logo

స్పందనకు 75 వినతులు

స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందనకు 75 వినతులు అందాయి. ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ జె.శివ శ్రీనివాసు, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల

Published : 13 Aug 2022 01:48 IST


అర్జీదారుల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ జేసీ శివశ్రీనివాసు, సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌ తదితరులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందనకు 75 వినతులు అందాయి. ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ జె.శివ శ్రీనివాసు, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. హుకుంపేట మండలం ముసిరిపాడు గ్రామానికి తాగునీటి సదుపాయం కల్పించాలని కె.ఆనందరావు వినతిపత్రం సమర్పించారు. పాడేరు మండలం జోడిమామిడి గ్రామంలో సీసీ రోడ్డు, అంగన్‌వాడీ భవనం నిర్మించాలని పి.నగేష్‌, కె.రాము, పి.చాందిని విన్నవించారు. గూడెంకొత్తవీధి మండలం గూడెం నుంచి గొందిపల్లి గ్రామానికి తారు రోడ్డు నిర్మించాలని కె.వెంకటేశ్వర్లు, డి.బంగారమ్మ, పి.భాగ్యలక్ష్మి, తదితరులు కోరారు. కార్యక్రమంలో డీఆర్‌వో బి.దయానిధి, ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారులు ప్రభాకరరావు, వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కొండలరావు, పంచాయతీరాజ్‌ ఈఈ లావణ్యకుమార్‌, గిరిజన సంక్షేమశాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, డీఈఓ రమేష్‌, డీఎల్‌పీవో కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని