Crime News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి.. కనిపించకుండా పోయిన చెల్లెలు
జగిత్యాల జిల్లా కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందడం కలకలం రేపింది.
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె దీప్తి (22) సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రస్తుతం వర్క్ఫ్రం హోం చేస్తోంది. రెండ్రోజుల క్రితం దీప్తి తల్లిదండ్రులు కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో దీప్తి, ఆమె చెల్లెలు మాత్రమే ఉన్నారు. ఇవాళ ఉదయం ఆమె చెల్లెలు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లో ఉన్న తల్లిదండ్రులు ఫోన్ చేస్తే దీప్తి, ఆమె చెల్లెలు స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి పక్కింటివారికి ఫోన్ చేశారు. పక్కింటివారు వెళ్లి చూడగా ఇంట్లో దీప్తి విగతజీవిగా పడి ఉండటం గమనించారు. అంతేకాకుండా దీప్తి చెల్లెలు ఇంట్లో కనిపించడం లేదు. ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయం తెలియడం లేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రవీందర్ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు పట్టా అందుకున్న కొద్ది రోజులకే మృత్యువాత పడిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. -
రూ.2 కోట్ల విలువైన మద్యం పట్టివేత
ఎన్నికల వేళ అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2 కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ ఠాణాలో సీఐ నాగార్జునగౌడ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
రేవణ్న లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల అదుపులో దేవరాజ గౌడ
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి వీడియోను లీక్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో నిందితుడు, ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భాజపా నేత దేవరాజ గౌడను చిత్రదుర్గం జిల్లా హిరియూరు గ్రామీణ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. -
ఇసుక లారీ ఢీ.. ఇద్దరు ప్రయాణికుల మృతి
బస్షెల్టర్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై శనివారం సాయంత్రం ఇసుక లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు, ఐఈడీ పేలి బాలిక మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతరి, బీజాపూర్ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ మావోయిస్టు, మరో బాలిక మృతి చెందారు. దంతరి జిల్లా బైసాముండా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.