ఓటర్లు @ 15,96,430
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది.
పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో తేలిన లెక్క
సవరణల తర్వాత తాజా జాబితా విడుదల
న్యూస్టుడే, మంచిర్యాల విద్యావిభాగం
ఓటు నమోదు దరఖాస్తు స్వీకరిస్తున్న సిబ్బంది (పాతచిత్రం)
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. కొద్ది రోజులుగా క్షేత్ర స్థాయిలో అధికారులు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి నుంచి కొత్తగా స్వీకరించిన దరఖాస్తుల వడబోత చేపట్టారు. అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించారు. మృతులు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని తొలగించారు. తాజా ఓటరు జాబితాను అధికారులు ప్రచురించారు. పెద్దపల్లి లోక్సభ పరిధిలో 7,87,705 మంది పురుషులు, 8,08,622 మంది మహిళలు, 103 మంది ఇతరులు కలుపుకొని మొత్తం 15,96,430 మంది ఓటర్లున్నారు. ఏడు నియోజకవర్గాల్లో కొత్తగా 12,194 మంది ఓటు హక్కు పొందగా, వివిధ కారణాలతో 11,858 మందిని తొలగించారు.
కొత్తగా 12,194 మందికి చోటు
ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. విద్యాసంస్థల్లో ఎలక్టోరల్ క్లబ్లతో చైతన్యం చేశారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించారు. దీంతో కొత్తగా 12,194 మందికి ఓటు హక్కు లభించింది. పట్టణ ప్రాంతాలైన రామగుండంలో 2,465 మంది, మంచిర్యాలలో 2,445 మంది ఓటు హక్కు పొందారు. రెండేసి చోట్ల ఓటు, మృతులు, ఉపాధి కోసం ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడే శాశ్వతంగా నివసిస్తున్న వారు.. ఇలా మొత్తం 11,858 మందిని జాబితా నుంచి తొలగించారు. మంచిర్యాలలో 3,169, రామగుండంలో 4,713 మందిని తొలగించారు.
మంచిర్యాలలో అత్యధికం
లోక్సభ పరిధిలో పెద్దపల్లి జిల్లాలో రామగుండం, మంథని, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలున్నాయి. అత్యధికంగా మంచిర్యాలలో 2,78,738 మంది ఓటర్లుండగా, అత్యల్పంగా బెల్లంపల్లిలో 1,76,514 మంది ఓటర్లున్నారు. మంచిర్యాల తర్వాత పెద్దపల్లి సెగ్మెంట్లో 2,57,192 మంది ఓటర్లున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కీలక ఘట్టం.. ఎవరికో పట్టం..
[ 12-05-2024]
దాదాపుగా రెండు నెలలుగా సాగిన రాజకీయ ప్రచారమంతా ఇప్పుడు ఓటర్ల చుట్టూ కేంద్రీకృతమవుతోంది. కీలక ఘట్టమైన పోలింగ్కు మరో 24 గంటలే మిగిలి ఉంది. -
పోలింగ్కు 1,500 మంది పోలీసులతో బందోబస్తు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. -
పార్టీలు వేరైనా పాతకాపులమేగా
[ 12-05-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శనివారం మండలంలో సుడిగాలి ప్రచారం చేపట్టారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా కరంజి-టిలో భారాస నాయకులు ఎదురుపడ్డారు. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం
[ 12-05-2024]
అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని.. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ముగిసిన ఎన్నికల ప్రచారం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
నిబంధనల ఉల్లంఘన.. యథేచ్ఛగా విక్రయాలు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్కు 48 గంటల ముందు మద్యం విక్రయ కేంద్రాలు మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
ఆత్రం సుగుణను గెలిపించండి
[ 12-05-2024]
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ 2 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుస్తారని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా: గోడం నగేష్
[ 12-05-2024]
పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇస్తే, అభివృద్ధి చేసి చూపిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. శనివారం పొన్నారిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 12-05-2024]
రైతులకు రుణమాఫీ, రైతుబంధు ఇవ్వకుండా దగా చేసిన కాంగ్రెస్కు, మతం పేరిట రాజకీయం చేస్తున్న భాజపాకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే అనిల్జాదవ్ పేర్కొన్నారు. -
కదులుదాం..తరలుదాం
[ 12-05-2024]
ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇప్పటివరకు పార్టీల అభ్యర్థులు, నేతలు ఎంతగా ప్రయాసపడ్డారో.. ఎవరి వ్యూహాలు ఫలించాయో.. ప్రజల నిర్ణయం ఎలా ఉందో నిక్షిప్తం చేసేది రేపు.. -
ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం
[ 12-05-2024]
ప్రేమ వ్యవహారం ఒక యువకుడిని బలిగొనగా, మరొకరు గాయపడేలా చేసింది. ఘటన వివరాలను ఎస్పీ జానకి షర్మిల శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
మోదీ, కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు: వివేక్
[ 12-05-2024]
ప్రధాని మోదీ, భారాస అధినేత కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని, కేంద్రంలో ప్రజాపాలన కొనసాగాలంటే రాహుల్గాంధీ ప్రధాని కావాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. -
గులాబీ శ్రేణుల్లో జోష్..
[ 12-05-2024]
చెన్నూరు పట్టణంలో భారాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా శనివారం నిర్వహించిన బహిరంగ సభ ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
రూ. వెయ్యి కోత.. ఎందుకీ తేడా?
[ 12-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ అధికారులకు భోజనం, ఇతర వసతుల కల్పన కోసం ఒక్కో పోలింగ్ కేంద్రానికి రూ.4 వేలు కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సస్పెన్షన్
[ 12-05-2024]
మంచిర్యాల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మహ్మద్ వాజిద్ అలీ సస్పెండ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్