నీతి ఆయోగ్ పథకం.. అమలైతే అభివృద్ధి యోగం
మారుమూల గిరిజన ప్రాంతమైన పెంబి మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కనీస వసతులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం.
వస్పల్లి, దోందారి గ్రామాలకు వెళ్లే మట్టి రహదారి
న్యూస్టుడే, పెంబి: మారుమూల గిరిజన ప్రాంతమైన పెంబి మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కనీస వసతులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. వర్షాకాలం వాగులు పొంగితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే గ్రామాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెంబి మండలాన్ని అదృష్టం వరించింది. ఇటీవల ఆకాంక్షిత బ్లాకుల అభివృద్ధి కార్యక్రమం (యాస్పిరేషనల్ బ్లాక్ డెవలప్మెంట్)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో అభివృద్ధికి నోచుకోని 500 మండలాలను ఎంపిక చేయగా అందులో తెలంగాణలోని 10 మండలాలకు చోటు దక్కింది. నూతనంగా ఏర్పడిన నిర్మల్ జిల్లా నుంచి పెంబి మండలం ఒక్కటే ఎంపిక కావడం విశేషం. దీంతో మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలకు సమస్యలు తీరతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని రంగాల్లో ప్రగతే లక్ష్యం
దేశంలో వెనకబడిన మారుమూల ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2018లో యాస్పిరేషనల్ జిల్లా డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభించింది. ఆ సమయంలో జిల్లాలను ఎంపిక చేసుకొని వాటిని అభివృద్ధి చేసింది. అవి సత్ఫలితాలు ఇవ్వడంతో కొనసాగింపుగా బ్లాక్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించింది. ఇందులో భాగంగా మండలాలను ఎంపిక చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా 500 బ్లాకులను గుర్తించింది. తెలంగాణలో 10 మండలాలను ఎంపిక చేయగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు మండలాలకు చోటు దక్కింది.
అయిదు అంశాలపై ప్రత్యేక దృష్టి
నీతి ఆయోగ్ పథకం ద్వారా వీటిని ఆదర్శ మండలాలుగా తీర్చిదిద్దడం కోసం అధికారులు బృందాలుగా ఏర్పడి విద్య-ఆరోగ్యం, పోషణ, వ్యవసాయం-నీటి వనరులు, సామాజిక స్థితిగతులు, ప్రాథమిక మౌలిక సదుపాయాలు అనే అయిదు అంశాలను 39 కొలమానాలుగా విభజించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. దీనికోసం కొన్ని రోజులుగా ఆయా గ్రామాల్లో పర్యటించి వెనకబాటుకు గల కారణాలపై గ్రామాల్లో సభలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు లబ్ధిదారులకు అందేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
గ్రామాల్లో పరిస్థితి అధ్వానం
పెంబి మండలంగా ఏర్పడి తొమ్మిదేళ్లయినా గడుస్తున్నా అభివృద్ధి చెందడం లేదు. మండల కేంద్రం నుంచి గ్రామాలకు రోడ్డు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వర్షాకాలంలో వాగులు పొంగడంతో మండల కేంద్రానికి సంబంధాలు తెగిపోతున్నాయి. అత్యవసర వైద్యం అందక మరణాలు సైతం సంభవిస్తున్నాయి. నీతి అయోగ్ పథకంలో మండలం ఎంపికతో వాగులపై వంతెనలు నిర్మించి రోడ్డు, విద్యుత్తు, వైద్యం, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరిస్తే బాగుంటుంది.
గాంధారి లింగన్న, ఎంగ్లాపూర్ గ్రామం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్కు 1,500 మంది పోలీసులతో బందోబస్తు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. -
పార్టీలు వేరైనా పాతకాపులమేగా
[ 12-05-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శనివారం మండలంలో సుడిగాలి ప్రచారం చేపట్టారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా కరంజి-టిలో భారాస నాయకులు ఎదురుపడ్డారు. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం
[ 12-05-2024]
అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని.. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ముగిసిన ఎన్నికల ప్రచారం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
నిబంధనల ఉల్లంఘన.. యథేచ్ఛగా విక్రయాలు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్కు 48 గంటల ముందు మద్యం విక్రయ కేంద్రాలు మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
ఆత్రం సుగుణను గెలిపించండి
[ 12-05-2024]
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ 2 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుస్తారని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా: గోడం నగేష్
[ 12-05-2024]
పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇస్తే, అభివృద్ధి చేసి చూపిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. శనివారం పొన్నారిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 12-05-2024]
రైతులకు రుణమాఫీ, రైతుబంధు ఇవ్వకుండా దగా చేసిన కాంగ్రెస్కు, మతం పేరిట రాజకీయం చేస్తున్న భాజపాకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే అనిల్జాదవ్ పేర్కొన్నారు. -
కదులుదాం..తరలుదాం
[ 12-05-2024]
ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇప్పటివరకు పార్టీల అభ్యర్థులు, నేతలు ఎంతగా ప్రయాసపడ్డారో.. ఎవరి వ్యూహాలు ఫలించాయో.. ప్రజల నిర్ణయం ఎలా ఉందో నిక్షిప్తం చేసేది రేపు.. -
ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం
[ 12-05-2024]
ప్రేమ వ్యవహారం ఒక యువకుడిని బలిగొనగా, మరొకరు గాయపడేలా చేసింది. ఘటన వివరాలను ఎస్పీ జానకి షర్మిల శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
మోదీ, కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు: వివేక్
[ 12-05-2024]
ప్రధాని మోదీ, భారాస అధినేత కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని, కేంద్రంలో ప్రజాపాలన కొనసాగాలంటే రాహుల్గాంధీ ప్రధాని కావాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. -
గులాబీ శ్రేణుల్లో జోష్..
[ 12-05-2024]
చెన్నూరు పట్టణంలో భారాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా శనివారం నిర్వహించిన బహిరంగ సభ ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
పోలింగ్ కేంద్రం నిర్వహణకు రూ.3 వేలు ఇవ్వడంపై విమర్శలు
[ 12-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ అధికారులకు భోజనం, ఇతర వసతుల కల్పన కోసం ఒక్కో పోలింగ్ కేంద్రానికి రూ.4 వేలు కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సస్పెన్షన్
[ 12-05-2024]
మంచిర్యాల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మహ్మద్ వాజిద్ అలీ సస్పెండ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్