Crime News: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనుమానాస్పద మృతి.. కనిపించకుండా పోయిన చెల్లెలు

జగిత్యాల జిల్లా కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందడం కలకలం రేపింది.

Updated : 29 Aug 2023 20:26 IST

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె దీప్తి (22) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం చేస్తోంది. రెండ్రోజుల క్రితం దీప్తి తల్లిదండ్రులు కోరుట్ల నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. ఇంట్లో దీప్తి, ఆమె చెల్లెలు మాత్రమే ఉన్నారు. ఇవాళ ఉదయం ఆమె చెల్లెలు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులు ఫోన్‌ చేస్తే దీప్తి, ఆమె చెల్లెలు స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి పక్కింటివారికి ఫోన్‌ చేశారు. పక్కింటివారు వెళ్లి చూడగా ఇంట్లో దీప్తి విగతజీవిగా పడి ఉండటం గమనించారు. అంతేకాకుండా దీప్తి చెల్లెలు ఇంట్లో కనిపించడం లేదు. ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయం తెలియడం లేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రవీందర్‌ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని