logo

భారాస అభ్యర్థి నామినేషన్ దాఖలు

ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు చేశారు.

Updated : 23 Apr 2024 15:36 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట భారాస జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, అసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, అనీల్ జాధవ్ ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. అద్దె ఇంట్లో ఉంటున్న తన గురించి సీఎం రేవంత్ దొరగా సంభోదించడం విడ్డురంగా ఉందని సక్కు పేర్కొన్నారు. కాంగ్రెస్ సభకు జనం రాకపోవడంతో ఆపార్టీ ఓటమి ఖాయం అని ఎమ్మెల్యే అనిల్ జోస్యం చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని