logo

విద్యుత్ స్తంభం పైనుంచి పడి జేఎల్ఎం దుర్మరణం

విద్యుత్తు స్తంభం పైనుంచి కింద పడి జూనియర్ లైన్‌మెన్‌ దుర్మరణం చెందిన సంఘటన అదిలాబాద్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది.

Published : 29 Apr 2024 19:05 IST

ఎదులాపురం: విద్యుత్తు స్తంభం పైనుంచి కింద పడి జూనియర్ లైన్‌మెన్‌ దుర్మరణం చెందిన సంఘటన అదిలాబాద్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన ఎన్.పవన్ కల్యాణ్(23) సౌత్ జేఎల్ఎంగా నెలన్నర క్రితమే విధుల్లో చేరాడు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌లో విద్యుత్ సరఫరా లేదని లైన్‌మెన్‌తో కలిసి సరఫరా పునరుద్ధరించడానికి వెళ్ళాడు. విద్యుత్ సరఫరా నిలిపివేసి స్తంభంపై ఎక్కి మరమ్మతురులు చేసేప్పుడు విద్యుత్తు సరఫరా అయింది. దీంతో విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. రిమ్స్‌కు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని