logo

కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు

ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్‌ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.

Published : 30 Apr 2024 02:44 IST

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్‌ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది. సోమవారం ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగిన పరీక్షలో 643 మంది పదోతరగతి అభ్యర్థులకు 534 మంది హాజరయ్యారు. ఇంటర్‌లో 788 మందికిగానూ 684 మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరిగిన పరీక్షలో పదో తరగతిలో 21 మందికి 15 మంది పరీక్ష రాయగా ఇంటర్‌లో 270 మందికి 222 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు సజావుగా సాగుతున్నాయని డీఈవో యాదయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని