అగ్రనేతలొస్తున్నారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది.
పట్టు కోసం ప్రధాన పార్టీల కసరత్తు
- మే 5 నిర్మల్ రాహుల్గాంధీ
- మే 4 మంచిర్యాల కేసీఆర్
- మే 2 ఆసిఫాబాద్ రేవంత్రెడ్డి
ఈటీవీ - ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానాలతో విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారాసలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా విడుదలైన జాబితా ప్రకారం 16,50,175 మంది ఓటర్లతో ఆదిలాబాద్ లోక్సభ స్థానం విస్తరించి ఉంటే పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే మంచిర్యాల జిల్లా(మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు శాసనసభ స్థానాలతో కలిపి) 6,49,030 ఓటర్లను కలిగి ఉంది. ఉమ్మడిజిల్లాను పరిగణనలోకి తీసుకుంటే 22,99,205 ఓటర్లను కలిగి ఉంది. ప్రతిఓటు కీలకమైనందున అగ్రనేతల ప్రచారంపై దృష్టి సారించారు.
కాంగ్రెస్ వ్యూహం
ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఏప్రిల్ 22న ఆదిలాబాద్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటనతో ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ ఇప్పుడు కుమురంభీం, నిర్మల్ జిల్లాలపై దృష్టి సారించింది. మే 2న ఆసిఫాబాద్లో రేవంత్రెడ్డి సభతో ఆసిఫాబాద్, సిర్పూర్(టి)లో నియోజకవర్గాల్లో భారాసపై, 5న అగ్రనేత రాహుల్గాంధీ పర్యటనతో నిర్మల్లో భాజపాపై పైచేయి సాధించేలా వ్యూహరచన చేస్తోంది. ఖానాపూర్, ముథోల్, నిర్మల్ నియోజకవర్గాలతో కలిపి 7,37,416 ఓట్లు కలిగిన నిర్మల్ జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ప్రియాంకగాంధీ ఖానాపూర్ పర్యటన సత్ఫలితాన్నిచ్చిందని భావిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ పర్యటనతో నిర్మల్ జిల్లాపై దృష్టి సారించింది. జిల్లాకో పర్యటన చొప్పున ఇప్పటికే ఆదిలాబాద్ పూర్తి చేసిన సీఎం మే 2న ఆసిఫాబాద్, 5న రాహుల్తో కలిసి నిర్మల్ పర్యటన పూర్తి చేస్తే పెద్దపల్లి పరిధిలోకి వచ్చే మంచిర్యాల జిల్లా పర్యటన ఖరారు చేయాల్సి ఉంటుంది.
కేసీఆర్ భరోసా
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏప్రిల్ 16న ఆదిలాబాద్లో ఆత్రం సక్కు తరఫున శంఖారావం పూరించగా ఆ పార్టీ అగ్రనేత కేసీఆర్ మే 4న పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరఫున మంచిర్యాలలో నిర్వహించే రోడ్షో ఖరారైంది. పార్టీకి బలమున్న ఆసిఫాబాద్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాలతో కలిపి శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చెదరకుండా చూసుకోవాలని భారాస భావిస్తోంది. కేసీఆర్ బస్సు యాత్రలో ఆదిలాబాద్ జిల్లా లేదు. బస్సుయాత్ర ముగిశాక హెలిక్యాప్టర్ ద్వారా ఆదిలాబాద్, నిర్మల్లో కేసీఆర్ పర్యటన, మరో నేత హరీశ్రావుతో ఆదిలాబాద్, కేటీఆర్తో ఆసిఫాబాద్లో ప్రచార సభలు నిర్వహించాలని భారాస ప్రణాళిక చేస్తోంది.
భాజపా ప్రయత్నం
ఆదిలాబాద్లో పార్టీ అభ్యర్థి గోడం నగేష్ గెలుపును భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. సిట్టింగ్ స్థానమే కాకుండా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించినందున ఓటరు నాడి అనుకూలంగా ఉందనే ధీమా నేతల్లో ఉంది. కానీ కాంగ్రెస్, భారాస అగ్రనేతలు జరిపే పర్యటనలకు దీటుగా సభలు నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్లో ఆదిలాబాద్లో జరగాల్సిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, విదేశాంగ మంత్రి శివశంకర్ పర్యటనలు రద్దు కావటంతో మే మొదటి వారంలో ప్రధాని మోదీ, ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి, కేంద్రమంత్రి అమిత్షా సభలను ఖరారు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. అనుకూలిస్తే ఆసిఫాబాద్ - కాగజ్నగర్ కలిసేలా మోదీ, ఆదిలాబాద్ ఉట్నూర్ కలిసేలా యోగి, నిర్మల్ ముథోల్ కలిసేలా అమిత్షా సభలను ఏర్పాటుచేయాలని భావిస్తోంది. మంచిర్యాల జిల్లాలో రాష్ట్ర నాయకులతో ప్రచారం చేయిస్తే చాలన్నట్లుగా చూస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్యేక కేంద్రం.. మిశ్రమ ఫలితం
[ 16-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు, పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. -
కనిపిస్తే.. కరుస్తున్నాయి!
[ 16-05-2024]
జిల్లాలో శునకాలు బెంబేలెత్తిస్తున్నాయి. పని నిమిత్తం బయటకు వచ్చే వారిపై దాడులు చేసి కండలు పీకుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా కాలనీల్లో గుంపులుగా సంచరిస్తున్నాయి. -
రిమ్స్ ఒప్పంద ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
[ 16-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ టేకర్గా పని చేసే లక్ష్మి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సూపర్వైజర్ అకారణంగా తనను పనిలోకి రావొద్దంటూ బెదిరించారంటూ రాత్రి అక్కడే పడుకున్న ఆమె తెల్లవారుజామున మరుగుదొడ్డి శుభ్రం చేసే రసాయనం తాగేసింది. -
ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని సేవలు
[ 16-05-2024]
ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్)లలో ఇప్పటికే అందిస్తున్న అయిదు రకాల సాధారణ సేవలతోపాటు ఏడు రకాల ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
దిల్లీ దూరమనుకోలేదు..!
[ 16-05-2024]
ఓటర్లు ఎన్నికలపై ఎంత ఆసక్తి కనబరిచారనేది పోలింగ్ శాతాన్ని బట్టి తెలుస్తుంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. -
బోసిపోతున్న థియేటర్లు
[ 16-05-2024]
ప్రస్తుత ఉరుకులు పరుగుల జనజీవన గమనంలో ప్రజలు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. వాటి నుంచి కాసింత ఉపశమనం పొందాలని థియేటర్లను ఆశ్రయిస్తున్నారు. -
వద్దన్నా వినరు.. అక్రమాలు ఆపరు
[ 16-05-2024]
ప్రభుత్వ, అసైన్డ్, వివాదం, కోర్టు కేసుల్లో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయరాదనేది నిబంధన. ఒకవేళ ఎవరైనా ఇటువంటి స్థలాలను రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించాలి. -
బియ్యం దందా.. అధికారుల అండ!
[ 16-05-2024]
ఈ నెల 7న చింతలమానేపల్లి మండల కేంద్రం నుంచి పలు వాహనాల్లో 11 క్వింటాళ్ల రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా, టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల వేళ రూ.2.04 కోట్లు పట్టివేత
[ 16-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రూ.2,04,72,950 నగదు పట్టుకున్నట్లు ఎస్పీ సురేష్కుమార్ వెల్లడించారు. ఇదే కాకుండా రూ.2.40 లక్షల విలువైన 9.58 కిలోల గంజాయి, 14 గంజాయి మొక్కలను పట్టుకున్నామన్నారు. -
ఓటు హక్కుకు దూరం @ 2,21,397
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన క్రతువు ముగిసింది. ఇప్పుడంతా జూన్ 4న జరిగే కౌంటింగ్పైకి దృష్టి మళ్లింది. ఎవరు గెలుస్తారు. ఎన్ని ఓట్లు వస్తాయనే విషయంపై చర్చ నడుస్తోంది. -
144 సెక్షన్ అమలు
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి హాజీపూర్ మండలం ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట భద్రత చేపట్టాలని పాలనాధికారి బి.సంతోష్ ఆదేశించారు. -
పొంగిపొర్లిన మద్యం..!
[ 16-05-2024]
భగభగ మండుతున్న సూర్య ప్రతాపమో.. లేక అలవాటు పడ్డ ప్రాణమో.. తెలియదుగానీ.. చల్లచల్లగా.. అనుకుంటూ మందుబాబులు ఈ వేసవిలో ఎక్కువగా తాగేస్తున్నారు. -
డెంగీ నియంత్రణకు చర్యలు
[ 16-05-2024]
జిల్లాలో డెంగీ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా అదనపు పాలనాధికారి సబావత్ మోతీలాల్ తెలిపారు. -
పల్లె భళా.. పట్టణం డీలా
[ 16-05-2024]
పల్లె ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణాల్లో మళ్లీ అదే పరిస్థితి.. ఎక్కువగా నిరక్షరాస్యులు ఉంటారని అనుకున్న పల్లె ప్రజలు ఓటెత్తగా.. విద్యావంతులకు నిలయంగా ఉన్న పట్టణాల్లో ఓటు వేసేందుకు అనాసక్తి చూపిస్తున్నారని మళ్లీ రుజువైంది. -
అటకెక్కిన పరీక్షలు
[ 16-05-2024]
అక్షయ తృతీయ తిథి శుభదినంగా భావించిన రైతులు పంటల సాగుకు ముందుకెళ్తున్నారు. విత్తనాల కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో రైతులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం