పారిశ్రామిక ప్రాంతం.. ప్రచారానికి లేదు వేసవి తాపం
అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే.
ఆర్కే-5 గనిలో ప్రచారం చేస్తున్న భాజపా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్
న్యూస్టుడే, శ్రీరాంపూర్: అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే. అభ్యర్థులకు వేసవి తాపాన్ని తీర్చే సెలయేర్లలా బొగ్గుగనులు కనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి కష్టం లేకుండా షిఫ్టు సమయాలకు అరగంట ముందు వెళ్తే సరి. పెద్ద మొత్తంలో విధులకు హాజరయ్యే కార్మికులు వందల సంఖ్యలో ఒకేచోట కనిపిస్తారు. నాయకులకు వేదికలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమూ ఉండదు. గనులపై ఎక్కడికక్కడ యాజమాన్యం వేసిన వేదికలు ఉంటాయి. గని బయట ప్రచారం చేయాలన్నా షామియానాలతో పనిలేదు. బ్యాటరీతో పనిచేసే ఒక మైకు తీసుకుని పోతే సరిపోతుంది. పెద్దగా ఖర్చులేకుండా హాయిగా ఉదయం చల్లపూట ప్రచారం ముగించుకోవచ్చు.
ఖర్చులేని ప్రచారమంటే ఇదే..
బొగ్గు గనుల్లో ఉదయం ఏడు గంటలకు విధులకు హాజరయ్యే కార్మికుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఉదయం ఏడు గంటలకు మొదటి బదిలీ కార్మికులతోపాటు, జనరల్ షిఫ్టులో పనిచేసేవారితో కలిపి పెద్ద సంఖ్యలో కార్మికులు ఉంటారు. రాత్రి షిఫ్టులో విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా మరికొంత మంది ఉంటారు. ఇలా ఉదయం ఏడు గంటలకు గనులపై ప్రచారానికి వెళ్లేవారికి మూడు బదిలీల్లో పనిచేసేవారు ఒక్కసారి తారసపడుతారు. నాయకులు వెళ్లి ఉపన్యాసాలు ఇవ్వడం, సమస్యల పేరిట చేతిలో చేయి కలపడం, ఇంకొంత చనువుంటే అలాయి బలాయి తీసుకోవడంతో ప్రచారం ముగుస్తుంది. అవసరమనుకుంటే పనిలో పనిగా గనులపై ఉండే క్యాంటీన్లలో కార్మికులు, కార్యకర్తలతో కలిసి నాలుగు ముచ్చట్లు చెప్పుకుంటూ అల్పాహారాన్ని పూర్తి కానిచ్చే వెసులుబాటూ ఉంటుంది. ప్రచారమంటే ఇలా ఉండాలని, కార్మికేతర క్షేత్రాల్లో పోటీచేసేవారు అసూయపడేలా బొగ్గు గనులపై నాయకులు సులభంగా పెద్ద ఖర్చులేకుండా ఎన్నికల ప్రచారం లాగించే వెసులుబాటు ఉంటుంది.
కార్మిక ఓటర్లదే నిర్ణయాధికారం
పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో అభ్యర్థుల గెలుపు ఓటములను కార్మిక కుటుంబాలే నిర్ణయిస్తాయి. పెద్దపల్లి పార్లమెంటరీ స్థానంలో మొత్తం 15,92,996 మంది ఓటర్లు ఉండగా.. అందులో కార్మికుల ఓట్లతోపాటు వారి కుటుంబ సభ్యులు, విశ్రాంతుల ఓట్లు దాదాపు సగం ఉంటాయి. సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ, ఎస్టీపీపీ, ఓరియంట్ సిమెంటు కర్మాగారం, సిరామిక్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. ఈ పార్లమెంటు స్థానంలో పరిధిలో ఉన్న పెద్దపల్లి, ధర్మపురి మినహా మిగతా అయిదు నియోజకవర్గాల్లో కార్మిక కుటుంబాల ఓట్లే కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు కార్మిక క్షేత్రంపై దృష్టిసారిస్తూ ప్రచారం చేపట్టారు. వేసవి కాలంలో ఎండలను తట్టుకుని ప్రచారం చేయడానికి అభ్యర్థులు చెమటోడ్చాల్సి వస్తోంది. బొగ్గు గనుల ప్రాంతంలో అభ్యర్థులకు ప్రచారం చేయడానికి గనుల ప్రాంతాలు అనువుగా కనిపిస్తున్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గాలను మినహాయిస్తే, మిగతా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్లు, కార్మిక ఓటర్ల వివరాలివీ. కార్మిక కుటుంబాల్లో ఒక్కో ఇంటికి సగటున నాలుగు ఓట్ల చొప్పున లెక్కేస్తే, 1.22 లక్షల మంది ఓటర్లు ఉంటారు. వీరు కాకుండా విశ్రాంత కార్మిక కుటుంబాల ఓట్లు నాలుగు లక్షల మేరకు ఉంటాయని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రాన్ని భారాస అప్పుల కుప్పగా మార్చింది
[ 03-05-2024]
ఒక ఆడబిడ్డగా జిల్లా అభివృద్ధ్యే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నా ఆదరించండి అని ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఓటర్లను అభ్యర్థించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
[ 03-05-2024]
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. -
గ్రంథాలయాన్ని సందర్శించిన డిగ్రీ విద్యార్థులు
[ 03-05-2024]
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు. -
ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా
[ 03-05-2024]
తనకు ఎంపీగా ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వైకాపా ఎంపీ అభ్యర్థి చౌహన్ సుదర్శన్ అన్నారు. -
ఘనంగా ఐ.ఎన్.టి.యు.సి. ఆవిర్భావ దినోత్సవం
[ 03-05-2024]
జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఐ.ఎన్.టి.యు.సి. ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
మా మద్దతు మిత్ర పక్షం కాంగ్రెస్ పార్టీకే: సీపీఐ
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తమ మద్దతు మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవని శంకర్ స్పష్టం చేశారు. -
భారాస ఎన్నికల ప్రచారం
[ 03-05-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల్ నాగపూర్లో శుక్రవారం భారాస నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం
[ 03-05-2024]
ఆదిలాబాద్ జిల్లా పోలీసులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు ముందే ఓటేశారు. -
డీఎల్ఎస్ఎ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సౌజన్య
[ 03-05-2024]
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా బోనగిరి సౌజన్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. -
గిరిజన పల్లెల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
[ 03-05-2024]
మండలంలోని వామన్ నగర్ అంబుగాం, గిరిగాం, లీమ్ గూడ, అట్నంగూడ గిరిజన పల్లెల్లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సీపీఎం మద్దతు కాంగ్రెస్ పార్టీకే..
[ 03-05-2024]
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్కే మద్దతు ఇవ్వాలని, ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సీపీఎం పార్లమెంటు స్థాయి సమావేశం తీర్మానించింది. -
ఉపాధి కూలీలను కలిసేందుకు.. డ్రైవర్ అవతారం ఎత్తి..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
కార్ల ప్రయాణం.. కాకూడదు ప్రమాదకరం
[ 03-05-2024]
ఒకప్పుడు కారంటే విలాసవంతమైన జీవితానికి ప్రతీక. ఇప్పుడు నిత్యావసర వినియోగమైపోయింది. ఉన్నత వర్గాలు మొదలుకొని సామాన్యుల వరకు కార్ల వినియోగం సాధారణమైంది. -
గుట్టుచప్పుడు కాకుండా అరెస్టులు.. బైంసాలో అసలేం జరుగుతోంది..
[ 03-05-2024]
గతంలో అల్లర్ల కారణంగా సున్నిత ప్రాంతంగా పేరొందిన భైంసా.. ఆ ముద్రను ఇప్పుడిప్పుడే చెరిపేసుకుంటోంది. పోలీసులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కృషితో మరక చెరిగిపోతుండగా కొత్తగా ఆర్థిక నేరాలు, గంజాయి విక్రయాలు, ఆన్లైన్ బెట్టింగ్, మట్కా, జూదం వంటి దందాలు చెడ్డపేరు తెస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
మాది సంక్షేమం.. వారిది సంక్షోభం
[ 03-05-2024]
‘ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాతో నాకు అవినాభావ సంబంధం ఉంది. సీఎం అయ్యాక మూడు సార్లు ఇక్కడికి వచ్చాను. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓటర్లు ఎటు మొగ్గితే ఆ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. -
ఓటమి భయంతో కాంగ్రెస్, భాజపా కుమ్మక్కు
[ 03-05-2024]
ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ఓటమి భయంతో కాంగ్రెస్, భాజపా పార్టీలు లోక్సభ ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. -
ముందస్తు పన్ను వసూళ్లు రూ. 2.13 కోట్లు
[ 03-05-2024]
బల్దియాలో ముందస్తు ఆస్తిపన్ను వసూళ్లకు స్పందన లభించింది. ఆస్తి పన్నులు ముందుగా చెల్లించేవారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏటా ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. -
ఆరు నెలల్లోగా బకాయిలు చెల్లిస్తాం
[ 03-05-2024]
జిల్లాలో పదేళ్ల కిందట ఫిక్స్డ్ డిపాజిట్లు, హోటల్ వ్యాపారం, ప్లాట్ల విక్రయం వంటి లావాదేవీలు కొనసాగించి గొలుసుకట్టు వ్యాపారంతో డిపాజిట్లు సేకరించిన యూనిక్ మార్కంటైల్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు ఎట్టకేలకు బకాయిలు చెల్లించేందుకు ముందుకొచ్చారు. -
సమస్యలపై స్పందించాలి.. పరిష్కారాలు పట్టాలెక్కాలి..
[ 03-05-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వేపరంగా అనేక సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారంతో పాటు మరిన్ని రైళ్లు ఆపాల్సిన అవసరముంది. గత కొంతకాలంగా ఇక్కడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు సమస్యలను రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించినా పూర్తిస్థాయిలో ఫలితాలు ఉండటం లేదు. -
వృద్ధులు,దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు
[ 03-05-2024]
ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఆ అవకాశం వినియోగించుకునేలా.. పోలింగ్ శాతం పెంచేలా ఎన్నికల సంఘం కిందటి శాసనసభ ఎన్నికల్లో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. -
భాజపా, కాంగ్రెస్ అంతర్గత ఒప్పందం
[ 03-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా, కాంగ్రెస్ అధిష్ఠానాలు అంతర్గత ఒప్పందం చేసుకున్నాయని భారాస జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ప్రభుత్వ విప్ ఆరోపించారు. -
అస్తవ్యస్తంగా.. భగీరథ!
[ 03-05-2024]
మిషన్ భగీరథ పథకం.. ఆచరణలో అలసత్వం కారణంగా క్షేత్రస్థాయిలో సమస్యలు తీరడం లేదు. చేపట్టిన పనులన్నీ అస్తవ్యస్తంగా ఉండటం, నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో.. తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పరిహారంపై ఆశలు..
[ 03-05-2024]
దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రతీలాల్ నాయక్ ఈయన గ్రామ శివారులోని ఏడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. కంకి చేతికొచ్చే దశలో వడగళ్ల వానతో పంట నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లింది. -
కాంగ్రెస్ చేరికల జోరు..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల సమయంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. నిన్నమొన్నటి వరకు భారాసలో పనిచేసిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన బడా నాయకులు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. -
ఎండ.. ప్రచండ..
[ 03-05-2024]
గతంలో ఎన్నడూలేని విధంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 6 గంటలకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు