]
ప్రభుత్వం మీకు ఊరికి 5 కి.మీటర్ల దూరంలో స్థలాలిచ్చింది. అక్కడ రోడ్లు లేవు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయలేదు. -
ఊపిరి ఆగిపోతోందయ్యా!
[ 17-05-2024]
తాగునీరే వారి పాలిట శాపమైంది. ఫ్లోరైడ్ మహమ్మారి కోరలకు చిక్కి మూత్రపిండాల రోగులుగా మారారు. -
బకింగ్ హాంఫట్
[ 17-05-2024]
రహదారుల నిర్వహణ, మరమ్మతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదనేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. -
అనునిత్యం అప్రమత్తత అవసరం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
నిధులు లాగేసి.. నీళ్లు నిలిపేసి
[ 17-05-2024]
ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమంలో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. -
వక్ఫ్బోర్డు భూములకు రక్షణేదీ!
[ 17-05-2024]
పొదిలిలో కోట్లాది రూపాయల విలువైన వక్ఫ్బోర్డు భూములు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నా రక్షించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
నరసింహా.. పాలక వర్గం లేకుండానే వేలమా!
[ 17-05-2024]
దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన మండలంలోని పాతసింగరాయకొండ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జూన్ 16 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
పేలిన టైరు.. అదుపు తప్పిన కారు
[ 17-05-2024]
మండలంలోని రాయవరం గ్రామ శివారులోని వైద్యకళాశాలకు సమీపంలో కారు బోల్తాపడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. -
ఆస్తి గొడవ అంత్యక్రియల నిలిపివేత
[ 17-05-2024]
ప్రాణం ఉన్నంతవరకూ పట్టించుకోని ఆప్తులు..ఆ తర్వాత ఆస్తి కోసం పరుగు పరుగున వచ్చారు. -
ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి
[ 17-05-2024]
అభం శుభం తెలియని చిన్నారికి నాలుగేళ్లకే నిండు నూరేళ్లు నిండాయి.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM