logo

భాజపాను ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తాం

లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తామని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి.శ్రీనివాస్ ప్రకటించారు.

Published : 02 May 2024 17:07 IST

ఎదులాపురం: లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తామని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి.శ్రీనివాస్ ప్రకటించారు. స్థానిక జిల్లా కార్యాలయం కొమురంభీమ్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మతోన్మాద, ఫాసిస్టు భాజపా మూడోసారి ఎన్నికల్లో గెలిస్తే కర్షక, కార్మికుల హక్కులను కాలరాసి, రాజ్యాంగాన్ని మార్చే యోచన చేస్తున్నదని ఆరోపించారు. ఇందుకు గాను తమ పార్టీ భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా నిలుస్తుందన్నారు. సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం జ్యోతి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.వెంకటనారాయణ, కార్యదర్శి జే.రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని